Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
గులాబీ ఆకర్ష్‌ బీజేపీకి కార్పొరేటర్లు గుడ్‌బై | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 22,2020

గులాబీ ఆకర్ష్‌ బీజేపీకి కార్పొరేటర్లు గుడ్‌బై

- ఎమ్మెల్సీగా కవిత విజయం కోసం నేతల పావులు
నవతెలంగాణ- నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఓవైపు రాష్ట్రవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తుంటే నిజామాబాద్‌లో మాత్రం 'కారు' ఆకర్ష్‌ జోరు నిరంతర చర్చకు దారితీస్తున్నది. వారం రోజులుగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పోటాపోటీగా బీజేపీ, కాంగ్రెస్‌ నేతలను పార్టీలోకి లాగే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ఎంపీ కవిత విజయానికి ఎలాంటి ఆటంకాలూ తలెత్తకుండా ఈ తంతు నడిపిస్తున్నట్టు తెలుస్తున్నది.
నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో ఇప్పటికే ఐదుగురు కార్పొరేటర్లు గులాబీ తీర్థం పుచ్చుకోగా, ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులూ పార్టీ మారారు. కామారెడ్డిలోనూ ఆకర్ష్‌ రాజకీయం షురూ చేశారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ ప్రవర్తన నచ్చకే పార్టీ మారుతున్నారని టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతుండగా.. అభివృద్ధి పనులు నిలిపేస్తామని భయపెడుతూ ప్రలోభాలకు తెరతీస్తున్నారని బీజేపీ ఆరోపిస్తున్నది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ఒకప్పుడు టీఆర్‌ఎస్‌ పార్టీకి కంచుకోటే అయినా లోక్‌సభ ఎన్నికల్లో మాజీ ఎంపీ కవిత ఓటమి పాలైనప్పట్నుంచి జిల్లా రాజకీయ రూపురేఖలు మారిపోయాయి. కవిత క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉండటం, జెడ్పీటీసీ, కార్పొరేషన్‌ ఎన్నికల్లో గులాబీ బలం తగ్గడంతో ఆ పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి. మంత్రికి, ఎమ్మెల్యేలకు పొంతన కుదరక ఎవరికివారే అన్నట్టు తీరు మారింది. ఈ బలహీనతలు ఎక్కడ పొక్కుతాయోనని కార్పొరేషన్‌లో కౌన్సిల్‌ సమావేశానికి మీడియాను కూడా అనుమతించలేదు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కవిత నామినేషన్‌ వేయడంతో రాజకీయం మళ్లీ వేడెక్కింది.
పదిరోజుల్లోనే తారుమారు..
కార్పొరేషన్‌ ఎన్నికలు ముగిసిన నెల రోజుల్లోనే టీఆర్‌ఎస్‌ నేతలు బీజేపీ కార్పొరేటర్లకు ఫోన్లు చేసి ప్రలోభాలకు గురిచేశారు. డివిజన్‌ అభివృద్ధికి కోరినన్ని నిధులు సమకూర్చడంతో పాటు అవసరమైతే వ్యక్తిగతంగానూ ఆర్థికంగా ఆదుకుంటామని ఆఫర్లిచ్చారు. ఈ ప్రతిపాదనలు తిరస్కరించిన బీజేపీ కార్పొరేటర్లు నేరుగా ఎంపీ అరవింద్‌కు ఫిర్యాదు చేశారు. కానీ, గడిచిన పది రోజుల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మొదట ఆర్మూర్‌ నియోజకవర్గంలోని నందిపేట్‌ బీజేపీ జెడ్పీటీసీ సభ్యురాలు ఎర్రం యమున పార్టీ మారారు. మరుసటి రోజే నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో బీజేపీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు కారెక్కారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి స్వయంగా ఆహ్వానించారు. గురువారం మరో ఇద్దరు కార్పొరేటర్లు సిరిగాదా ధర్మపురి (బీజేపీ), శివచరన్‌ (కాంగ్రెస్‌) మంత్రి సమక్షంలో గులాబీ గూటికెళ్లారు. ఏర్గట్ల జెడ్పీటీసీ సైతం వారి బాటలోనే నడిచారు. ఇక నియోజకవర్గాల నుంచి పలువురు ఎంపీటీసీలూ టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే ముందు జాగ్రత్తల్లో భాగంగా ఆపరేషన్‌ ఆకర్ష్‌ను ప్రారంభించినట్టు చర్చోపచర్చలు నడుస్తున్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సీఎం మాటలకే విలువలేదా?
నామ్‌కే వాస్తేగా బడ్జెట్‌ రూపకల్పన
25 నుంచి పీజీఈసెట్‌ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌
ఎంపీ అరవింద్‌ రాజీనామా చేయాలి
వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై మధ్యంతర స్టే పొడిగించిన హైకోర్టు
నూతన విద్యావిధానాన్ని రద్దుచేయాలి
రైతులకు మద్దతుగా పోరు ఉధృతం
వ్యవసాయంపై కార్పొరేట్‌ గద్దల కన్ను
జేఎల్స్‌కు పదోన్నతులివ్వాలి...
జీహెచ్‌ఎంసీ నూతన పాలకవర్గానికి ముహూర్తం
నూతన విద్యా విధానంలో బాలిక విద్య, మహిళా అక్షరాస్యత విస్మరణ
సీఎంతో నిటి ఆయోగ్‌ సభ్యుల భేటి
ఏసీబీకి చిక్కిన కార్మిక శాఖ సీనియర్‌ అసిస్టెంట్‌
జీతాలు పెంచడానికే ఆర్థిక ఇబ్బందులా..?
మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున సాయం
సాగు చట్టాలపై పోరు యాత్రలు
అందరికి సమాన అవకాశాలే మా లక్ష్యం: మంత్రి కేటీఆర్‌
త్రిసభ్య కమిటీ పేరుతో కాలయాపన చేయొద్దు
పీవీ విజ్ఞాన వేదిక నిర్మాణానికిరూ.7కోట్లు
ఆరోగ్యశ్రీ పథకం అమలు నెపంతో ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని నిర్లక్ష్యం
ప్రభుత్వ టీచర్లకు అన్యాయం చేయొద్దు
రాష్ట్ర బడ్జెట్‌లో ఆర్టీసీకి ఒక శాతం నిధులివ్వాలి : ఎస్‌డబ్ల్యూఎఫ్‌
రేపు రెవెన్యూ భవన్‌లో వీఆర్వోల ఆత్మగౌరవ సభ
పీహెచ్‌డీ ప్రవేశాల్లో రిజర్వేషన్లను అమలు చేయాలి : ఏబీవీపీ
24న వ్యవసాయ, మార్కెటింగ్‌ సమస్యలపై సీఎం సమీక్ష
ఆర్టీసీ టిక్కెట్‌ ధరలు పెంచొద్దు : చాడ
కాంట్రిబూషన్‌ పెన్షన్‌ స్కీంకు మార్గం సుగమం
9 శాతం మందికి 10 శాతం రిజర్వేషన్లా?
ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లతో బీసీలకు తీరని నష్టం : దాసు సురేశ్‌
అల్మాస్‌పూర్‌ దళితులపై దాడి చేసినోళ్లను శిక్షించాలి : కేవీపీఎస్‌

తాజా వార్తలు

04:51 PM

అన్ని గ్రామాలకు నాబార్డ్​ సేవలు: సీఎస్​

04:41 PM

మంత్రి పెద్దిరెడ్డిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి: వర్ల రామయ్య

04:30 PM

టీమిండియా యువ క్రికెటర్లకు గిఫ్టుగా మహీంద్రా వాహనాలు..

04:20 PM

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి

04:08 PM

లాలూ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఢిల్లీకి తరలింపు

04:00 PM

బీజేపీ ఎంపీ అరవింద్ కు చేదు అనుభవం..

03:45 PM

త్వరలో సీఎంగా కేటీఆర్.. టీఆర్ఎస్ మంత్రుల్లో టెన్షన్..

03:35 PM

ముఖ్యమంత్రిగా డిగ్రీ విద్యార్ధిని..

03:32 PM

బయట మార్కెట్లో కరోనా టీకా కొనుక్కొవాలనుకుంటున్నారా..

03:20 PM

రైతులను అడ్డుకున్న పోలీసులు.. నీటి ఫిరంగుల ప్రయోగం

03:19 PM

టిక్ టాక్ స్టార్ షేక్ రఫీ ఆత్మహత్య

03:16 PM

మే 7 నుండి పదో తరగతి పరీక్షలు..

03:05 PM

ట్రాక్టర్లను అడ్డుకున్న పోలీసులు..మండిపడ్డ రైతులు

02:23 PM

ఐక్యవేదిక నిరాహారదీక్ష భగ్నం..

02:16 PM

లోయలో పడిన జీపు.. ఆరుగురు మృతి

02:04 PM

ఆరు రోజుల్లోనే పది లక్షల మందికి వ్యాక్సిన్​..

01:47 PM

బర్డ్‌ఫ్లూ కలకలం.. ఐదు నెమళ్లు మృతి

01:33 PM

వైసీపీ పతనానికి పంచాయతీ ఎన్నికలే నాంది కావాలి: చంద్రబాబు

01:28 PM

స్థానిక ఎన్నికలు వద్దు: ఉద్యోగ సంఘాల నేత

01:24 PM

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన రాహుల్

01:17 PM

ఏనుగు మృతి కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

01:14 PM

కాసేపట్లో జైలు నుండి విడుదల కానున్న అఖిల ప్రియ

01:09 PM

పంత్ తో నాకు విభేదాలు : వికెట్ కీపర్ సాహా

01:06 PM

ఆర్‌ఆర్‌ఆర్‌కు షాకిచ్చిన నటి

12:59 PM

నిరాహార దీక్షకు దిగిన ఐక్యవేదిక నేతల అరెస్ట్

12:52 PM

కోల్గేట్‌ సంస్థకు జరిమానా విధించిన వినియోగదారుల ఫోరం

12:37 PM

ప్రేమోన్మాది సునీల్ కుమార్ అరెస్ట్...

12:31 PM

ఏలూరులో విషాదం...

12:30 PM

కేటీఆర్ సీఎం అవగానే టీఆర్ఎస్ లో బాంబు పేలుతుంది : బండి

12:20 PM

శశికళను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని కోరిన దినకరన్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.