Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
కళతప్పిన సంక్రాంతి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 13,2021

కళతప్పిన సంక్రాంతి

- డూడూ బసవన్నలపైనా కరోనా దెబ్బ
- గంగిరెద్దులోళ్ల బతుకులు ఆగం
- పూటగడవక ఇబ్బందులు..సొంతిళ్లు లేక తిప్పలు
- కళాకారుల గుర్తింపులోనూ వివక్షే
                 రథం ముగ్గులు... రేగుపండ్లు, పిండికొమ్మలతో గొబ్బెమ్మలు పెట్టినా సంక్రాంతికి నిండుశోభ తెచ్చిపెట్టేది గంగిరెద్దులాటే. 'అయ్యగారికి దండంపెట్టు...అమ్మగారికి దండం పెట్టు...ఇంటిల్లిపాదిని దీవించు' అనే గంగిరెద్దులోళ్ల సందడి అంతా ఇంతా కాదు. పీక ఊదుతూ..డోలి కొడుతూ ఉంటే డూ..డూ..బసవన్నల సయ్యాటలు...గంగిరెద్దులోళ్ల విన్యాసాలను చూస్తుంటే ఆహా! అనిపించక మానదు. వాటి విన్యాసాలను కండ్లప్పగించి చూడాల్సిందే. పేరుపేరునా తలుస్తుంటే ఔరా! అనాల్సిందే. నిక్కచ్చిగా చెప్పాలంటే సంక్రాంతి పండుగకు నిండు శోభ తెచ్చేది పతంగుల ఆట, గంగిరెద్దులోళ్ల ఆటాపాటే. కానీ, ఈ సారి ఆ 'కళ' తప్పింది. గంగిరెద్దుల హడావిడే కనిపించట్లేదు. గంగిరెద్దులోళ్లపైనా కరోనా ప్రభావం పడింది. పండుగ పూట పస్తులుండాల్సిన దుస్థితి వారిండ్లలో నెలకొంది. సంక్రాంతి పండగ నేపథ్యంలో గంగిరెద్దులోళ్ల జీవన స్థితిగతులపై నవతెలంగాణ ప్రత్యేక కథనం..
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో 40 నుంచి 50 వేల దాకా గంగిరెద్దులవాళ్లు ఉన్నారు. కానీ, తమ వాళ్లు రాష్ట్ర వ్యాప్తంగా 70 వేల దాకా ఉంటారని గంగి రెద్దుల సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. ప్రధానంగా నల్లగొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, కరీంనగర్‌, వరం గల్‌, సిద్ధిపేట, హైదరాబాద్‌లో ఎక్కువగా ఉన్నారు. అయితే వీరు సంఘటితంగా ఎక్కడా లేరు. జిల్లాకో వెయ్యి, రెండు వేల కుటుంబాలు అదీ గ్రామాల్లో విసిరేసినట్టుగా ఉన్నాయి. దసరా, సంక్రాంతి పండగల సందర్భాలలో ఊర్లను వాటా లుగా పంచుకుని ఇంటింటికీ వెళ్తూ తమ గంగిరెద్దులను ఆడించి ప్రజలు ఇచ్చినంత తీసుకుని దీవనార్థాలు ఇస్తారు. ప్రతి ఇంటి యజమాని, వారి పూర్వీకుల పేర్లను గుర్తుకు పెట్టుకుని మరీ వారి పేర్లను తల్చుకుంటూ, కీర్తిస్తూ గంగిరెద్దులను ఆడించటం వీరి అద్భుత జ్ఞాపకశక్తికి నిదర్శనం. గ్రామంలో ఎవరైనా చనిపోతే తెలుసుకుని మరీ దినాల రోజు ఐదుగురు నుంచి పది మంది వరకు ఆటోను కిరాయికి మాట్లాడుకుని వారి ఇండ్ల ముందు వాలుతారు. దశ దినకర్మకు గంగిరెద్దులతో తమ కళను ప్రదర్శిస్తారు. చనిపోయిన వ్యక్తి కుటుంబం ఇచ్చే ఎంతో కొంత డబ్బును తీసుకుని ఇంత అన్నం తిని వెళ్లిపోతారు. ఇలా పని దొరికేది కొన్ని రోజులే. పండగ దినాలు, చావులు పోనూ మిగతా పనిదినాల్లో కూలినాలి దొరికితేనే కడుపు నిండేది. రానురాను కళకు ఆదరణ తగ్గటంతో ఇల్లు గడవక ఆడవాళ్లు గంపల వ్యాపారం(హరేక్‌ మాల్‌ సామానును తీసుకుని ఊర్లల్లో అమ్మటం) చేస్తున్నారు.
కళపై కరోనా దెబ్బ
కరోనా వచ్చాక వీరి బతుకులు దుర్భరంగా మారాయి. సమాజంలో ఎవ్వరూ దగ్గరకు రానివ్వని పరిస్థితి నెలకొంది. ఇండ్లను తిరిగి రావడం వల్ల కరోనా వస్తుందని చాలా కాలనీల్లోకి గంగిరెద్దుల వాళ్లను రానివ్వట్లేదు. కల్వకుర్తి దగ్గర ఓ ఊర్లో వాళ్లు మా ఊరి చివర ఉండొద్దంటూ తరిమిగొట్టారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆంక్షలతో చావులకు కొంత మందే రావాలనే నిబంధన పెట్టారు. దీంతో గంగిరెద్దుల వాళ్లను అక్కడకు అస్సలు రానివ్వట్లేదు. దీంతో వారు తమ ఉపాధిని కోల్పోయారు. కరోనా దెబ్బతో ఈ సంక్రాంతికి గంగిరెద్దుల హడావిడి అంతగా లేదు.
చదువుకున్నోళ్లు అంతంతే..రాజకీయ చైతన్యమూ తక్కువే
గంగిరెద్దుల సామాజిక తరగతిలో సర్కారు కొలువులున్నవారిని భూతద్ధంలో వెతికి చూడాల్సిన దుస్థితి. మొత్తంగా చూస్తే ఇద్దరు టీచర్లు, ఓ కానిస్టేబుల్‌, ఓ కండక్టర్‌, ఓ డ్రైవర్‌ మాత్రమే ఉన్న పరిస్థితి. ఇటీవల అనారోగ్యంతో కానిస్టేబుల్‌ కూడా చనిపోయాడు. పదోతరగతి దాటి చదివినోళ్ల సంఖ్య రెండువేల లోపే. డిగ్రీ దాటినోళ్లుఐదొందలలోపే. గంగిరెద్దులను ఆడించుకుంటూ ఒక్కకాడ ఉండకుండా ఊర్లు తిరుగుతుండటంతో ఆ సామాజిక తరగతిలో చదువుకున్న సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో ఆర్థికంగానూ, సామాజికంగా, రాజకీయంగానూ తీవ్ర వెనుకబాటులో ఉంది. రాష్ట్రంలో ఒక్క సర్పంచ్‌గానీ, ఎమ్‌పీటీసీగానీ లేకపోవడం గమనార్హం. మొత్తం మీద తెలంగాణలో గంగిరెద్దుల సామాజిక తరగతికి చెందిన ఆరుగురు వార్డుమెంబర్లు ఉన్నారు. రాజకీయంగా అత్యున్నత స్థాయిలో ఉన్నవాళ్లు వాళ్లే అంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
సొంతగూడూ కరువే..పథకాలు అందితే ఒట్టు!
పక్షులు పొద్దస్తమానం ఎక్కడెక్కడో తిరిగి సొంతగూటికి చేరుతాయి. వాటికైనా సొంత గూడుంది. కానీ, పొట్టతిప్పల కోసం కళాప్రదర్శనలు ఇచ్చి అలసిసొలసిన గంగిరెద్దులోల్లకు నిలువు నీడా లేదు. వారికంటూ ఓ సొంత గూడు లేదు. తరాలుగా ఇదే పరిస్థితి. రేషన్‌కార్డులు కూడా లేవు. దీంతో పథకాలకు దూరం అవుతున్నారు. సొంతిళ్లను కట్టిస్తామని గతంలో మంత్రి ఈటల రాజేందర్‌ హామీనిచ్చినా పట్టాలెక్కలేదు.ఆ సామాజిక తరగతిలోని మహిళలకు ఒక్కో గంపకు లక్ష రూపాయల చొప్పున సబ్సిడీ రుణాలు అందజేస్తామని హామీ నేటికీ నెరవేరలేదు.
సాహోపేత కళ.. పట్టుతప్పితే అంతే
ఒక్కో గంగిరెద్దుకు లక్ష, లక్షన్నర పెట్టి కొనాలి. ఆ తర్వాత ఆ ఎద్దుకు ఆట నేర్పాలి. ఆ తర్వాత వాటిని ఆడించడమూ నిజంగా ఓ కళే. పట్టుతప్పితే ప్రాణాలు కోల్పోవాల్సిందే. దండం పెట్టుడు. పొగుడుతూ తల ఊపించడం వరకు ఓకే. కబడ్డీ ఆటను ప్రాణాలను అడ్డుపెట్టి మరీ ఆడించాల్సిందే. ఒక్కోసారి గంగిరెద్దు ఎక్కువ ఆవేశానికి లోనైతే ఆపడం ఎవరితరమూ కాదు. మేడ్చల్‌ జిల్లాలో ఇలాగే ఓ గంగిరెద్దులాయన చనిపోయాడు. నాలుగైదేండ్లలో పదిమంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. తెలంగాణ భాషా, సాంస్కృతిక మండలి గంగిరెద్దుల కళాకారులను గుర్తించడంలో వెనుకబడింది.

సొంతిళ్లు కట్టివ్వాలి.. చదువులు చెప్పించాలి
సొంతిళ్లే లేనప్పుడు ఆత్మగౌరవ భవనాలెందుకు? ప్రతి కళాకారునికీ సొంత ఇల్లు కట్టి ఇవ్వాలి. గంగిరెద్దుల కళను, కళాకారులను సర్కారు గుర్తించాలి. సంక్రాంతి పండుగ రోజు శిల్పారామంలో ఓ పదిమంది గంగిరెద్దులోళ్లను తీసుకెళ్లి ఆటలాడించడం వల్ల మా బతుకులు మారవు. చదువు దరిచేరకపోవటంతో వెనుకబాటు తనం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఎంట్రెన్స్‌ పరీక్షల్లేకుండా మా పిల్లలకు గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లు ఇవ్వాలి. కుల ధ్రువీకరణ పత్రాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దీన్ని సర్కారు పరిష్కరించాలి.
- రామస్వామి, గంగిరెద్దుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆహార భద్రతకు ముప్పు
సాగునీటి గోస లేకుండా చేయడమే లక్ష్యం
పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గింపునకు బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి
రాజ్‌ భవన్‌ ముట్టడి ఉద్రిక్తం
మహిళా సంఘాలకు మిత్తి రాలే!
కార్పొరేట్ల ఊడిగం కోసమే...
ఇండ్ల స్థలాలు ఇవ్వకుంటే ఆక్రమిస్తాం
రైతాంగ పోరాట స్ఫూర్తితో జీపీ, మున్సిపల్‌ కార్మికులు ఉద్యమించాలి
ఉదయ్, ఆదిత్యతో ఒరిగిందేమీ లేదు
జీవో 215 కేసులో కౌంటర్‌ ఎందుకు వేయలేదు ?
నేటి నుంచి కార్మిక-కర్షక పోరుయాత్ర
వినియోగదారుల సేవల్లో అలసత్వం వద్దు
తుది దశకు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక
ట్రంప్‌ పాలసీలనే బైడెన్‌ అనుసరిస్తారు
వారంలో ఇంటర్‌ పరీక్షల తేదీలు
3.48 లక్షల వ్యాక్సిన్‌ డోసుల రాక
కరోనా చికిత్సకు మెడికల్‌ రీఎంబర్స్‌మెంట్‌
రాష్ట్రంలో పెరుగుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు
కృష్ణా బోర్డు విశాఖలో వద్దు
కాళేశ్వరంపై హైకోర్టులో రిట్‌
బడికో స్వచ్ఛ కార్మికున్ని నియమించాలి
ఐఈఆర్పీల సమస్యల పరిష్కారానికి కృషి : మంత్రి సబిత
ప్రయివేటు అధ్యాపకుల సమస్యలపై స్పందించండి
పట్టణాభివృద్ధిపై పార్లమెంటరీ స్థాయి సంఘం సమీక్ష
హక్కుల పరిరక్షణకు ఐక్య ఉద్యమాలు అవసరం
కోవిడ్‌ మార్గదర్శకాలతో 1 నుంచి విద్యాసంస్థలు షురూ..
నేడు కాళేశ్వరానికి సీఎం
ఆర్థిక సంఘం సిఫారసులను అమలు చేయండి
వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఐక్య పోరాటాలు
భూబకాసురుల నుంచి భూములను కాపాడాలి

తాజా వార్తలు

09:54 PM

రోజు 10 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ వేస్తాం: ఈటల

09:36 PM

కేసీఆర్ పూజలపై అనుమానాలు.. : విజయశాంతి

09:15 PM

బైక్‌ను ఢీకొన్న లారీ..ముగ్గురు మృతి

09:00 PM

ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ అరెస్ట్

08:51 PM

సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు లేఖ

08:28 PM

ఎస్‌ఐ ఆత్మహత్య.. ప్రియురాలు జైలుకు

08:01 PM

మళ్లీ పెరిగిన బంగారం ధర

07:42 PM

కేక్ కట్ చేసినందుకు మహిళ అరెస్ట్..

07:16 PM

బంజారాహిల్స్‌ కార్పొరేటర్ విజయలక్ష్మిపై పోలీసులకు ఫిర్యాదు

07:02 PM

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

06:44 PM

హైదరాబాద్‌లో మరోసారి నిలిచిపోయిన మెట్రో ట్రైన్‌

06:44 PM

ధరణిపై మంత్రి హరీశ్ రావు సమీక్ష‌..

06:39 PM

ఏపీలో కొత్తగా 173 పాజిటివ్ కేసులు నమోదు

06:35 PM

మద్యం మత్తులో బైకుకు నిప్పు పెట్టిన మందుబాబు..

06:33 PM

ఐపీఎల్ 2021.. ఆర్సీబీ రిటెన్ ప్లేయర్స్ లిస్ట్ విడుదల

06:26 PM

రెడ్‌ అంబులెన్స్ సంస్థకు వ్యతిరేకంగా నిరసన

06:26 PM

జయలలిత సన్నిహితురాలు శశికళకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

05:54 PM

త్రిపురలో బీజేపీ కార్యకర్తల దాడులను నిరసిస్తూ సీపీఐ(ఎం) ర్యాలీ

05:52 PM

టీడీపీ నేత హత్య.. నిందితులు అరెస్ట్

05:43 PM

రాష్ట్రంలో కరోనా బారినపడ్డ జర్నలిస్టులకు 3కోట్ల ఆర్థిక సాయం..

05:36 PM

మరో 15 మెగావాట్ల సింగరేణి సోలార్‌ విద్యుత్తు ప్లాంట్ ప్రారంభం..

05:27 PM

కార్మిక కర్షక పోరు యాత్రను జయప్రదం చేయండి:- సీఐటీయ

05:21 PM

కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కొప్పుల

05:03 PM

నిర్మల్ జిల్లాలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి మృతి..

04:55 PM

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:40 PM

తగిన సమయంలో కేటీఆర్ సీఎం అవుతారు..

04:25 PM

సైనిక బలగాల రహస్యాలు బహిర్గతం చేయడం దేశద్రోహమే..

04:21 PM

వేడుకలు చేసుకోవడం కాస్త ఆపేయండి..

04:01 PM

ఆర్టీసీ బస్సు - డీసీఎం ఢీ.. 50 గొర్రెలు మృతి

03:55 PM

ప్రభాస్ పెళ్లి.. యాంకర్ పై కృష్ణం రాజు సీరియస్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.