Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఏమిసేతురా..? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Apr 08,2021

ఏమిసేతురా..?

- తగ్గిన దిగుబడులు..
- తగ్గుతున్న ధరలు
- ఆందోళనలో మిర్చి రైతులు
నవతెలంగాణ-వరంగల్‌
గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది మిర్చి పంట దిగు బడులు తగ్గాయి. పెట్టుబడి మాత్రం పెరిగింది. కానీ పంట ధరలు క్రమంగా తగ్గాయి. దాంతో రైతులు తీవ్రంగా నష్టపో తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఎనుమాముల మార్కెట్‌ లో వరుసగా వచ్చిన నాలుగు రోజుల సెలవుల అనంతరం మార్కెట్‌ యార్డుకు పెద్ద ఎత్తున మిర్చిని రైతులు తీసుకు వచ్చారు. ఏప్రిల్‌ 1వ తేదీ వరకు మార్కెట్‌కు 19 వేల క్వింటాళ్ల మిర్చి మాత్రమే రాగా, రూ.13 వేల ధర వచ్చింది. అనంతరం 6,7 తేదీల్లో 21 నుంచి 22 వేల క్వింటాళ్ల మిర్చి వచ్చింది. ఏప్రిల్‌ 1వ తేదీకి, 7వ తేదీకే క్వింటాల్‌కు రూ.2 వేలు ధర పడిపోయింది. పెట్టుబడి కూడా రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకవైపు దిగుబడులు తగ్గడం, మార్కెట్‌లో ధరలు తగ్గడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌లో మిర్చి రైతులకు గిట్టుబాటు ధర రాక తీవ్రంగా నష్టపోతున్నారు. మంగళ, బుధవారాలు మార్కెట్‌కు పెద్ద ఎత్తున మిర్చి రావడంతో 'నవతెలంగాణ' మార్కెట్‌ను సందర్శించినప్పుడు పలు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. గత ఏడాది ఏప్రిల్‌లో కోవిడ్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో ఎనుమాముల మార్కెట్‌లో క్రయ, విక్రయాలు జరగలేదు. ఈ ఏడాది మార్కెట్‌కు తేజ, వండర్‌హాట్‌, యుఎస్‌ 341, దేశీ మిర్చి, సింగిల్‌పట్టి, డిడి తదితర మిర్చి దిగుబడులు అధికంగా వస్తాయి. గత ఏడాదితో పోల్చితే మిర్చి దిగుబడులు తగ్గినట్టు రైతులు స్పష్టం చేశారు. ధరలేమో పడిపోతున్నాయి.
పతనమవుతున్న ధరలు
ఏడాదికేడాది మిర్చి ధరలు తగ్గుతూ
పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఉంది. ఎనుమాముల మార్కెట్‌కు 2019 డిసెంబర్‌లో 14,295 క్వింటాళ్ల మిర్చి వస్తే క్వింటాల్‌కు రూ.13,633 ధర వచ్చింది. 2020 జనవరిలో 49,906 క్వింటాళ్ల మిర్చి రాగా, రూ.16 వేల ధర పడింది. ఫిబ్రవరిలో 1,12,500 క్వింటాళ్లు రాగా రూ.13,500 ధర, మార్చిలో 2 లక్షల క్వింటాళ్ల మిర్చికి క్వింటాకు రూ.14 వేల ధర పడింది. ఏప్రిల్‌లో కోవిడ్‌ లాక్‌డౌన్‌తో మార్కెట్‌ బందయ్యింది. దాంతో మిగిలిన మిర్చి పంటను కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ చేశారు. అదంతా ఇప్పుడు మార్కెట్‌కి తరలుతుంది. ఈ ఏడాది మార్కెట్‌ సీజన్‌ 2020 డిసెంబర్‌ నుంచి ప్రారంభమవగా.. 2020 డిసెంబర్‌లో 8,604 క్వింటాళ్ల మిర్చి రాగా, క్వింటాల్‌కు రూ.13,300 ధర పలికింది. 2021 జనవరిలో 20,100 క్వింటాళ్లు రాగా.. రూ.13 వేల ధర వచ్చింది. ఫిబ్రవరిలో 1,64,831 క్వింటాళ్ల మిర్చి రాగా, క్వింటాల్‌కు రూ.12 వేల ధర పడింది. మార్చిలో 3,56,235 క్వింటాళ్ల మిర్చి రాగా క్వింటాల్‌ ధర రూ.12,800 వచ్చింది. ఏప్రిల్‌లో ఇప్పటి వరకు 19,471 క్వింటాళ్ల మిర్చి రాగా, రూ.12,500 ధర పడింది. దాంతో పెట్టుబడి కూడా రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. బుధవారం 21,947 క్వింటాళ్ల మిర్చి మార్కెట్‌కు రాగా వండర్‌హాట్‌ మిర్చి క్వింటాల్‌కు ధర రూ.1000 తగ్గగా, యుఎస్‌-341 రకానికి రూ.500, సింగిల్‌పట్టి రకం రూ.1,000లకు ధర తగ్గింది. గతేడాదికి ఈ సంవత్సరానికి ధరల్లో తేడా భారీగా ఉండటంతో ధరల పతనం రైతులకు అంతుపట్టక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
దిగుబడులు తగ్గినరు.. : కంకట సదయ్య, వేములపల్లి, మొగుళ్లపల్లి
ఎకరంల మిర్చి పెట్టితే.. 23 బస్తాలు వచ్చినయి.. క్వింటాల్‌కు రూ.14 వేల ధర పడింది. గతేడాదే దిగుబడి తగ్గితే.. ఈ ఏడాది వర్షాలతో మరింత తగ్గింది. కూలీలతో పాటు పెట్టుబడి ఖర్చులు చానా పెరిగినయ్..
ధరలు తగ్గుతానరు : అచ్చ సతీష్‌, వెలిశాల, టేకుమట్ల
రెండెకరాల మిర్చి సాగు చేసిన.. ఎకరానికి లక్ష పెట్టుబడిపెడితే 18 బస్తాల దిగుబడి వచ్చింది. గత ఏడాది కూడా దిగుబడితగ్గింది. పెట్టుబడి ఖర్చులు కూడా రాలేదు. రోజురోజుకూ ధరలు తగ్గుతానరు 20వేలు ధర పడితే బాగుండేది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉద్యోగుల ఎదురు చూపులకు నేడు తెర?
ఆస్పత్రుల్లో.. రోగుల ఇక్కట్లు
వ్యాక్సిన్‌ కొరతను తీర్చాలి
శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
సాగర్‌ ముగిసింది.. సారథి కోసం వేట
ప్రాణవాయువు దొరికేదెలా?
రైతుల పడిగాపులు
ఆక్సిజన్‌ సమస్యపై మాట్లాడదామంటే.. బెంగాల్‌ ఎన్నికల్లో బిజీగా మోడీ
ఉద్యోగ భద్రత కాదు...భ్రష్టత్వమే!
అప్రమత్తత అవసరం: డాక్టర్‌ శ్రీనివాస్‌
ఎస్సీ ఎస్టీల ప్రత్యేక నిధి పక్కదారి !
మురికి కూపంలో మున్సిపాల్టీలు
విలువలకు తిలోదకాలు
వైఎస్‌ షర్మిల దీక్ష విరమణ
ఎండలు పెరుగుతున్నయ్‌
రాష్ట్రంలో 5,093 మందికి కరోనా
ప్రతిభ డిగ్రీ కళాశాలకు ఐఏస్‌ఓ గుర్తింపు
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి
లక్షా 18వేల మందికి ఆర్థిక సహాయం
మావోయిస్టు స్థావరాలపై జవాన్ల దాడి
వన్యప్రాణుల వేటగాళ్ల అరెస్ట్‌
వారసత్వ కట్టడాలని రక్షించుకుందాం
ఎర్రబెల్లికి సన్మానం
వేరుశనగ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఒక్కరోజే..కోవిడ్‌తో ఆరుగురు మృతి
గెలుపెవరిది..?
కేసీఆర్‌ పునాదులు కదిలేలా ప్రజా ఉద్యమాలు
యమ డేంజర్‌...
టెస్టులకు తంటా...
సీఐటీయూ మాజీ నేత శ్రీహరి కుమార్తె ప్రసూన మృతి : తమ్మినేని సంతాపం

తాజా వార్తలు

07:41 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు

07:28 PM

సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్

07:19 PM

పుర ఎన్నికలు నిలిపివేయలేం: తెలంగాణ హైకోర్టు

07:06 PM

కొత్త పింఛన్లు ఇవ్వాలని వినతి..

07:02 PM

ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభం...

06:59 PM

పీవైఎల్ జిల్లా అధ్యక్షకార్యదర్శులుగా చింత నరసింహారావు, పర్శిక రవి.

06:52 PM

అరుణ గ్రహంపై తొలిసారి ఎగిరిన హెలికాప్టర్‌

06:48 PM

మాజీ ప్రధానికి కరోనా పాజిటివ్​

06:15 PM

నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ కు కరోనా పాజిటివ్

05:54 PM

లాక్ డౌన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు..

05:49 PM

లాక్ డౌన్ పెట్టే ఆలోచన లేదు : మంత్రి ఈటల రాజేందర్

05:29 PM

రూ.3వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత

05:15 PM

గంటల వ్యవధిలో తల్లీ, కొడుకు మృతి.. విషాదం నింపిన కరోనా

04:56 PM

రెండు టీకా కంపెనీలకు రూ.4,500కోట్లు ప్రకటించిన కేంద్రం

04:47 PM

వీకెండ్స్ మాత్రమే తెరుచుకొనున్న వండర్‌లా

04:35 PM

ఏపీలో స్కూళ్లకు సెలవులు..

04:25 PM

ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో తీవ్ర ఉద్రిక్తత

04:04 PM

చెరువులో పడి ఇద్దరు మృతి

03:53 PM

ప్రముఖ డాక్టర్లతో ప్రధాని మోడీ సమావేశం

03:35 PM

ఆశ్రయం ఇచ్చి.. అదును చూసి.. అక్కాచెల్లెళ్లపై దారుణం

03:23 PM

సోనూసూద్ ఆదర్శంగా ఆటో డ్రైవర్ సేవలు..

03:14 PM

ఇప్పటికిప్పుడు లాక్ డౌన్ అవసరం లేదన్న సీఎం

02:58 PM

భారీ ఆఫర్లు ప్రకటించిన హ్యూండాయ్ కార్ల కంపెనీ

02:47 PM

ఇంజక్షన్లు పనిచేయవు.. ఆల్కాహాల్ సర్వరోగ నివారణి అంటున్న మహిళ

02:31 PM

అందరూ చూస్తుండగానే రూ.9లక్షలు ఎత్తుకెళ్లిండు

02:21 PM

ఓపెనింగ్ రోజే బిర్యానీ షాపుకు సీల్..

02:01 PM

నల్గొండలో ధాన్యాన్ని కొనాలంటూ రైతుల ఆందోళన..

01:46 PM

నాగర్ కర్నూల్ లో చైన్ స్నాచింగ్

01:12 PM

ప్రజల ప్రాణాల కంటే పబ్ లు, మద్యం దుకాణాలే ముఖ్యమా : హైకోర్టు

01:03 PM

పారిపోయేందుకు ప్రయత్నించి.. కాలు విరగ్గొట్టుకున్నాడు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.