Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-షాబాద్
ప్రభుత్వం రైతుసమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ప్రభులింగం అన్నారు. శుక్రవారం షాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యలయంలో రైతుసమస్యల పరిష్కారంపై అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ స్వామినాధన్ కమిషన్ సూచన ప్రకారం పెట్టే ఖర్చుకు అదనంగా 50శాతం కలిపి గిట్టుబాటు ధరలు అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను సబ్సిడీతో రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేయాలన్నారు. 60సంవత్సరాలు నిండిన రైతు, వ్యవసాయ కార్మికులకు రూ.10వేల పించన్లు ఇవ్వాలన్నారు. పెంచిన ఆర్టీసీ చార్జీలు తగ్గించి, నిరుపేదలకు రవాణా భారం కాకుండా చూడాలన్నారు. ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఒకేదఫా రుణమఫీ చేసి, పంటబీమ పథకం ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాములు, జంగయ్య, శివకుమార్, తదితరులు ఉన్నారు.