Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పన్నుల భారంతోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుదల | వేదిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వేదిక
  • ➲
  • స్టోరి
  • Feb 25,2021

పన్నుల భారంతోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుదల

మన దేశంలో డీజిల్‌, పెట్రోల్‌ ధరలు దాదాపు రూ.100కు చేరుకున్నాయి. ఈ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ రేట్లతో సామాన్యుడు బతకలేని పరిస్థితి ఉంది. మోటార్‌ వెవికల్స్‌, టాక్సీలను ఆధారం చేసుకొని బతికే వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. పెట్రోల్‌, డీజిల్‌లపై ఆధారపడి నడిచే చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు మూతపడే పరిస్థితి ఉంది. కరోనా సంక్షోభ కాలంలో అంతర్జాతీయంగా రవాణా రంగం స్థంభించిన ఫలితంగా చమురు ధరలు అన్ని దేశాల్లో తగ్గాయి. కానీ, మనదేశంలోనే అంతర్జాతీయ ధరలకు విరుద్ధంగా సామాన్యుల నడ్డివిరిచే చమురు ధరలు పెరుగుతున్నాయి.
పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ప్రపంచ ముడిచమురు (క్రూడ్‌ ఆయిల్‌)పై ఆధారపడి ఉంటాయి. ముడిచమురు వెలికితీయడం, దాన్ని శుద్ది చేయడం, దాన్ని పంపిణీ చేయడాన్ని ఆధారం చేసుకొని పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను లెక్కించి ప్రకటిస్తున్నారు. దీని ప్రకారం మన దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు రోజు రోజుకు, గంట గంటకి హెచ్చు, తగ్గులు ఉంటున్నాయి. కానీ ఈ సంవత్సరకాలంలోనే ముడి చమురు ధర వాస్తవానికి 15శాతం తగ్గింది. కానీ ఇండియాలో ఆయిల్‌ ధరలు 7 నుంచి 11 శాతానికి పెరిగాయి. గత ఏడాది జనవరిలో ఒక బ్యారెల్‌ ముడి చమురు ధర 64.31 డాలర్లు నుంచి 54.79 డాలర్లకు తగ్గింది. కానీ దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ.75 నుంచి 86కు పెరిగాయి. వాస్తవానికి పెట్రోల్‌ రూ.32 మూలధర (బేస్‌ ధర) ఉంది. దీనికి రూ.33 కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ పన్ను సెస్‌ విధిస్తుంది. రాష్ట్ర పరిధిలో రూ.33 నుంచి 40 వరకు కమిషన్‌ వ్యాట్‌ డీలర్‌ కమిషన్‌ రూపంలో పన్ను విధిస్తుంది. అంటే మొత్తం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.86 నుంచి 90 వివిధ రాష్ట్రాల్లో మన దేశంలో వినియోగదారుడు వెచ్చించాల్సి ఉంటుంది. అంటే చమురుపై కేంద్ర ప్రభుత్వం 37శాతం రాష్ట్ర ప్రభుత్వాలు 23శాతం పన్ను వసూలు చేస్తున్నాయి. కేంద్రం పెట్రోల్‌ లీటర్‌కు రూ.20 నుంచి 33కు పన్ను పెంచింది. అంటే అసలు ధర కంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ట్యాక్స్‌లే ఎక్కువ.
కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే ట్యాక్స్‌ల్లో యూపీఏ ప్రభుత్వం 2015-2016లో 2.09లక్షల కోట్లు ఉంది. ఇప్పటి ఎన్డీఏ ప్రభుత్వం 2019-20 వరకు 2.88లక్షల కోట్లు వసూలు చేస్తుంది. అంటే గడిచిన ఐదేండ్లలో ఎన్డీఏ ప్రభుత్వం దాదాపుగా 90వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపింది. దీనికి ఏ మాత్రం తగ్గకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెంచుతున్నాయి. 2015-16లో 1.60 లక్షల కోట్ల పన్నులు వసూలు చేశాయి. ఇప్పుడు 2019-2020కి 2.21లక్షల కోట్లకు పెంచింది. అంటే పన్ను వేయడంలో ప్రజలపై భారాన్ని మోపడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. పన్ను విధింపు కారణంగానే పెట్రోల్‌, డీజిల్‌ రేటు పెరుగుతుంది అనేది వాస్తవం. పన్ను విధింపునకు సడలింపు ఇస్తే రేటు తగ్గుతుంది. ధరల పెంపు అంశం ప్రభుత్వాల మీద కాదు ప్రపంచ వాణిజ్యంపై ఆధారపడి ఉంటుంది అంటూనే ఏడా పెడా పన్నులు విధిస్తున్నారు. ప్రజలపై పన్నుల భారాలను మోపి ప్రభుత్వాల ఆదాయాలను పెంచుకునే చర్యే ఇది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పన్నులను ఏట్టి పరిస్థితుల్లో తగ్గించం. తగ్గిస్తే ప్రభుత్వ ఆదాయం పడిపోతుందని అంటున్నారు. ప్రభుత్వ ఆదాయం కోసం ప్రజలపై పన్ను విధించే ప్రభుత్వాలు కార్పొరేట్లకు మాత్రం రాయితీల మీద రాయితీలిస్తున్నాయి.
ప్రభుత్వాల ఆదాయాలకు ప్రజలపై పన్నుల భారమే మార్గం కాదు. మన దేశంలో గడిచిన 7ఏండ్లల్లో అనేక కార్పొరేట్‌ సంస్థలకు, అదానీలకు, అంబానీలకు రాయితీలు ఇచ్చారు. బ్యాంకు రుణాలను మాఫీ చేశారు. దేశ సహజ సంపదను అప్పనంగా కట్టబెట్టారు. ఓఎన్‌జీసీ వంటి సహజంగా లభించే నిక్షిప్తగనులను 'బడా కార్పొరేట్‌, పెట్టుబడిదారులకు ఉచితంగా ఇచ్చారు. కానీ ప్రజలను పట్టించుకోవడం లేదు. ప్రజలపై పన్నుల భారాన్ని అరికట్టి, చమురు ధరలను తగ్గించమంటే మాత్రం ఆదాయం పడిపోతుంది అంటున్నారు. ఒక వైపు కార్పొరేట్స్‌కు రాయితీలు ఇస్తూ, బ్యాంకు రుణాలను మాఫి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, ప్రజలపై మాత్రం కనికరం చూపించడం లేదు. పైగా ధరల అంశం ప్రపంచ వాణిజ్యంపై ఆధారపడి ఉంటుందని, చేతులు ఎత్తేస్తున్నారు. ఇది సరైంది కాదు. నిర్మలా సీతారామన్‌ రాష్ట్రాలు పన్నులు తగ్గించుకుంటే తగ్గించుకొండి మేము మాత్రం తగ్గించే ప్రసక్తిలేదని తెగేసి చెపుతున్నారు. అంటే ప్రజలపై వీరికి ఎంతటి ప్రేమో అర్థం అవుతుంది. కరోనా కష్టకాలంలో ధరల పెరుగుదలను అరికట్టి ప్రజలపై పన్నులను తగ్గించాల్సిన ప్రభుత్వం మరింత పెంచుతుంది. అలా వచ్చిన ఆదాయం ద్వారా ఏదైనా ప్రభుత్వరంగ సంస్థలను బాగు చేస్తుందనుకొంటే, ఎల్‌ఐసీ, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఐడీపీఎల్‌, బీహెచ్‌ఈఎల్‌, ఏయిర్‌పోర్ట్సు, నౌకాశ్రయాలు, రైల్వేలను వరుస పెట్టి అమ్ముతున్నారు. మరీ పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం ఏటు దారి మళ్లుతుందో అర్థం చేసుకోవచ్చు.

- పి. మహేష్‌
సెల్‌:9700346942





మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

లౌకిక భావనలను కాపాడాలి
బీసీ రిజర్వేషన్లలో మార్పులు రానున్నాయా?
రక్తస్రావ సంబంధ రుగ్మత హీమోఫీలియా..!
ఉన్నత విద్యా సంస్థలు - సామాజిక న్యాయం
ఏ ప్రయోజనాల కోసం..?
జనహృదయ విజేత..నర్రా రాఘవరెడ్డి
విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ ఎవరికోసం?
మొబైల్‌ మాయలో నేటి సమాజం
ప్రపంచ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టిన కరోనా..!
చిన్నారుల్లో సృజనాత్మకతను పెంపొందించండి
రాంజీ గోండ్‌ అమరత్వానికి 161ఏండ్లు
ధరాభారం షరా మామూలే
అస్థిత్వ సంక్షోభంలో మానవ జాతి..?
ప్రభుత్వమా... ఆలోచించుమా...
ఇవి ప్రభుత్వ హత్యలే...
మయన్మార్‌ నెత్తురోడుతోంది....
మలబార్‌ తీరంలో... సర్వేలు.. స్వరాలు
ఆధునిక బానిసత్వ రూపాలు - అమానవీయ పోకడలు
విప్లవయోధ - ధర్మభిక్షం
వివాహాలతో కనుమరుగవుతున్న బాల్యం
రెవెన్యూ లీలలు ధరణి పరిష్కరిస్తుందా?
క్షయ రహిత భారతం కోసం..
ప్రభుత్వరంగాన్ని కాపాడుకోవాలి
విశ్వానికి మార్గం చూపిన న్యూటన్‌
మనిషిని కబళించేస్తున్న సాంకేతికత..
తెలంగాణ రణభేరి అనభేరి ప్రభాకర్‌రావు
మహానగరాలు కాలుష్య కేంద్రాలు...!
విద్యా విప్లవ జ్యోతి సావిత్రిబాయి ఫూలే
ప్రభుత్వరంగాన్ని కాపాడుకోవాలి
మనిషిని కబళించేస్తున్న సాంకేతికత..

తాజా వార్తలు

08:28 PM

మళ్లి భయపెడుతున్న డెంగ్యూ

08:08 PM

18 ఏండ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్

07:41 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు

07:28 PM

సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్

07:19 PM

పుర ఎన్నికలు నిలిపివేయలేం: తెలంగాణ హైకోర్టు

07:06 PM

కొత్త పింఛన్లు ఇవ్వాలని వినతి..

07:02 PM

ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభం...

06:59 PM

పీవైఎల్ జిల్లా అధ్యక్షకార్యదర్శులుగా చింత నరసింహారావు, పర్శిక రవి.

06:52 PM

అరుణ గ్రహంపై తొలిసారి ఎగిరిన హెలికాప్టర్‌

06:48 PM

మాజీ ప్రధానికి కరోనా పాజిటివ్​

06:15 PM

నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ కు కరోనా పాజిటివ్

05:54 PM

లాక్ డౌన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు..

05:49 PM

లాక్ డౌన్ పెట్టే ఆలోచన లేదు : మంత్రి ఈటల రాజేందర్

05:29 PM

రూ.3వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత

05:15 PM

గంటల వ్యవధిలో తల్లీ, కొడుకు మృతి.. విషాదం నింపిన కరోనా

04:56 PM

రెండు టీకా కంపెనీలకు రూ.4,500కోట్లు ప్రకటించిన కేంద్రం

04:47 PM

వీకెండ్స్ మాత్రమే తెరుచుకొనున్న వండర్‌లా

04:35 PM

ఏపీలో స్కూళ్లకు సెలవులు..

04:25 PM

ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో తీవ్ర ఉద్రిక్తత

04:04 PM

చెరువులో పడి ఇద్దరు మృతి

03:53 PM

ప్రముఖ డాక్టర్లతో ప్రధాని మోడీ సమావేశం

03:35 PM

ఆశ్రయం ఇచ్చి.. అదును చూసి.. అక్కాచెల్లెళ్లపై దారుణం

03:23 PM

సోనూసూద్ ఆదర్శంగా ఆటో డ్రైవర్ సేవలు..

03:14 PM

ఇప్పటికిప్పుడు లాక్ డౌన్ అవసరం లేదన్న సీఎం

02:58 PM

భారీ ఆఫర్లు ప్రకటించిన హ్యూండాయ్

02:47 PM

ఇంజక్షన్లు పనిచేయవు.. ఆల్కాహాల్ సర్వరోగ నివారణి అంటున్న మహిళ

02:31 PM

అందరూ చూస్తుండగానే రూ.9లక్షలు ఎత్తుకెళ్లిండు

02:21 PM

ఓపెనింగ్ రోజే బిర్యానీ షాపుకు సీల్..

02:01 PM

నల్గొండలో ధాన్యాన్ని కొనాలంటూ రైతుల ఆందోళన..

01:46 PM

నాగర్ కర్నూల్ లో చైన్ స్నాచింగ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.