Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఇం'ధనం' ఖాళీ | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Nov 14,2019

ఇం'ధనం' ఖాళీ

నవతెలంగాణ-రంగారెడ్డిప్రతినిధి
జిల్లాలో ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్‌, మహేశ్వరం, హయత్‌నగర్‌, రాజేంద్రనగర్‌, చేవెళ్ల, వికారాబాద్‌, శంకర్‌పల్లి, తాండూర్‌, వికారాబాద్‌, పరిగిలో ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలోని బస్సులే కాకుండా, బండ్లగూడ, దిల్‌సుక్‌నగర్‌, మియాపూర్‌-1, మియాపూర్‌-2, హెచ్‌సీయూ బస్సులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నడుస్తున్నాయి. ఆయా డిపోల్లో బస్సులకు వినియోగించే టైర్లు, విడిభాగాలు చివరి దశకు చేరాయి. మరో నాలుగు రోజులు గడిస్తే ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంటుందని అధికారులు పేర్కొంటున్నారు. నడుస్తున్న అద్దె, ఆర్టీసీ బస్సులకు వస్తున్న టికెట్‌ ఛార్జీలు కేవలం ఇంధనానికే సరిపోవడంతో విడిభాగాలు కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది. చేసేదేమీ లేక ప్రస్తుతం ఉన్న విడిభాగాలు వేసి బస్సు నడిపిస్తున్నామని, లేకపోతే పక్కన పెడతామంటున్నారు.
ఇది ఆర్టీసీ బస్సుల ప్రస్తుత పరిస్థితి
అద్దె బస్సుల అప్పు రూ. 2 కోట్లు
ఆర్టీసీ అద్దె బస్సుల పరిస్థితి అధ్వానంగా మారింది. ఒక అద్దె బస్సుకు ఒక రోజుకు ఆర్టీసీ రూ.4వేలు డీజిల్‌కు ఇచ్చి నడిపిస్తున్నారు. కానీ రోజుకు రూ.7వేల పైచిలుకు డీజిల్‌కు ఖర్చవడంతో లక్షల్లో అప్పులు పేరుకుపోయాయని అద్దె బస్సు యజమానులు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం జిల్లా పరిధిలో డిపోల్లో 517ఆర్టీసీ బస్సులున్నాయి. ఇందులో ఆర్టీసీ బస్సులు 377కాగా, మరో 140అద్దె బస్సులున్నాయి. ఒక్కో బస్సుకు నెలకు రూ.లక్ష చొప్పున అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు నయాపైసా చెల్లించలేదు. డీజిల్‌, అద్దె ఖర్చు కలిపి రూ.2కోట్లపైగా చెల్లిస్తేనే అద్దె బస్సులు నడిపిస్తామంటున్నారు. లేకపోతే పక్కన పెట్టేస్తామని యజమానులు స్పష్టంగా పేర్కొంటున్నారు.
రెండు నెలలుగా అందని వేతనాలు
ప్రతి డిపోలో డీఎంతో పాటు ఒప్పంద పద్ధతిలో పని చేస్తున్న భద్రత గార్డులు, గైడ్లు, బస్టాండు, డిపో శుభ్రం చేసే స్వీపర్లు, డిపోలో పనిచేస్తున్న సహాయకులకు రెండు నెలల వేతనాలు చెల్లించాల్సి ఉంది. ఒంటి చేత్తో బస్సులను నడిపిస్తున్న ఆర్టీసీ ఉన్నతాధికారితో పాటు, డీఎంలకు రెండు నెలలుగా వేతనాలు లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
300కూడా నడవడం లేదు
జిల్లాలో సుమారు 3లక్షల మంది వరకు ప్రజలు ప్రయణాలు సాగిస్తున్నారు. వీరికి జిల్లాలో 377ఆర్టీసీ, మరో 140 వరకు అద్దె బస్సులను తీసుకుని నడిపిస్తున్నారు. కానీ ప్రస్తుతం 300 బస్సులు కూడా రోడ్డెక్కడం లేదు. వీటిలో 100 వరకు ఫిట్‌నెస్‌ లేని బస్సులే ఉన్నాయి. సమ్మెలేని కాలంలో వీటికి నిత్యం మరమ్మతులు చేస్తేనే నడిచే పరిస్థితి ఉండేది. కానీ సుమారు 38 రోజుల నుంచి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, క్యాషియర్లు, రూట్‌ అధికారులతోపాటూ, మెకానిక్‌లూ సమ్మెలో ఉన్నారు. దాంతో మరమ్మతులు లేక బస్సులు మూలకు చేరాయి. ఇక 517 బస్సులున్నా నిత్యం 3లక్షల మందికి సరిపోని పరిస్థితి ఉంటే, ఇక సమ్మెలో బందోబస్తు మధ్య కనీసం 300 బస్సులను కూడా నడిపించలేకపోతున్నారు.
వచ్చిన ఆదాయం వేతనాలకే...
జిల్లాలో మొత్తం 2500 మంది కార్మికులు పని చేసేవారు. 517 బస్సులు పూర్తి స్థాయిలో నిడిపిస్తేనే ప్రతిరోజు రూ.68లక్షల ఆదాయం వచ్చేది. గడిచిన 38 రోజుల సమ్మె కారణంగా సుమారు రూ.26కోట్ల మేర ఆర్టీసీ ఆదాయం పడిపోయింది. ఇదీలా ఉంటే తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకుని బస్సులు నడిపిస్తున్నారు. తాత్కాలిక డ్రైవర్‌కు రూ.1500, కండక్టర్‌కు రూ.1000 చొప్పున చెల్లిస్తున్నారు. దాంతో రోజు వారి ఆదాయం వారి వేతనాలకే సరిపోవడం లేదు. ఇక డిజిల్‌ ఖర్చులకు ఆదనంగా ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కాగా రోజు రూ.3వేల వేల నుంచి రూ.7వేల వరకు తీసుకురావాల్సిన బస్సులు తాత్కాలిక సిబ్బంది రూ.2వేల నుంచి రూ.4వేలు కూడా తీసుకురాడం లేదు. దాంతో ఆర్టీసీపై మరింత భారం పడుతుందనే చెప్పాలి.
పల్లెకు బంద్‌...
38 రోజుల సమ్మెకాలంలో ఆర్టీసీ బస్సులు పల్లె ముఖం చూడటం లేదు. తాత్కాలిక ఏర్పాట్లను కేవలం పట్టణ రూట్లల్లోనే చేసింది. జాతీయ రహాదారులు, పట్టణాల్లోనే నడిపిస్తుండటంలో 90శాతం ఆర్టీసీ బస్సులనే ఆధారం చేసుకుని ప్రయాణాలు చేస్తున్న కార్మికులు, ప్రజలు, విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ సమ్మె ఇంకెంత కాలం ఉంటుందో తెలియని ఆయోమయ పరిస్థితులు కన్పిస్తున్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బడీడు పిల్లలు బయట ఎందరు..?
రిజర్వాయర్‌ వద్దు
అంగన్వాడీలను మూసేసే కుట్ర
సుస్థిర అభివృద్ధికి ప్రయోగాలు అవసరం
ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి
మోడల్‌ మార్కెట్‌ కేంద్రంగా ఇబ్రహీంపట్నం
అర్హులైన రైతులకు ప్రభుత్వ భూములివ్వాలి
ముమ్మరంగా రోడ్ల విస్తరణ పనులు
అంగన్‌వాడీల మూసివేతను విరమించుకోవాలి
కుట్టు మిషన్‌ శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవాలి
మాజీ ఎంపీ కవితను కలిసిన జాగృతి నాయకులు
సీఐటీయూ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
సులభ్‌ కాంప్లెక్స్‌ నిర్మించాలని చిరువ్యాపారుల వినతి
ఉత్తమ ఫలితాలు సాధించాలి
త్వరలో రూ.5 భోజన పథకం ప్రారంభం
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే..
పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలివ్వాలి
ఎన్‌కౌంటర్‌లో నిందితులు హతం
మొక్కల రక్షణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ప్రాథమిక విద్య భవిష్యత్‌కు పునాది
బెల్టుదందా..
గంటలకొద్ది నిలబెట్టొద్దు
అభివృద్ధికి పెద్దపీట
పోలీసు ఉద్యోగం గురుతర బాధ్యత నేర్పుతుంది
పనిచేసే కార్యకర్తలకే పెద్దపీట
మలబార్‌ జ్యూవెలర్స్‌్‌లో మైన్‌ డైమండ్‌ షో
ఉదయం ఛీత్కారాలు సాయంత్రం సత్కారాలు
వణికిస్తున్న చలి... తరుముకొస్తున్న వ్యాధులు

తాజా వార్తలు

11:59 PM

విండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరంగా ధావన్‌ ?

11:40 PM

టాప్‌ హ్యాష్‌ట్యాగ్‌ గా 'బిగిల్‌'

11:30 PM

హెచ్‌సీయూ ప్లేస్ మెంట్స్ లో 340 మంది ఎంపిక

10:01 PM

14న ఉంగుటూరులో ఏపీ సీఎం జగన్ పర్యటన

09:54 PM

రైల్వే ఈ-టికెట్‌ రాకెట్‌ గుట్టురట్టు

09:48 PM

నిషిద్ధ ప్రాంతంలో ప్రవేశించిన శ్రియ..!

09:37 PM

మహిళ ఆత్మహత్య

09:27 PM

కొత్త జంటకు 'ఉల్లిగడ్డలు' కానుక

09:15 PM

ఒకే రోజు ముగ్గురికి పాముకాట్లు

09:08 PM

తెలుగులో రిలీజ్‌కు రెడీ అయిన దబంగ్ -3

09:00 PM

కేంద్ర మంత్రిని కలిసిన ఏపీ మంత్రి అనిల్ కుమార్

08:53 PM

మావోయిస్టు నేత రామన్న మృతి

08:42 PM

ఘోర ప్రమాదం : ఒకేసారి 50 కార్లు ఢీకొట్టుకున్నాయి..

08:36 PM

పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్న వాహనం సీజ్‌

08:34 PM

రేపే తెలంగాణ కేబినెట్ భేటీ

08:30 PM

స్టైలీస్ స్మార్ట్‌వాచ్‌లను విడుదల చేసిన ప్రముఖ కంపెనీ

08:15 PM

చిరుతను తరిమిన కుక్క..

08:07 PM

గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించిన వనపర్తి కలెక్టర్

07:57 PM

ఈ అవార్డు 'నూర్ మహ్మద్'కు అంకితం : రామ్ చరణ్

07:51 PM

కరీంనగర్‌లో ప్లాస్టిక్ రైస్ కలకలం!

07:41 PM

దళితులు, బలహీన వర్గాలపైనే దాడులు : జీవన్‌రెడ్డి

07:35 PM

రేపు సుప్రీంకోర్టు ముందుకు సజ్జనార్ !

07:27 PM

కూతుర్ని ముక్కలుగా నరికిన కసాయి తండ్రి..!

07:24 PM

సజావుగా పరీక్షల నిర్వహణే మా కర్తవ్యం : ఒమర్‌ జలీల్‌

06:56 PM

బయో డైవర్సిటీ ప్రమాద కేసులో కీలక మలుపు !

06:46 PM

ఏపీ అక్రెడిటేషన్ల కోసం ధరఖాస్తులకు ఆహ్వానం

06:37 PM

ఛార్జీల పెంపు ఉపసంహరించుకోవాలి : సీపీఐ(ఎం)

06:31 PM

రూ. 2000 నోటు రద్దుపై కేంద్రం క్లారిటి

06:20 PM

'మోస్ట్ రీట్వీటెడ్ ట్వీట్' గా కోహ్లీ ట్వీట్‌

06:09 PM

కార్తీ 'దొంగ' మూవీ ట్రైలర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.