Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
గ్రామాలలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు | వేదిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వేదిక
  • ➲
  • స్టోరి
  • Nov 11,2020

గ్రామాలలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పుట్ట గొడుగుల్లా బెల్టు దుకాణాలు మద్యాన్ని విక్రయిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా ఏరులై పారుతున్నా, తెలిసీ అటువైపు కన్నెత్తి చూడకుండా ఎక్సైజ్‌ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అన్ని జిల్లాలలో బెల్టు షాపుల దందా జోరుగా సాగుతోంది. పల్లెలు, పట్టణాలనే తేడాలేకుండా కిరాణాదుకాణం నుంచి మొదలుకొని నివాస గహాలు, పాన్‌ షాపులు, కల్లు కాంపౌండ్‌ల సమీపంలో మద్యం ఏరులైపారు తోంది. భవననిర్మాణ కార్మికులు, కూలీలు, హౌటల్స్‌, ఇసుక రవాణా కార్మికులకు తెల్లవారు జామునే మద్యం అందిస్తూ బెల్టు దందాను మూడు క్వార్టర్లు, ఆరు ఆఫ్‌లుగా సాగిస్తున్నారు. గతంలో వైన్‌ షాపుల పరిసరాలలో కొనసాగిన ఈ దందా ప్రస్తుతం గల్లీకొకటి ఏర్పాటు కావడంతో మద్యం ప్రియులు ఉదయం టీ, కాఫీలకు బదులుగా మద్యంను తాగుతూ ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ గాయాలపాలవుతున్నారు. కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకంగా ఉదయం పూట వాహనాలలో తీసుకువచ్చి, ఆ ప్రాంతంలోనే ఓ కల్లు కాంపౌండ్‌ పరిసరాలలో పలువురు పాన్‌షాపులు ఏర్పాటుచేసి అందులో బెల్టు దుకాణం నడిపిస్తున్నారు. ఈ విషయం ఎక్సైజ్‌ అధికారులకు తెలిసినా అటు వైపు కన్నెతి చూడటం లేదు. నిబంధనలకు విరుద్ధంగా గ్రామాల్లో బెల్టు దుకాణాలు కొనసాగుతున్నా.. చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమవు తున్నది. లిక్కర్‌ డాన్‌లు వివిధ జిల్లాల్లో కమీషన్లకు బెల్టు షాపుల వారికి మద్యం సరఫరా చేస్తున్నారు. రోజుకు ఎంత అమ్మితే అంత కమీషన్లు అందిస్తుండడంతో బెల్టుషాపుల నిర్వాహకులు ఒకరిని చూసి మరొకరు ఈ దందాను జీవనోపాధిగా చేసుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ దందాను బహిరంగంగా కొనసాగిస్తూ ప్రజలను మత్తులో ముంచుతున్నారు. ఆ మద్యం తాగినవ్యక్తులు వాటికి బానిసలై తమ ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారు. ఒకప్పుడు నగరాలు, పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఈ దందా ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోనూ విచ్చలవిడిగా కొనసాగుతోంది. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో బెల్టు దుకాణాలపై ఉక్కుపాదం మోపుతున్నామని అధికారులు ప్రకటిస్తుంటే.. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో యథేచ్ఛగా బెల్టుదుకాణాలు కొనసాగుతున్నాయి. కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన ఈ కొద్ది రోజుల్లోనే గ్రామాల్లో బెల్టుదుకాణాలు జోరందుకున్నాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఒక్కో గ్రామంలో పదుల సంఖ్యలో మద్యం షాపులు కొనసాగుతున్నాయి.
వివిధ మండలాల్లోని కొన్ని గ్రామాలలో బెల్టు షాపులు నిర్వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని గ్రామస్థులు ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల బెల్టు షాపులు నిర్వహిస్తున్నారని తెలుస్తున్నది. అందులో ఎంఆర్‌పీ కంటే రూ.30 నుంచి రూ.50వరకు ఎక్కువకు విక్రయిస్తున్నారు. కొందరైతే వాహనాలను ఉదయం సమయంలో తీసుకువచ్చి అడ్డకూలీలకు, ఇసుక ట్రాక్టర్ల మీద వెళ్లే కూలీలకు అమ్మకాలు జరుపుతున్నారు. వివిధ ప్రాంతాల్లోని కల్లు కాంపౌండ్ల వద్ద గల కిరాణా దుకాణాలలో కల్తీమద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అన్ని జిల్లాలలో ఈ దందా సంగతి తెలిసినా సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నిరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. కొందరు సిబ్బందికి ప్రత్యేకంగా వారం, నెలకు చొప్పున ముడుపులు అందుతుండడంతో ఏదైనా ఫిర్యాదురాగానే బెల్టు షాపుల నిర్వాహకులకు సమాచారం అందించి తనిఖీల విషయాలను చేరవేస్తున్నారు. దీంతో అప్రమత్తం అవుతున్న బెల్టుషాపుల వారు తనిఖీలలో ఏమీ దొరకకుండా జాగ్రత్త పడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే ఈ బెల్టుదందాకు అడ్డుకట్ట పడడమే కాకుండా ప్రజల ఆరోగ్యాలకు రక్షణ కల్పించిన వారవుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా యువత నిత్యం దీనికి బానిసయి ఒళ్లు గుళ్ల చేసుకుని భవిష్యత్‌ నాశనం చేసుకుంటున్నారు. ప్రజల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటున్నది. ఇకనయినా ప్రభుత్వం, సంబంధిత అధికారులు దృష్టి సారించాలి.
- కె. సతీష్‌రెడ్డి
సెల్‌: 9848445134


మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గవర్నమెంటుకు సోయుందా..?
పేదల తర్వాతే పెద్దలకు వ్యాక్సిన్‌!
కాదేదీ ప్రచారానికి అనర్హం....
రైతును బలిపెడతారా..?
క్యాపిటల్‌ పై దాడి హీనమైన చర్య..
రైతు భారతం! నిత్య రణభరితం!!
గిరిజనులను నిర్వాసితులుగా మార్చేందుకే...
త్రిపురనేని గొప్ప దార్శనికుడు...
విద్యా విప్లవజ్యోతి ఫాతిమా బేగం
చైనా ఐదేండ్లు ముందుకు.. భారత్‌ వెనక్కు.. మోడీనామిక్సు నిర్వాకం!
ఐజాక్‌ న్యూటన్‌
పరిష్కారానికి నోచని గిరిజన సమస్యలు
ఆనంద భాష్పాలు
మోడీకి అంబాని, అదానీ ప్రయోజనాలే ముఖ్యం
ఆర్నెల్ల సావాసం...
సర్కారు వారి పాట!
ఈ ఏడాదైనా విముక్తి దొరికేనా
ఎస్ఎఫ్ఐ 50 ఏళ్ళ ప్రస్థానం
నిత్యావసర సరుకుల (సవరణ) చట్టం 2020
తెలంగాణ మహిళా తేజం ఆరుట్ల కమలాదేవి
కొత్త ఆశలతో.. నూతన సంవత్సరంలోకి!
మహిళల్లో వెలుగులు నింపిన సావిత్రిబాయి ఫూలే
కరోనా విషకోరల్లో 2020 విలవిల
అవలోకనం
తాలి బజావ్‌!
జాతీయోద్యమ స్ఫూర్తిని చాటుతున్న రైతాంగం
వంగటం కూడా ఓ కళే...!
హిట్‌ లిస్టులో లాయలిస్టు
సమాచార క్యాలెండర్లు....
ఈ చర్యలు దేనికి సంకేతం? ఆర్టీసీ కార్మికుల సందేహం

తాజా వార్తలు

05:25 PM

వాట్సప్ ఓపెన్ చేయగానే యూజర్లకు షాక్..స్టేటస్‌లో..!

05:10 PM

మారిన కరోనా కాలర్ ట్యూన్!

05:04 PM

కరీంనగర్‌లో గుప్తనిధుల కలకలం

04:25 PM

ఏపీలో కొత్తగా 161 కరోనా కేసులు

04:22 PM

ఐస్ క్రీ‌మ్‌లో క‌రోనా వైర‌స్‌..!

04:14 PM

సుప్రీంకోర్టు జడ్జిలపై కాల్పులు..ఇద్దరు మహిళా న్యాయమూర్తుల మృతి

04:07 PM

మ‌హీంద్రా కార్ల‌పై భారీ డిస్కౌంట్లు..!

04:00 PM

సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం..72గంటల ముందే..!

03:50 PM

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 13మందికి పక్షవాతం.!

03:42 PM

ఫిబ్ర‌వ‌రి 24 నుంచి మేడారం చిన్న జాత‌ర‌

01:41 PM

వ్యాక్సిన్ రావ‌డంతో క‌రోనా కాల‌ర్ టోన్ లో మార్పులు

01:29 PM

బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత..

01:16 PM

13 ఏళ్ల బాలికపై 9 మంది లైంగిక దాడి..

01:05 PM

8 కొత్త రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ

12:56 PM

భారత్ 336 ఆలౌట్.. 33 పరుగుల ఆధిక్యంలో ఆసీస్

12:51 PM

హయత్ నగర్ లో కారు బీభత్సం..

12:41 PM

పొగమంచు కారణంగా పలు రైళ్లు ఆలస్యం..

12:33 PM

రెండు బైకులు ఢీ.. ఇద్దరు మృతి

12:19 PM

ఏపీలో రెండో రోజు కొన‌సాగుతోన్న వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం

12:11 PM

ఐస్ క్రీంలో కరోనా వైరస్.. కొన్న వారి కోసం గాలింపు చర్యలు..

11:59 AM

అతని వయస్సు 22.. చేసుకున్న పెళ్లిళ్లు 12..

11:45 AM

నాకు టాలీవుడ్ అంటేనే ఇష్టం : సోనూ సూద్

11:33 AM

మలబార్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు

11:24 AM

తెలంగాణలో కొత్తగా మరో 299 పాజిటివ్ కేసులు

11:16 AM

ఉద్యోగం పోగొట్టుకుని.. దొంగతనాలు చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి అరెస్ట్

11:01 AM

వ్యాక్సిన్ వేసుకున్న 51మందికి స్వల్ప అస్వస్థత..

10:54 AM

దేశంలో కొత్తగా మరో 15వేల పాజిటివ్ కేసులు నమోదు..

10:22 AM

భార్య కుమార్తె వద్దకు వెళ్లిందని.. భర్త ఆత్మహత్య

10:16 AM

అలర్ట్.. 983 పక్షులు మృతి..

10:03 AM

ప్ర‌మాణ స్వీకారం చేసిన రోజే కీల‌క నిర్ణయాలు తీసుకోనున్న బైడెన్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.