Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
సి.వి. ఒక సమరశీల కలం యోధుడు! | వేదిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వేదిక
  • ➲
  • స్టోరి
  • Nov 12,2020

సి.వి. ఒక సమరశీల కలం యోధుడు!

సరిగ్గా మూడేండ్ల క్రితం మన నుంచి భౌతికంగా సి.వి. (చిత్తజల్లు వరహాలరావు) దూరమైన వారంలోగా ప్రజాశక్తి బుకహేౌస్‌ వారు 'మన తరం ప్రజాస్వరం'గా ఆయనపై ఒక గొప్ప జ్ఞాపికను (15-11-2017 నాడు) వెలువ రించారు. ఆయన రచన లన్నిటినీ 24సంపుటాలుగా ఒకేరోజు (2015 జూన్‌ )న ఆవిష్కరించటమే కాక ఒక అపూర్వ పౌర సన్మానాన్ని సాహిత్య, సాంస్కతిక, సామాజిక సంస్థలు అనేకం కలిసి విజయవాడలో నేను కన్వీనర్‌గా నిర్వహించాం. ఆ రోజుని 'నిప్పుకి నివురు తొలుగుతున్న వేళగా అభివర్ణిస్తూ ఆ సభలోనే 'సమరశీల కలం యోధుడు సి.వి.' అనే సి.వి. రచనలపై విశ్లేషణాత్మక గ్రంథాన్ని జనసాహితి వారు ఆవిష్కరించారు.
''దేశాన్ని అమావాస్య ఆవహించింది
అధికారం అవినీతికి దారితీసింది
హద్దూపద్దూలేని నిరంకుశాధికారం
అంతూపంతూలేని అవినీతికి మార్గం వేసింది'' ఈ మాటలు నేటివేనని అనుకునేట్టుగా ఉన్నా, సరిగ్గా 55ఏండ్ల క్రితపు 'విషాదభారతం' కావ్యంలోనివని తెలిస్తేగానీ 'సివి' దార్శనికత మనను అబ్బురపరచదు. ''మధ్య యుగాల్లోకి మళ్ళీ వెళ్ళి మనం జీవిస్తున్నామా - అనేంతటి తీవ్రమైన సందేహం నేడు కలుగుతోంది'' అని కూడా 'ఆధునిక యుగంలో కుల వ్యవస్థ'లో (రచన 1980) ఆయన రాశారు. రానున్న ప్రమాదాన్ని ఎంత ముందుగా కనుగొని హెచ్చరించాడా అనిపించే మాటలవి!
మార్క్సిస్ట్‌ థియరీని వ్యక్తి భౌతిక అస్థిత్వానికే - పరిమితం చేయటం తెలివితక్కువతనమే కాదు, నీచం కూడా. 'ఎకనామిక్‌ డిటర్మినిజమ్‌' అనే చెత్త విమర్శకి మార్క్సిస్ట్‌ థియరీ కచ్చితంగా నోచుకోదు. మార్క్సిస్ట్‌ తత్వం వ్యక్తి భౌతిక అస్తిత్వానికే పరిమితమై లేదు. దాన్ని మించి చాలావుంది. అది మన జీవితాన్ని చూస్తుంది. మనం ఎలా బతుకుతున్నామో గమనిస్తుంది. మనం ఏం ఉత్పత్తి చేస్తున్నామో, దేంతో ఉత్పత్తి చేస్తున్నామో, దాని ఎడల మన వైఖరేంటో, ఉత్పత్తి పంపిణీల్లో మన సామాజిక అవగాహనేంటో, ఆ క్రమంలో మనుషుల మధ్య సామాజిక, సాంస్కృతిక, మానసిక అంశాలు ఎలా ముడిపడి ఉన్నాయో - అంటే యివన్నీ ఆర్థికాన్ని (ఎకానమీని) ఏ విధంగా రాజకీయం చేస్తుందీ అంతేగాక ఉత్పత్తిలో జోక్యం, కార్మిక విభజన (డివిజన్‌ ఆఫ్‌ లేబర్‌), ఆస్తి రూపాలు (తెగల, పురాతన, భూస్వామ్య లాంటివి) వీటిపై కాల, భౌగోళిక, సాంకేతిక మార్పులు ఎలా శక్తివంతంగా పని చేస్తాయో రాజకీయ ఆర్థికం (మార్క్సిస్ట్‌ పొలిటికల్‌ ఎకానామీ - మార్క్సిస్ట్‌తత్వం) నొక్కి చెపుతుంది.
అందుకే మార్క్సిజాన్ని, సమాజాన్ని, చరిత్రని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన సి.వి. 2015లో శాంతిశ్రీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మనదేశంలో రాజకీయ మార్పుకి సమాంతరంగా సాంస్కృతిక మార్పు అవసరమని మార్క్సిస్టులు గుర్తుంచుకోవాలి' అంటాడు.
తెలుగువారికి లభించిన అరుదైన ప్రజారచయిత సి.వి. యుగయుగాల భారత శ్రామికవర్గ చరిత్రయే దళిత చరిత్ర అంటూ నిర్థారించకలిగిన రాజకీయ అవగాహన సి.వి.కి ఉంది. ''మనుస్మతి అమల్లోకొచ్చి 2వేల సంవత్సరాలు దాటిపోయింది. అయినా మన మానసిక, సాంస్కృతిక, సాహితీ, సాంఘిక రంగాల్లో ఈ స్మృతి ప్రభావం విరగడకాని పీడలా, భయంకరమైన నీడలా మనల్ని నేటికీ వెన్నాడుతూనే ఉంది' అని సి.వి. ''మనుధర్మశాస్త్రం శూద్ర దళిత బానిసత్వం''లో వాపోతూ.. 'ఇండియాలోని ఏడు లక్షల మాలపల్లెల్లో ఈ మనుస్మతి గురించి విశ్లేషించండి' అని చెపుతారు. ఇది అవసరం. ఆయన 'ఆధునిక యుగంలో కుల వ్యవస్థ'లో ''వైజ్ఞానిక దృష్టికి బదులు అంధమత విశ్వాసం, హేతుబద్ధమైన ఆచరణకి బదులు నిర్జీవ కర్మకాండ, మానవ సహజమైన జిజ్ఞాసకి బదులు గొర్రెదాటుడుతత్వం, భావస్వాతంత్య్ర రాహిత్యం, అవినీతి, నైతిక విశృంఖలత్వం దేశంలో పైశాచిక తాండవం చేస్తున్నాయి'' అని అద్దాన్ని చూపిస్తాడు. అంతే కాకుండా కుల వ్యవస్థ పుట్టుకను దాని కొనసాగింపునీ ఇలా విప్పి చెపుతాడు.
''వర్ణ వ్యవస్థ (ఆధునిక కులవ్యవస్థ) కేవలం వృత్తి ఆధారంగా నిర్ణయించబడింది. పురాతన కాలంలో కుటుంబ వృత్తినే అన్ని తరాలు అనుసరించటం వలన అది వారిని అదే వర్గంలో ఉండేలా చేసింది. కానీ మధ్య యుగాలు, ఆధునిక యుగంలో ఆయా కుటుంబాలలో పుట్టడమనేది ఆయా కులాలను నిర్ధారిస్తుంది.'' ఈ మాటలు కూడా 40యేండ్ల క్రితపు 'ఆధునిక కుల వ్యవస్థ'లో సివి రాశారు.
విజ్ఞానం, విప్లవస్ఫూర్తి, సద్విమర్శ, సృజనాత్మక భావప్రకటన, రచనాపటిమ ఒక్కరిలో కలబోసి ఉండటం అరుదు. అవన్నీ సి.వి.లో ఉన్నాయి. ఆయన రచనలన్నింటికి ఓ సుదీర్ఘ వివరణాత్మక ఆవిష్కరణ ఉంటుంది. ఏ బెర్నార్డ్‌షాలోనో కనిపించే విషయ పరిజ్ఞానంతో కూడిన (సృజనాత్మక రచనకి) ముందుమాట వివరణ సి.వి.లో కూడా కనిపిస్తుంది. గతితార్కికంగా చరిత్రని చూడటం, అస్తిత్వ సమస్యల్ని ఆకళింపు చేసుకోవటం, శ్రమైక జీవన పరిశీలన, విప్లవ కార్యాచరణని రేపటి ఆశావహంతో దర్శించటం, అలా రాయటానికి కారణం అని నేను అనుకుంటున్నాను. అందువల్లనే సి.వి. రచనల్లో తడబాటు ఏ కోశానా ఉండదు. తీవ్రత ఉంటుంది.
నా ఉద్దేశ్యంలో కులం గురించిగాని, మతాన్ని గురించిగాని, ప్రజా పోరాటాల గురించిగాని సి.వి. రాసిన అన్ని రచనల్లో ఉండే వాడితనం, వేడితనం విప్లవ సాహిత్యంలోని కొన్ని రచనల్లో మాత్రమే దొరుకుతుంది. ''విస్మరణకు గురైన చారిత్రాత్మక కవి రచయిత సి.వి.'' అని దివికుమార్‌ బాధపడ్డారు. అందుకు చాలా ఉదాహరణలు ఆయన వ్యాసంలో యిచ్చారు. అలానే 'కవిగా, రచయితగా గొప్ప సాహితీవేత్తగా రావలసినంత ప్రసిధ్ధి సి.వి.కి రాలేదు' అని ప్రొఫెసర్‌ ఇనాక్‌ అన్నారు. అది నిజం. ఎందువల్లనంటే రచనకంటే స్వోత్కర్షలకి, పరిజ్ఞానం కంటే స్వప్రకటనలకి ప్రాధాన్యం యిచ్చే మన తెలుగు సాహితీ రంగం తీరు లోపంగానే దాన్ని భావించాలి.
కానీ సి.వి. వ్యక్తి ప్రాధాన్యతకి ఏ మాత్రం సందు యివ్వని తత్వజ్ఞానం నుంచి వచ్చినవాడు. తనకంటే ప్రజా చైతన్యం కలిగించే భావ ప్రకటన, సామాజిక జ్ఞానానికి మాత్రమే ప్రాధాన్యత యిచ్చినవాడు. కనుకనే మహా విజ్ఞాన సర్వస్వమైన దాదాపు తన 26పుస్తకా లపై తన్ను తాను రెండు పొడి అక్షరాలకు కుదించుకున్న గొప్ప రచయిత 'సి.వి.'
ఆకలి, అసమానతలు, అభద్రత, అసంతృప్తి వీటితో సంక్షోభాల వెంట సాగి సాగి పెట్టుబడిదారీ విధానాలు బుడగల్లా పేలిపోవడాలు చాలాసార్లు జరిగేపనే. ప్రపంచంలో యివి దశాబ్దానికి ఒకసారికి మించి జరగటం మనకి తెలీకపోతే మనకి కండ్లులేవనే! పెట్టుబడి ఊసరవల్లిలా రంగులు మార్చుకుంటుంది. ఎన్నికలు, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ వీటి వెనుక దాక్కుని ఊపిర్లు పోసుకుంటుంది. అబద్ధం, అవినీతులను ఆసరాచేసు కుంటుంది. 'నాటి వ్యాస భారతం పద్దెనిమిది పర్వాలు - నేటి విషాద భారతం ఎనిమిది పర్వాలే!' అంటూ తన విషాద భారతం కావ్యంలో అధికారం ఎలా అవినీతికి దోవతీసిందీ, ప్రజాసేవకులు దేశద్రోహులు గా ఎలా పరిగణింప బడుతున్నారో, స్వరాజ్యలక్ష్మి భూసంస్కరణల శిశువును ఎందుకు కనదో సి.వి. అడుగుతాడు.
'ఆధునిక ప్రజాస్వామ్యమొక పొద్దు తిరుగుడు పువ్వు'అని చెప్పిన సి.వి. ఒక కార్యకారణ జ్ఞానం, ఒక చైతన్య వ్యవస్థ, ఒక ఉద్యమం. 'చారిత్రక వాస్తవాన్ని వక్రీకరించకుండా కవిత్వం రాయడం, అందులోనూ వచన కవిత్వం రాయడం, కత్తిమీద సాములాంటి శిక్ష' అన్న సి.వి. తన మహాకావ్యం 'పారిస్‌ కమ్యూన్‌'లో బూర్జువా న్యాయ స్థానం విధించే ఏ శిక్షకైనా సిద్ధం అంటూ ఒక కార్మిక వీరనారి చెప్పే మాటలు ఉద్యమకారుల మాటలు కావాలి.
'నేడు మేం ఓడిపోయాం. రేపు మాదే విజయం.
మేం రేపు గెలుస్తాం. ముమ్మాటికీ మాదే భవితం'
అలాంటి ఆత్మ విశ్వాసానికి ఒక ఆలోచననూ, ధిక్కారతత్వానికి ఒక అవగాహననూ, భవిష్యత్తుపై ఆశను నిలిపే విస్పష్టమయిన దార్శనికతనూ మనకిచ్చేవి సివి రచనలు! నవంబర్‌ 8న మూడవ వర్థంతి. ఆయనను మరింత అధ్యయనం చేద్దాం!!
(ఈ నవంబరు ఎనిమిది సివి మూడవ వర్థంతి.
వ్యాస రచయిత తెలుగు సినీ దర్శకులు)

- సి. ఉమా మహేశ్వరరావు

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గవర్నమెంటుకు సోయుందా..?
పేదల తర్వాతే పెద్దలకు వ్యాక్సిన్‌!
కాదేదీ ప్రచారానికి అనర్హం....
రైతును బలిపెడతారా..?
క్యాపిటల్‌ పై దాడి హీనమైన చర్య..
రైతు భారతం! నిత్య రణభరితం!!
గిరిజనులను నిర్వాసితులుగా మార్చేందుకే...
త్రిపురనేని గొప్ప దార్శనికుడు...
విద్యా విప్లవజ్యోతి ఫాతిమా బేగం
చైనా ఐదేండ్లు ముందుకు.. భారత్‌ వెనక్కు.. మోడీనామిక్సు నిర్వాకం!
ఐజాక్‌ న్యూటన్‌
పరిష్కారానికి నోచని గిరిజన సమస్యలు
ఆనంద భాష్పాలు
మోడీకి అంబాని, అదానీ ప్రయోజనాలే ముఖ్యం
ఆర్నెల్ల సావాసం...
సర్కారు వారి పాట!
ఈ ఏడాదైనా విముక్తి దొరికేనా
ఎస్ఎఫ్ఐ 50 ఏళ్ళ ప్రస్థానం
నిత్యావసర సరుకుల (సవరణ) చట్టం 2020
తెలంగాణ మహిళా తేజం ఆరుట్ల కమలాదేవి
కొత్త ఆశలతో.. నూతన సంవత్సరంలోకి!
మహిళల్లో వెలుగులు నింపిన సావిత్రిబాయి ఫూలే
కరోనా విషకోరల్లో 2020 విలవిల
అవలోకనం
తాలి బజావ్‌!
జాతీయోద్యమ స్ఫూర్తిని చాటుతున్న రైతాంగం
వంగటం కూడా ఓ కళే...!
హిట్‌ లిస్టులో లాయలిస్టు
సమాచార క్యాలెండర్లు....
ఈ చర్యలు దేనికి సంకేతం? ఆర్టీసీ కార్మికుల సందేహం

తాజా వార్తలు

05:37 PM

బోయిన్‌పల్లి కేసులో మరో 15మంది అరెస్టు

05:25 PM

వాట్సప్ ఓపెన్ చేయగానే యూజర్లకు షాక్..స్టేటస్‌లో..!

05:10 PM

మారిన కరోనా కాలర్ ట్యూన్!

05:04 PM

కరీంనగర్‌లో గుప్తనిధుల కలకలం

04:25 PM

ఏపీలో కొత్తగా 161 కరోనా కేసులు

04:22 PM

ఐస్ క్రీ‌మ్‌లో క‌రోనా వైర‌స్‌..!

04:14 PM

సుప్రీంకోర్టు జడ్జిలపై కాల్పులు..ఇద్దరు మహిళా న్యాయమూర్తుల మృతి

04:07 PM

మ‌హీంద్రా కార్ల‌పై భారీ డిస్కౌంట్లు..!

04:00 PM

సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం..72గంటల ముందే..!

03:50 PM

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 13మందికి పక్షవాతం.!

03:42 PM

ఫిబ్ర‌వ‌రి 24 నుంచి మేడారం చిన్న జాత‌ర‌

01:41 PM

వ్యాక్సిన్ రావ‌డంతో క‌రోనా కాల‌ర్ టోన్ లో మార్పులు

01:29 PM

బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత..

01:16 PM

13 ఏళ్ల బాలికపై 9 మంది లైంగిక దాడి..

01:05 PM

8 కొత్త రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ

12:56 PM

భారత్ 336 ఆలౌట్.. 33 పరుగుల ఆధిక్యంలో ఆసీస్

12:51 PM

హయత్ నగర్ లో కారు బీభత్సం..

12:41 PM

పొగమంచు కారణంగా పలు రైళ్లు ఆలస్యం..

12:33 PM

రెండు బైకులు ఢీ.. ఇద్దరు మృతి

12:19 PM

ఏపీలో రెండో రోజు కొన‌సాగుతోన్న వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం

12:11 PM

ఐస్ క్రీంలో కరోనా వైరస్.. కొన్న వారి కోసం గాలింపు చర్యలు..

11:59 AM

అతని వయస్సు 22.. చేసుకున్న పెళ్లిళ్లు 12..

11:45 AM

నాకు టాలీవుడ్ అంటేనే ఇష్టం : సోనూ సూద్

11:33 AM

మలబార్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు

11:24 AM

తెలంగాణలో కొత్తగా మరో 299 పాజిటివ్ కేసులు

11:16 AM

ఉద్యోగం పోగొట్టుకుని.. దొంగతనాలు చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి అరెస్ట్

11:01 AM

వ్యాక్సిన్ వేసుకున్న 51మందికి స్వల్ప అస్వస్థత..

10:54 AM

దేశంలో కొత్తగా మరో 15వేల పాజిటివ్ కేసులు నమోదు..

10:22 AM

భార్య కుమార్తె వద్దకు వెళ్లిందని.. భర్త ఆత్మహత్య

10:16 AM

అలర్ట్.. 983 పక్షులు మృతి..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.