Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ప్రేక్షకులు లేకుండానే..! | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Jan 27,2021

ప్రేక్షకులు లేకుండానే..!

- చెన్నైలో అభిమానులకు ప్రవేశం లేదు
- తొలి రెండు టెస్టులకు బీసీసీఐ నిర్ణయం
నవతెలంగాణ-చెన్నై : కరోనా వైరస్‌ మహమ్మారి అనంతరం భారత్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ పున ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 5న చెన్నైలో భారత్‌, ఇంగ్లాండ్‌ తొలి టెస్టుతో భారత్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ ఆరంభం అవనుంది. 2020 ఏడాది అభిమాన క్రికెటర్ల ఆటను మైదానల్లో వీక్షించే అవకాశం కోల్పోయిన క్రికెట్‌ ప్రేమికులకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిరాశే మిగిల్చింది. అవుట్‌డోర్‌ క్రీడలకు 50 శాతం సామర్థ్యంతో ప్రేక్షకులకు అనుమతి ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించినా.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బీసీసీఐ అభిమానులకు ప్రవేశం కల్పించటం లేదు. ఫిబ్రవరి 5న తొలి టెస్టు, ఫిబ్రవరి 13న రెండో టెస్టు చెన్నై చెపాక్‌ స్టేడియంలో జరుగనున్నాయి. టెస్టు సిరీస్‌లో చివరి రెండు టెస్టులు అహ్మదాబాద్‌లో జరుగనున్నాయి. ఐదు టీ20లు, మూడు వన్డేలకు అభిమానులను అనుమతించేందుకు అవకాశం కనిపిస్తోంది. కానీ తొలి దశలో భారత క్రికెట్‌ బోర్డు ఎటువంటి రిస్క్‌ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు లేదు. ' కోవిడ్‌19 ప్రమాదకర పరిస్థితుల్లో ఇంగ్లాండ్‌, భారత్‌ సిరీస్‌లో ఆటగాళ్ల బయో భద్రత విషయంలో బోర్డు ఎటువంటి రిస్క్‌ తీసుకోవటానికి సిద్ధంగా లేదు. బీసీసీఐ మార్గదర్శకాల ప్రకారం తొలి రెండు టెస్టులను అభిమానులకు ప్రవేశం కల్పించటం లేదు. ఖాళీ స్టేడియంలోనే మ్యాచులు నిర్వహించనున్నాం' అని టిఎన్‌సీఏ కార్యదర్శి ఆర్‌ రంగస్వామి తెలిపారు.
మూడు జోన్ల బబుల్‌! : శ్రీలంక పర్యటన ముగించుకుని ఇంగ్లాండ్‌ జట్టు నేడు ఉదయం చెన్నైకి చేరుకోనుంది. బెన్‌ స్టోక్స్‌, జోఫ్రా ఆర్చర్‌, రోరీ బర్న్స్‌లు ఇప్పటికే చెన్నైకి చేరుకుని క్వారంటైన్‌లో ఉన్నారు. 31 మంది సభ్యుల ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బృందం చెన్నైకి చేరుకున్న అనంతరం క్వారంటైన్‌ ముగించుకున్న అనంతరమే ప్రాక్టీస్‌ సెషన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అభిమానులకు ప్రవేశం లేని చెన్నై చెపాక్‌ స్టేడియంలో బయో భద్రత కోసం తమిళనాడు క్రికెట్‌ సంఘం (టిఎన్‌సీఏ), భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మూడు జోన్ల బయో సెక్యూరిటీని ఏర్పాటు చేశాయి. జోన్‌ 1లో ఇరు జట్ల క్రికెటర్లు, సహాయక సిబ్బంది, మ్యాచ్‌ అధికారులు ఉండనున్నారు. జోన్‌ 1ఏలో క్రికెటర్ల కుటుంబ సభ్యులు, నెట్‌ బౌలర్లు ఉండనున్నారు. జోన్‌ 1లో టిఎన్‌సీఏ అధికారులు, బీసీసీఐ ఆఫీస్‌ బేరర్లులు ఉండనున్నారు. జోన్‌ 3లో మైదానం వెలుపల భద్రతా సిబ్బంది, పోలీసులు ఉండనున్నారు. చెన్నై బయో బబుల్‌ను దాటి క్రికెటర్లు, సహాయక సిబ్బంది, కుటుంబ సభ్యులు బయటకు వెళ్లేందుకు లేదని టిఎన్‌సీఏ అధికారులు స్పష్టం చేశారు. భారత క్రికెటర్లు సైతం బుధవారం చెన్నైకి రానున్నారు. వివిధ నగరాల నుంచి క్రికెటర్లు చెన్నైకి చేరుకుని నేరుగా హౌటల్‌ గదిలో క్వారంటైన్‌లో ఉండనున్నారు.
చెపాక్‌ లో ఇంగ్లీష్‌ పిచ్‌! : చెన్నై చెపాక్‌ అనగానే స్పిన్‌ పిచ్‌ గుర్తొస్తుంది. ఐపీఎల్‌లోనూ చెపాక్‌ పిచ్‌ నెమ్మదిగా స్పందించటం అందరికీ తెలిసిందే. అయితే, ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు చెపాక్‌ పిచ్‌ ఇంగ్లీష్‌ పిచ్‌ తరహాలో ఉండనుందని సమాచారం. మూడు రోజుల వ్యవధిలో చెపాక్‌ స్టేడియం రెండు టెస్టులకు ఆతిథ్యం ఇవ్వనుంది. దీంతో పిచ్‌పై పచ్చిక ఉంచనున్నారు. ఏక కాలంలో రెండు పిచ్‌లను తయారు చేస్తున్నారు. పిచ్‌ నుంచి పేసర్లు, స్పిన్నర్లకు సహకారం ఉండేలా పిచ్‌ను సిద్ధం చేస్తున్నట్టు క్యూరేటర్‌ తెలిపాడు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పిచ్చి పిచ్చిగా పిచ్‌
యూసుఫ్‌ పఠాన్‌ వీడ్కోలు
జపాన్‌ కు ఒలింపిక్స్‌ కళ
అక్షర్‌ 2.0
బాధను ప్రేరణగా చేసుకుంటాం
వింటర్‌ స్పోర్ట్స్‌ వేదిక గుల్‌మార్గ్‌
రెండు రోజుల్లోనే..
స్థాయికి తగ్గ ప్రదర్శన చేశామ‌ని అనుకోవటం లేదు
సద్వినియోగం చేసుకోలేదు
400 వికెట్లు క్లబ్‌ లో అశ్విన్‌
అక్షర్‌ సిక్సర్‌
పటేల్‌ కాదు మోడీ స్టేడియం
గెలుపే లక్ష్యంగా..
మోతెరాకు రాష్ట్రపతి
నేడు ఆడుతున్నాను
రెండు టెస్టులూ గెలుస్తాం!
సచిన్ క్రికెట్ పాఠాలు.. ఫ్రీ..
గులాబీ టర్నర్‌?
ప్రకటనలకు పరిమితులు!
హెచ్‌సీఏ అక్రమాలపై విచారణ జరపాలి
తెవాటియా చితక్కొట్టాడు !
ఐఎస్‌ఎల్‌ తరహాలో ఐపీఎల్‌ !
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత జకోవిచ్‌
ఆ విషయంలో భారత్‌ను తప్పుబట్టలేం..!
ఒసాకాదే టైటిల్‌
ఫిట్టా..అన్‌ ఫిట్టా..!
దుమ్ము రేపాడు..
అందుకే వేలం వెర్రి!
ఫైనల్లో మెద్వదేవ్‌
సెరెనా కథ ముగిసే..

తాజా వార్తలు

05:39 PM

హెల్మెట్ ఫైన్‌కు డబ్బుల్లేక మంగళసూత్రం తీసిచ్చి..!

05:24 PM

రేపటి నుంచి మేడారం గుడి మూసివేత

04:55 PM

బావను టెంపోకు కట్టి అర కిలోమీటర్ లాక్కెళ్లిన భావమరిది

04:36 PM

ఉన్నతాధికారులతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్‌

04:15 PM

కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

04:09 PM

ఇస్రోకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు

03:45 PM

రోడ్డు ప్రమాదంలో సీపీఐ(ఎం) సీనియర్ నేత మృతి

03:43 PM

మార్చి 14వ‌ర‌కు స్కూ‌ళ్లు‌, కాలేజీలు బంద్‌

03:37 PM

మరో చరిత్రాత్మక విజయాన్ని అందుకున్న ఇస్రో

03:12 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

02:49 PM

ఆ లింకులను వాట్సాప్ ద్వారా పంపొద్దు: సుప్రీంకోర్టు

02:23 PM

ఐపీఎల్‌ను హైద‌రాబాద్‌లో కూడా నిర్వ‌హించాలి: కేటీఆర్

01:53 PM

సైకిల్​ను ఢీకొట్టిన బొలెరో వాహనం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

01:44 PM

ఎన్నిక‌ల నేప‌థ్యంలో దాడుల‌కు పాల్ప‌డుతున్నారు: చ‌ంద్ర‌బాబు

01:37 PM

నల్లగొండ క్రాస్ రోడ్డు వద్ద ఆడి కారు బీభత్సం..

01:25 PM

తెలంగాణలో కాంగ్రెస్ మాజీ ఎంపీకి షాక్..

01:17 PM

మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల‌ను నెర‌వేర్చుతాం: య‌న‌మ‌ల

01:10 PM

సభ్యత్వం తీసుకుంటేనే సంక్షేమ పథకాలు : టీఆర్ఎస్ ఎమ్మెల్యే

12:59 PM

విద్యావ్యవస్థలో మార్పులు రావాలి : రాహుల్ గాంధీ

12:48 PM

జగిత్యాల జిల్లాలో కారు ఢీకొని బాలుడు మృతి

12:40 PM

ముగిసిన రామమందిరం విరాళాల సేకరణ..రూ.2వేల కోట్లు వసూలు

12:29 PM

అప్పు తీర్చలేదని స్నేహితుడిపై కత్తితో దాడి

12:20 PM

గెలిచే టీడీపీ అభ్యర్థులను.. జగన్ పార్టీలో చేర్చుకుంటున్నారు: లోకేశ్

12:08 PM

కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనల్లుడు దారుణ హత్య..

11:53 AM

సినీ ఫక్కీలో దొంగలను పట్టుకున్న పోలీసులు..

11:43 AM

మా కూటమిలో ఎవరు చేరినా సీఎం అభ్యర్థిని నేనే: కమల్ హాసన్

11:29 AM

మార్చి 4న దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం

11:19 AM

చిన్నారికి అరుదైన వ్యాధి.. టీకా ఖరీదు రూ.16కోట్లు..

11:08 AM

ఉక్రెయిన్​ రెజ్లింగ్​ టోర్నీ ఫైనల్లో వినేశ్​ ఫొగాట్​

10:57 AM

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్​ఎల్వీ సీ-51..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.