Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీకి పొన్నం ప్రభాకర్ ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఆర్టీసీలో కేంద్రానికి 30 శాతం వాటా ఉంటే బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షు లు పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. సమ్మె జరిగిన 48 రోజుల పాటు మౌనంగా ఉండడంలో అర్ధమేమిటన్న ప్రశ్నించారు. శుక్రవారం గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆర్టీసీ సమ్మె దాదాపు ముగియనున్న తరుణంలో బీజేపీ ఇప్పుడు ఏదో చేస్తున్నట్టు, ప్రయత్నాలు చేసినట్టు నటిస్తున్నదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కోసం కేంద్ర రవాణా శాఖ మంత్రి ఫోన్లో ప్రయత్నం చేస్తే 'ఆయన కలవలేదు' అని చెబుతున్నారంటే...ఆ రెండుపార్టీల లోపాయికారీ ఒప్పందంలో భాగమేనన్నారు.