Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్
నవతెలంగాణ- శంకరపట్నం
కులదురహంకార హత్యకు గురైనట్టు అనుమానిస్తున్న కుమార్ కేసు విచారణ వేగవంతం చేసినట్టు టాస్క్ఫోర్స్ ఏసీపీ శోభన్కుమార్ తెలిపారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్లో హత్యకు గురైన కుమార్ మృతదేహం ఈనెల 9న లభ్యమైన నేపథ్యంలో బుధవారం టాస్క్ఫోర్స్ పోలీసులు ఘటనాస్థలంలో విచారణ చేపట్టారు. హుజూరాబాద్ రూరల్ సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో మా ట్లాడారు. కుమార్ హత్యకు అతని ప్రియురాలి తల్లిదండ్రులే కారణమంటూ మృతుని బంధువులు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. త్వరలోనే నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.