Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
పిల్లలను పంపేందుకు...60 శాతం తల్లిదండ్రులు సమ్మతి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 28,2021

పిల్లలను పంపేందుకు...60 శాతం తల్లిదండ్రులు సమ్మతి

- కొత్త బియ్యం వాడాలి
- డీఈవోలకు మంత్రి సబిత ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
వచ్చేనెల ఒకటి నుంచి పిల్లలను బడులకు పంపించేందుకు 60 శాతం మంది తల్లిదండ్రులు సమ్మతి తెలియజేశారని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. విద్యార్థులు తప్పనిసరిగా ప్రత్యక్ష తరగతులకు హాజరుకావాలన్న నిబంధనలేవీ లేవని స్పష్టం చేశారు. తల్లిదండ్రుల సమ్మతి ఉంటేనే తరగతులకు అనుమతిస్తామని తెలిపారు. విద్యార్థులు ప్రత్యక్ష తరగతులు, ఆన్‌లైన్‌ బోధననలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చని సూచించారు. వచ్చేనెల ఒకటి నుంచి పున:ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలను సన్నద్ధం చేసేందుకు బుధవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో డీఈవోలు, డీఐఈవోలతో వేర్వేరుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు. లక్షలాది మంది విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరవుతున్నందున కోవిడ్‌ మార్గదర్శకాలన్నింటినీ సంపూర్ణంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలకు పంపడం సురక్షితమే అన్న భావనను తల్లిదండ్రుల్లో కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. జిల్లాస్థాయిలో విద్యాసంస్థల నిర్వహణకు అంతా జిల్లాస్థాయి విద్యాపర్యవేక్షణ కమిటీలదేనని తెలిపారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో విద్యాసంస్థల నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి బియ్యం, ఇతర ఆహార పదార్థాలన్నింటినీ కొత్తవి మాత్రమే వినియోగించాలని ఆదేశించారు. కోవిడ్‌-19 జాగ్రత్తలు పాటిస్తూ ఈ పథకాన్ని అమలు చేయాలని సూచించారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులు తరగతి గదులకు హాజరవుతున్న సందర్భంగా థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయడం జరుగుతుందన్నారు. తరగతి గదులను శానిటైజ్‌ చేసే ప్రక్రియను నిరంతరం చేయాలనీ, ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా సమస్యలు ఉత్పన్నమవుతాయని హెచ్చరించారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో 70 శాతం సిలబస్‌ పూర్తయినందున, విద్యార్థుల సందేహాలతోపాటు మిగతా సిలబస్‌పై దృష్టిసారించాలని ఆదేశించారు. ప్రయివేటు విద్యాసంస్థలూ కోవిడ్‌ మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించేలా అధికారులు పర్యవేక్షించాలని కోరారు. పాఠశాలల పారిశుధ్య పనులను స్థానిక సంస్థలు నిర్వహించేలా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందనీ, ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు మరింత శ్రద్ధ వహించాలని సూచించారు. పదో తరగతి పరీక్షల సందర్భంగా విద్యార్థుల్లో మనోధైర్యం పెంచేలా చర్యలు చేపట్టాలని వివరించారు.
ఇంటర్‌ విద్యార్థులకు రోజూ ప్రాక్టికల్‌ తరగతులు
ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇతర తరగతులతోపాటు ప్రతిరోజూ ప్రాక్టికల్‌ తరగతులను నిర్వహించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఇంటర్‌ పరీక్షలకు సంబంధించిన వివరాలను వారంరోజుల్లో వెల్లడిస్తామన్నారు. ప్రతి కాలేజీలో విధిగా ఐసోలేషన్‌ గదులను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రయివేటు కాలేజీలూ కోవిడ్‌ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కళాశాల వారీగా రూపొందించి అమలు చేయాలని వివరించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్‌, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేనతోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మార్చి నుంచి వ్యాక్సినేషన్‌
బడులు షురూ
అసత్యాల పునాదులపై గద్దెనెక్కిన బీజేపీ
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
నాగేశ్వర్‌ కు సంపూర్ణ మద్దతు
టీఆర్‌ఎస్‌ నేత ఇంట్లో ఐటీ సోదాలు
అమ్మేదెట్టా..
వేతన సవరణపై కేంద్రంచొరవ చూపాల్సిందే
హెచ్‌సీయూ భూమిపై అధికారం ఎక్కడిది?
మంత్రి తండ్రికి సీఎం కేసీఆర్‌ నివాళి
'సోలార్‌' వేగవంతం చేయండి
జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు మరిన్ని నిధులు, విధులు కేటాయించండి
కేసీఆర్‌, విజయశాంతి స్థానికత ఏమిటి..?
బంగారాన్ని అంబులెన్స్‌ సిబ్బందే దొంగిలించారు
27న ఆర్టీసీలో కార్మిక బ్యాలెట్‌
మార్చి 24న లాసెట్‌ నోటిఫికేషన్‌
ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య
రైతులను మోసం చేస్తున్న విత్తన కంపెనీలు
కవిత ఓడిపోతే.. ఎమ్మెల్సీ ఇచ్చేదాక నిద్రపోలే
మొక్కల రక్షణకు చర్యలు : శాంతి కుమారి
ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహంపై నేతలతో రమణ భేటీ
గుణపాఠం చెప్పాలి..
తరగతి గదులు సరిపోయేనా?
బతుకమ్మ చీరల కూలి పెంచాలి
నాయీబ్రాహ్మణుల మెడపై కార్పొరేట్‌ కత్తి
అక్రమ మైనింగ్‌ను అరికట్టాలి
పెచ్చులూడిన అసెంబ్లీ భవనం
గ్రామపంచాయతీ లేఅవుట్లలో ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయాలి
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బంగారం వ్యాపారులు మృతి
అదుపుతప్పి సెల్లార్‌ లో పడిన లారీ కంటైనర్‌

తాజా వార్తలు

09:47 PM

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మోడీ కీలక వ్యాఖ్యలు..

09:41 PM

మాజీ ప్లేయర్​ పీటర్సన్​ను ట్రోల్ చేస్తున్న భారత అభిమానులు

09:33 PM

కలెక్టరేట్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయండి : సీఎస్​

09:24 PM

మోడీ త్వరలోనే మాజీ ప్రధాని అవుతారు.. సీఎం షాకింగ్ కామెంట్స్

09:16 PM

కేసీఆర్‌ తీరు బీజేపీతో ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీలా ఉంది : జీవన్ రెడ్డి

09:04 PM

కేసీఆర్, జగన్, విజయశాంతిపై షర్మిల సంచలన వ్యాఖ్యలు..

08:58 PM

నోటుకు ఓటు కేసులో కోర్టుకు హాజరైన రేవంత్​రెడ్డి

08:44 PM

సీఎం కీలక నిర్ణయం..1 నుండి 7వ తరగతి విద్యార్ధులకు..

08:32 PM

వామన్ రావు హత్య కేసు.. ప్రభుత్వానికి లేఖ రాసిన గవర్నర్

08:20 PM

క్రికెట్ స్టేడియంకు మోడీ పేరు పెట్టడంపై రాహుల్ గాంధీ విమర్శలు

08:02 PM

పట్టభద్రుల ఎమ్మెల్సీ నామపత్రాల పరిశీలన పూర్తి

07:54 PM

దిశ చట్టం అంటూ మాయ చేసిన జగన్ : లోకేశ్

07:40 PM

తెలంగాణ విద్యార్ధులు, నిరుద్యోగులతో ముగిసిన షర్మిల భేటీ..

07:23 PM

అమెరికాలో కరోనా విజృంభణ.. బైడెన్ కీలక నిర్ణయం

07:11 PM

గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బోణి కొట్టిన ఆమ్‌ ఆద్మీ

07:01 PM

రేపటి నుండి ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నిలిచిపోనున్న సర్వీసులు

06:52 PM

ప్రైవేటు బ్యాంకులకు శుభవార్త..

06:44 PM

వామన్‌రావు హత్య కేసు : పోలీసుల కస్టడీలో నిందితులు..

06:40 PM

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

06:34 PM

చెలరేగిన భారత స్పిన్నర్లు.. 112పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్

06:29 PM

నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లావాసులకు హెచ్చరిక..

06:13 PM

ఎనీ వేర్​-ఎనీ టైం సేవలకు గుర్తింపు.. అవార్డు ప్రదానం

06:04 PM

టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కు లేదు: ఉత్తమ్​

05:49 PM

కామారెడ్డి జిల్లాలో గొంతు కోసుకుని యువతి ఆత్మహత్య..

05:38 PM

పెరుగుతున్న కేసులు.. రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్రం

05:32 PM

పోలీసులు, లిక్కర్ మాఫియాకు మధ్య కాల్పులు.. ఎస్ఐ మృతి

05:22 PM

ఎర్రకోట ముట్టడి ఘటనలో 19 అరెస్టులు, 25 కేసులు : కేంద్రం

05:13 PM

ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు..

05:05 PM

భార్య, కుమార్తెను కాపాడేందుకు ఏకంగా పులితోనే పోరాడి..

04:50 PM

108 సిబ్బందే బంగారం దొంగతనం చేశారు : పోలీసులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.