Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తమిళ అస్తిత్వంలో మార్పు..! | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Apr 08,2021

తమిళ అస్తిత్వంలో మార్పు..!

తమిళనాడులో పోలింగ్‌ ముగిసింది. ఫలితాలు వెలువడాల్సి ఉంది. తమిళుల అస్తిత్వానికి సుదీర్ఘ చారిత్రిక నేపథ్యం ఉంది. తమిళుల హదయాలను గెలవడానికి దీనిని అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఎన్నో ఏండ్ల నుంచి తమిళనాడులో పట్టు సాధించిన ద్రవిడ పార్టీలు అక్కడి ప్రజల నాడి తమకు బాగా తెలుసని చెబుతాయి. మరోవైపు భారతీయ జనతాపార్టీ స్థానికంగా పై చేయి సాధించడం కోసం సర్వ శక్తులూ ఒడ్డింది. అదే సమయంలో తమిళ ప్రజానీకం మాత్రం ఎన్నికల ప్రక్రియలో తాజా స్ఫూర్తిని నింపగల ప్రత్యామ్నాయం కోసం చూసారు. పోలింగ్‌ ప్రక్రియ సమీపించే కొద్దీ మ్యానిఫెస్టోల మాయాజాలాలు, ఉచితాల గాలాలు, పొత్తుల కసరత్తుల వేగం పుంజుకున్నాయి. దీంతో తమిళనాట రాజకీయ వేడి పతాక స్థాయి చేరడాన్ని అందరూ గమనించారు.
ఎఐడిఎంకెలో చోటు చేసుకుంటున్న పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ ప్రయత్నించింది. అంతర్గతంతగా పళనిస్వామి, పన్నీరుసెల్వమ్‌ మధ్య ఉన్న రాజకీయ వైరుధ్యాలు, బయట నుంచి శశికళ, టిటివి దినకరన్‌ల చర్యలు ఎఐడిఎంకెను బలహీనపరుస్తున్న సంగతి తెలిసిందే. దీనివల్ల తాము బలపడే అవకాశం ఉందని బీజేపీ తొలుత అంచనా వేసింది. అయితే, రోజులు గడిచి, ఎన్నికల తేదీ సమీపించే కొద్దీ ఈ అంచనా తప్పని తెలుసుకుంది. ఎఐడిఎంకె బలహీన పడితే దాని ప్రభావం తమ మీద కూడా ఉంటుందని, తమకు పడే ఓట్లూ తగ్గుతాయని బీజేపీ ఆలస్యంగా గుర్తించింది. 2014 ఎన్నికల్లో 9సీట్లలో పోటీ చేసి 5.48శాతం ఓట్లు సాధించి ఒకే ఒక్క సీటును గెలుచుకున్న ఆ పార్టీ 2019 ఎన్నికల్లో 3.66శాతం ఓట్లు మాత్రమే పొందడం, ఒక్క సీటునూ గెలుచుకోకపోవడాన్ని ఆ పార్టీ నాయకులు కొందరు ప్రస్తావిస్తున్నారు. ఎఐడిఎంకె, డిఎంకెల మధ్య తమిళ ప్రజలు చీలిన విషయం తెలిసిందే. ఈసారి ఈ రెండు ప్రధాన పార్టీల కూటములే కాకుండా ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్‌ నేతృత్వంలోని మక్కల్‌ నీధి మయమ్‌, దినకరన్‌ నేతృత్వంలోని అమ్మ మక్కల్‌ మున్నేట్ర కజగమ్‌లు కూడా బరిలో ఉన్నాయి. విడివిడిగానూ, కూటములు గానూ ఈ పార్టీలు ఊరించే ఎన్నో ఉచిత పథకాలను ప్రకటించాయి. ఏప్రిల్‌ ఆరున పోలింగ్‌ ముగిసింది. ఇక మే 2న తేలనున్న ఫలితాల్లో విజేత ఎవరన్నదే తేలాల్సి ఉంది.
తమిళ భాషకు, సంస్కృతికి సుదీర్ఘ చరిత్ర ఉన్న సంగతి తెలిసిందే. అంతకాకపోయినా, తమిళనాడులో సమానత్వం కోసం, వివక్షలేని సమాజం కోసం జరిగిన పోరాటానికి కూడా చాలా చరిత్రే ఉంది. జస్టిస్‌ పార్టీ, దాని నుంచి ఆవిర్భవించిన పెరియార్‌ ద్రవిడార్‌ కజగమ్‌ (డి.కె), ఆ తరువాత అన్నాదొరైకి చెందిన ద్రవిడ మున్నేట్ర కజగమ్‌ (డిఎంకె) ఈ పోరాటాలను ముందుకు తీసుకుపోవడం ద్వారా తమిళ ప్రజలకు ప్రత్యేక అస్తిత్వాన్ని రూపొందించాయి. ఈ అస్త్తిత్వ పట్టాల పైకి ఎక్కడానికి ఇప్పుడు బీజేపీ శతవిధాల ప్రయత్నిస్తోంది. అయితే, ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే తమిళ అస్తిత్వానికి మసి పూసి మారేడుకాయ చేయాలన్న బీజేపీ తరహా బ్రాహ్మణవాద రాజకీయాలను తమిళ నేల పదేపదే తిప్పికొట్టింది. తమిళనాడు చరిత్రను పరిశీలిస్తే ఆ విషయం స్పష్టమవుతుంది.
వేద సనాతన ధర్మం నుంచి సంస్కృతీకరణ, ఆలయ పూజలను వ్యతిరేకిస్తూ ప్రత్యేక తమిళ గుర్తింపును కాపాడుకోవడం కోసం జరుగుతున్న పోరాటానికి కనీసం 2000సంవత్సరాల చరిత్ర వుంది. భారత ఉపఖండమంతా మౌర్య సామ్రాజ్య విస్తరణ జరిగినప్పుడు తమిళనాడు దాని నుంచి బయటపడింది. మొదటి సహస్రాబ్దిలోని కొన్ని వందల సంవత్సరాలు సంస్కృత భాష, వేదాల ఆచార వ్యవహారాలు తమిళాన్ని పక్కకు నెట్టివేశాయి. ఉత్తర భారత దేవుళ్లయిన విష్ణు, శివుడుకు ప్రాధాన్యత పెరిగింది. పాన్‌ ఇండియా దేవుళ్ల ముందు స్థానిక దేవుళ్లు, దేవతల ప్రాభవం తగ్గిపోయింది. ఆ విగ్రహాలను దేవాలయాల నుంచి బయటకు తెచ్చివేయడం, లేదా తక్కువ స్థాయికి మార్చడమో జరిగింది. అయితే, ఈ పరిస్థితి క్రమేణా మారింది. భక్తి ఉద్యమాలు, నాస్తిక శ్రేణుల ప్రయత్నాలు, బౌద్ధ, జైన తత్వవేత్తల ప్రయత్నాలు ఉత్తర భారతం నుంచి వచ్చిన ఈ మంచు వరదను అడ్డుకునే ప్రయత్నాలు చేశాయి. దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం రాజరాజుని నేతృత్వంలో ఆవిర్భవించిన చోళ సామ్రాజ్యం తమిళ సంస్కృతికి, భాషకు తిరిగి పట్టం కట్టింది. వేద సాంప్రదాయాల స్థానంలో దేవాలయాలలో ఆగమ శాస్త్రాలకు ప్రాధాన్యత పెరిగింది. తమిళ భక్తి శ్లోకాలకు దక్షిణ భారతదేశంలో వేదాల స్థాయి గుర్తింపు వచ్చింది. దీనినుండే స్ఫూర్తి పొందిన జస్టిస్‌ పార్టీ 1930వ దశకంలో తమిళ రాజకీయాల్లో కీలక స్థానానికి చేరింది. అయితే, వేద సంస్కృతి, సాంప్రదాయాలు, సంస్కత భాషను రుద్దడం వంటి అంశాలపై అప్పటి వరకు జరిగిన పోరాటాన్ని జస్టిస్‌ పార్టీ బ్రాహ్మణులకు, బ్రాహ్మణేతరులకు మధ్య జరిగే పోరాటంగా మార్చింది. రాజకీయంగా కొంత పలుకుబడిని, కొన్ని ప్రావిన్షియల్‌ సీట్లను జస్టిస్‌ పార్టీ పొందగలిగినప్పటికీ ఉద్యమాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. బ్రాహ్మణులకు వ్యతిరేకంగా తీసుకున్న విధానం వారిని కాంగ్రెస్‌ పార్టీకి దూరం చేసింది. కాంగ్రెస్‌ పార్టీలో బ్రాహ్మణాధిక్యత కొనసాగుతుండటమే దీనికి కారణం. ఈ కారణంగా వారు బ్రిటిష్‌ పాలనను తీవ్రంగా వ్యతిరేకించలేని స్థితికి చేరుకున్నారు. సైమన్‌ కమిషన్‌ రాక సందర్భంగా దేశ వ్యాప్తంగా జరిగిన ఆందోళనకు వీరు దూరంగా ఉన్నారు. అదే సమయంలో రైతుల భూ యాజమాన్య హక్కులను అంగీకరించని నాయకత్వ వైఖరి కారణంగా జస్టిస్‌ పార్టీ ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయింది. దాదాపుగా ఇదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీలో ఎన్నో అవమానాలకు, వివక్షకు గురై బయటకు వచ్చిన పెరియార్‌ తమిళనాడులో స్వాభిమాన ఉద్యమాన్ని ప్రారంభించారు. జస్టిస్‌ పార్టీ పేరును ద్రవిడార్‌ కజగంగా మార్చారు. అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం, కుల నిర్మూలన వంటి తక్షణాంశాలతో పాటు దీర్ఘకాలంలో ద్రవిడనాడు (ద్రవిడ దేశం)ను ఏర్పాటు చేయడం తమ లక్ష్యమని ఆయన ప్రకటించారు. ఆ తరువాత డిఎంకె ఆవిర్భావం. ఎఐడిఎంకె ఏర్పాటు వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. 1967 నుంచి ఆ రెండు పార్టీలే తమిళనాట తిరుగులేని శక్తులుగా కొనసాగుతున్నాయి.
తమిళ చరిత్రలోని ఈ ప్రత్యేకతను ఏమాత్రం గుర్తించలేని బీజేపీ తెలుపు ధోవతి కట్టుకుని భుజాల చుట్టూ తుండు చుట్టుకుంటే తమిళుల హృదయాలను గెలవవచ్చని భావిస్తోంది. అదే సమయంలో మారిన పరిస్థితులలో తమిళ హృదయాన్ని అర్థం చేసుకోవడానికి డిఎంకె కష్టపడుతోంది. తమిళ రాజకీయాల్లో ఎప్పుడూ కీలక పాత్ర పోషించే సామాజిక అంశాలతో పాటు ఈసారి ఎన్నికల్లో నిరుద్యోగం, పేదలు, ధనికుల మధ్య అంతరాలు పెరగడం వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతున్నాయి. అదే సమయంలో బ్రాహ్యణ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడిన అణగారిన వర్గాలకు చెందిన కొందరు ప్రస్తుతం ఉన్నత కులాల మాయాజాలంలో పడ్డారన్నది కూడా ద్రవిడ పార్టీలు తిరస్కరించలేని వాస్తవం. ఒకప్పుడు తమిళ నేలను ఏకం చేసిన లౌకక భావనలు, భాష, సంస్కృతులపై అభిమానం కలగలిసిన తమిళ ఆత్మగౌరవ భావన గడిచిన దశాబ్ద కాలంలో క్షీణించిందన్నది వాస్తవం. గ్రూపుల తగాదాలలో పీకల్లోతు కూరుకుపోయిన ఎఐడిఎంకె తన మనుగడ కోసం బీజేపీపై ఆధారపడాల్సిన స్థితికి చేరుకుంది. ఈ పరిస్థితుల్లో తమిళ అస్తిత్వాన్ని ఆ పార్టీ కాపాడటం ప్రశ్నార్ధకమే.
ఓబీసీ రిజర్వేషన్లలో 3 శాతాన్ని ముస్లిములకు కేటాయిస్తామన్న డిఎంకె హామీ దేశ వ్యాప్తంగా నెలకొన్న మత రాజకీయాల నేపథ్యంలో తమిళనాడులో ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందన్నది వేచిచూడాల్సి ఉంది. ఇది గాకుండా 75శాతం ఉద్యోగాలను స్థానికులకు ఇస్తామని, హిందువులు చేసే తీర్థ, పుణ్య యాత్రల కోసం 25 వేల నుంచి లక్ష రూపాయలు ఇస్తామని, హిందూ దేవాలయాల పునరుద్ధరణ కోసం రూ.1,000 కోట్లను, చర్చిలు, మసీదుల పునరుద్ధరణ కోసం రూ.250 కోట్లను కేటాయిస్తామని ఆ పార్టీ ప్రకటించింది. తమిళ అస్తిత్వానికి భూమికలైన అనేక అంశాలు తాజా ఎన్నికల్లో చర్చనీయాంశం కాలేదు. ద్రవిడ పార్టీలు కూడా వాటిని ఎన్నికల ఎజెండాగా మార్చడానికి సిద్ధపడటం లేదు. ఈ నేపథ్యంలో తమిళ ప్రజలు ఎలా స్పందించారన్నది ఆసక్తిదాయకంగా మారింది.
- రాఘవన్‌ శ్రీనివాసన్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అమాయకులను బలిగొన్న 'ఉపా' చట్టం
ఘజియాబాద్‌ సమీపాన.. దాస్నా గ్రామంలో...
భగభగలు...
ఇతరులకు చెప్పేందుకే...
కుసంస్కారమే.!
బీజేపీ, మోడీల పరిధిని మించిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండా
మోటారు వాహనాల స్క్రాప్‌ పాలసీ ఆంతర్యం ఏమిటీ?
ఉద్యోగుల్లో విభజనరేఖలు సమంజసమా?
విశ్వాసం ఉన్నచోట విశ్లేషణ ఉండదు
నిరంకుశ పాలనకు మచ్చుతునక బీహార్‌ పోలీస్‌ చట్టం
ప్రణాళికా రహిత ఇండ్ల లేఅవుట్లు
మోడీ ప్రధాని అయిన వేళా విశేషం
అమెరికా నౌక - అక్రమ చొరబాటు
కోవిడ్‌ విజృంభిస్తోంది.. ప్రభుత్వం ఏంచేస్తోంది..?
వి'ప్లవ' నామ సంవత్సరం
రాజ్యాంగ రక్షణే అంబేద్కర్‌కు నివాళి
ఆయన అమరత్వం చిరకాలం...
ప్రధాని పాఠాల ప్రయోజనమేమిటి?
పాలక వర్గాలు - పేదలపట్ల శ్రద్ధ
లాల్‌ సలామ్‌!
ఐదు మూసుడు పది అమ్ముడు
చిరకాల స్పూర్తి....... మన బొజ్జి !!
పంచతంత్రంలో పారని మోడీమంత్రం!
క్రాంత దర్శి
తారా లోకం!
పాఠశాల విద్యలో వినూత్న పథకం ఎలా ఉండాలి..?
న్యాయవ్యవస్థే చట్టాన్ని ధిక్కరిస్తే...?
భాయీ భాయీ..
మన పురాణ పాత్రల మూలాలు ఈజిప్టులో ఉన్నాయా?
ఆన్‌లైన్‌ విద్యతో విద్యార్థులకు ఒరిగేదెంత?

తాజా వార్తలు

08:28 PM

మళ్లి భయపెడుతున్న డెంగ్యూ

08:08 PM

18 ఏండ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్

07:41 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు

07:28 PM

సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్

07:19 PM

పుర ఎన్నికలు నిలిపివేయలేం: తెలంగాణ హైకోర్టు

07:06 PM

కొత్త పింఛన్లు ఇవ్వాలని వినతి..

07:02 PM

ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభం...

06:59 PM

పీవైఎల్ జిల్లా అధ్యక్షకార్యదర్శులుగా చింత నరసింహారావు, పర్శిక రవి.

06:52 PM

అరుణ గ్రహంపై తొలిసారి ఎగిరిన హెలికాప్టర్‌

06:48 PM

మాజీ ప్రధానికి కరోనా పాజిటివ్​

06:15 PM

నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ కు కరోనా పాజిటివ్

05:54 PM

లాక్ డౌన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు..

05:49 PM

లాక్ డౌన్ పెట్టే ఆలోచన లేదు : మంత్రి ఈటల రాజేందర్

05:29 PM

రూ.3వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత

05:15 PM

గంటల వ్యవధిలో తల్లీ, కొడుకు మృతి.. విషాదం నింపిన కరోనా

04:56 PM

రెండు టీకా కంపెనీలకు రూ.4,500కోట్లు ప్రకటించిన కేంద్రం

04:47 PM

వీకెండ్స్ మాత్రమే తెరుచుకొనున్న వండర్‌లా

04:35 PM

ఏపీలో స్కూళ్లకు సెలవులు..

04:25 PM

ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో తీవ్ర ఉద్రిక్తత

04:04 PM

చెరువులో పడి ఇద్దరు మృతి

03:53 PM

ప్రముఖ డాక్టర్లతో ప్రధాని మోడీ సమావేశం

03:35 PM

ఆశ్రయం ఇచ్చి.. అదును చూసి.. అక్కాచెల్లెళ్లపై దారుణం

03:23 PM

సోనూసూద్ ఆదర్శంగా ఆటో డ్రైవర్ సేవలు..

03:14 PM

ఇప్పటికిప్పుడు లాక్ డౌన్ అవసరం లేదన్న సీఎం

02:58 PM

భారీ ఆఫర్లు ప్రకటించిన హ్యూండాయ్

02:47 PM

ఇంజక్షన్లు పనిచేయవు.. ఆల్కాహాల్ సర్వరోగ నివారణి అంటున్న మహిళ

02:31 PM

అందరూ చూస్తుండగానే రూ.9లక్షలు ఎత్తుకెళ్లిండు

02:21 PM

ఓపెనింగ్ రోజే బిర్యానీ షాపుకు సీల్..

02:01 PM

నల్గొండలో ధాన్యాన్ని కొనాలంటూ రైతుల ఆందోళన..

01:46 PM

నాగర్ కర్నూల్ లో చైన్ స్నాచింగ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.