Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మోడీ గారడీ! | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Mar 04,2021

మోడీ గారడీ!

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీ కరిస్తామని బడ్జెట్‌లో చేసిన విధాన ప్రకటనకు కార్పొరేట్‌ మీడియా, మితవాద ఆర్థికవేత్తల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. 'మోడీ మారిపోయారు', 'అసాధారణ సాహసం', 'ఎట్టకేలకు వాస్తవిక సంస్కరణలు' వంటి వ్యాఖ్యలు ఈ వర్గాల నుంచి వచ్చాయి. బడా వ్యాపారవేత్తల్లో, ఆర్థిక రంగ స్పెక్యులేటర్లలో ఇంత ఆనందం వ్యక్తం కావడానికి కారణం ఏమిటి? బడ్జెట్‌లో ప్రకటించినదాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలోని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణా విభాగం ఆచరణలో పెడుతోంది. 'ఆత్మనిర్భర్‌ భారత్‌ కోసం నూతన ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌ఈ) విధానం' అనే శీర్షికతో ఒక మెమోరాండాన్ని సిద్ధం చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలను వ్యూహాత్మక, వ్యూహాత్మక యేతర రంగాలుగా వర్గీకరించింది.
నాలుగు వ్యూహాత్మక రంగాలలో 1.అణు విద్యుత్‌, రోదసీ, రక్షణ, 2.రవాణ, టెలికమ్యూనికేషన్లు, 3.విద్యుత్‌, పెట్రోలియం, బొగ్గు, 4.బ్యాంకింగ్‌, బీమా, ఆర్థిక సేవలు ఉన్నాయి. ఈ నాలుగు రంగాల్లో, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల కనీస ఉనికి ఉంటుంది. మిగిలిన సంస్థలన్నీ ప్రయివేటీ కరించడమో లేదా విలీనం చేయడమో లేదా మూతపడడమో జరుగుతుంది. ఇక వ్యూహాత్మక యేతర రంగానికి వస్తే, అన్ని పీఎస్‌ఈలను ప్రయివేటీకరించడానికే పరిగణించాలన్నది విధానంగా ఉంది. లేదా మూసివేయాలి. సుదూర కాలంలో తీవ్ర పర్యవసానాలు కలిగిన ఈ ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ ప్రణాళికలో దేశ, విదేశీ బడా పెట్టుబడులు ఇమిడి ఉన్నాయి. పి.వి.నరసింహారావు ప్రభుత్వ కాలం నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ముసుగులో ప్రయివేటీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో పీఎస్‌ఈల్లో ప్రయివేటీకరణగా పిలిచే వ్యూహాత్మక వాటాల విక్రయం ప్రారంభమైంది. ఇక ఇప్పుడు రెండో విడత మోడీ ప్రభుత్వ హయాంలో ఈ నూతన విధానం ప్రభుత్వ రంగాన్ని సమూలంగా ధ్వంసం చేయనుంది. ఎందుకంటే, ఆ నాలుగు వ్యూహాత్మక రంగాల్లో కూడా మెజారిటీ పీఎస్‌ఈలను (వాటిలో చాలా వరకు లాభదా యకమైనవే) విక్రయించనున్నారు. ప్రజా ధనంతో నిర్మించిన విలువైన ప్రజా ఆస్తులవి.
వ్యూహాత్మక రంగాలుగా పిలిచే వీటిల్లో చాలా పీఎస్‌ఈలను ప్రయివేటీకరించాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం వాటిని నష్టాల బాటలో నడిచేలా చేస్తోంది. ఓఎన్‌జీసీ, బీహెచ్‌ఈఎల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ వంటి సంస్థలన్నీ ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరికి బాధితులే. ఆర్థిక సంక్షోభం ముదురుతుండటంతో నయా ఉదారవాద ప్రభుత్వాలకు ప్రయివేటీకరణ లాభాలపై ఆధారపడడం పెరుగుతోంది. రెవెన్యూ ఆదాయాలు తీవ్రంగా క్షీణించాయని ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో వెల్లడైంది. దీన్ని లాభాలార్జించే ప్రభుత్వరంగ సంస్థలను విక్రయించడం ద్వారా పరిష్కరించుకోవాలని చూస్తున్నారు.
ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ నుంచిడి రూ.1.75లక్షల కోట్లను బడ్జెట్‌లో అందించారు. పెట్టుబడుల ఉపసంహరణ నుంచి వచ్చే మొత్తాలు రూ.2.10 లక్షల కోట్లుగా ఉంటాయని 2020-21 బడ్జెట్‌ అంచనా వేసింది. ఈ నిర్దేశిత మొత్తానికి భారీస్థాయిలో నిధులు కొరవడడంతో, ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోని ఈ ప్రభుత్వం మరింత దూకుడుగా ప్రయివేటీకరణకు వెళుతోంది. అసలే ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్న వేళ, ఆస్తుల ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ఆస్తులన్నింటినీ గణనీయమైన రాయితీతో విక్రయించనున్నారు. ఫలితంగా దేశ, విదేశీ పెట్టుబడిదారులకు గొప్ప వరమే ఇది.
ఆర్థిక రంగాన్ని ప్రయివేటీకరించే ఉద్దేశ్యం బహిరంగంగానే ఉంది. బడ్జెట్‌లో మొట్టమొదటిసారిగా, రెండు ప్రభుత్వరంగ బ్యాంకులను, ఒక సాధారణ బీమా కంపెనీని ప్రయివేటీ కరిస్తామని ప్రకటించారు. ఎల్‌ఐసీలో కూడా వాటాలను విక్రయించనున్నారు. ప్రయివేటీకరించడానికి ఎంపిక చేసిన రెండు బ్యాంకులు కూడా లాభాలార్జిస్తున్నవేనని చెప్పనక్కర్లేదనుకుంటా. బ్యాంకింగ్‌ రంగంలోకి కార్పొరేట్‌ రంగం ప్రవేశించడానికి ఇదొక సూచిక. ఆర్థిక రంగాన్ని ఒకసారి ప్రయివేటీకరించిన తర్వాత ఇక ఆర్థిక వ్యవస్థ మొత్తంగా పెట్టుబడుల వ్యత్యాసాలకు నెలవుగా మారుతుంది. అంతర్జాతీయ ఫైనాన్స్‌ క్యాపిటల్‌ ఆత్మనిర్భరత కోసం నిబంధనలను నిర్దేశించగలదు. లాభాలార్జించే పీఎస్‌ఈల స్థూల లాభాలు రూ.1.6 లక్షల కోట్లు కాగా, ప్రభుత్వానికి వాటి వల్ల వచ్చే డివిడెండ్లు రూ.77 వేల కోట్లు. ఈ ఆస్తులను విక్రయించడం ప్రభుత్వ ప్రస్తుత, భవిష్యత్‌ రెవెన్యూగా ఉంటుంది.
ఇదంతా కూడా ఆత్మనిర్భర్‌ భారత్‌ పేరుతోనే జరుగుతుండడం దారుణమైన బూటకం. దేశంలోనే రెండవ అతి పెద్ద చమురు కంపెనీ అయిన బీపీసీఎల్‌ విక్రయానికి వస్తే, ఈ సంస్థ పరిమాణాన్ని బట్టి చూసినట్లైతే విదేశీ చమురు కంపెనీకి విక్రయించే అవకాశం ఉంటుంది. దీనివల్ల కీలకమైన ఇంధన సరఫరాల నియంత్రణలకు సంబంధించి దేశ సార్వభౌమాధికారం బలహీనపడుతుంది. రక్షణ రంగంలో ఈ ప్రయివేటీకరణ ఉత్సాహం, ఎంపిక చేసిన భారతీయ ఆయుధ సంస్థలు విదేశీ ఆయుధ ఉత్పత్తిదారులతో జత కట్టడానికి దారి తీస్తుంది. అమెరికాతో పెరుగుతున్న సైనిక పొత్తును దృష్టిలో పెట్టుకుంటే రక్షణ ఉత్పత్తిలో కీలక రంగాలను అమెరికా బహుళ జాతి ఆయుధ కంపెనీలు స్వాధీనం చేసుకునే ముప్పు పొంచి ఉంది. ఇది దేశ భద్రత, సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశం. ఖనిజాలు, సహజసిద్ధమైన వనరులు వంటి రంగాల్లో ప్రయివేటీకరణ...39(బి) లోని రాజ్యాంగ ఆదేశిక సూత్రానికి విరుద్ధంగా ఉంది. పాదార్ధిక వనరులపై యాజమాన్య హక్కులు, నియంత్రణ కలిగి ఉండడం ప్రజలకు మంచి చేయడానికి ఉపకరిస్తుందని రాజ్యాంగం పేర్కొంటోంది. మంచి జరగడం పోయి, ఈ ప్రయివేటీకరణ వల్ల సహజసిద్ధమైన వనరు లను ప్రయివేటు కంపెనీలు దోపిడీ చేయడానికి వీలు కల్పిస్తోంది. ఆర్థిక సంస్థలతో పాటుగా ఈ ప్రయివేటీకరణ క్రమం విద్య, ఆరోగ్య సంరక్షణ, రవాణా, విద్యుత్‌ సరఫరా వంటి ఇతర రంగాలకూ పాకుతోంది. ఇది, విద్య, ఆరోగ్యం, ఇతర మౌలిక సేవలకు సంబంధించి ప్రజలకు గల హక్కుపై ప్రత్యక్షంగా దాడి చేయడమే కాగలదు. విస్తృతంగా ప్రజలను సమీకరించడం ద్వారా ఈ ప్రయివేటీకరణ క్రమంపై పోరాడాల్సి ఉంది. ఇప్పటికే వందశాతం వ్యూహాత్మక విక్రయం ద్వారా విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని విక్రయిస్తామన్న ప్రకటనకు పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ప్రజా సమీకరణ జరుగుతోంది. కార్మికవర్గం తీవ్రంగా ప్రతిఘటిస్తుండడంతో ఇదొక ప్రజా సమస్యగా మారింది.
ప్రతిపాదిత రెండు బ్యాంకుల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 15, 16 తేదీల్లో రెండు రోజుల సమ్మెకు యునైటెడ్‌ బ్యాంక్‌ యూనియన్ల ఫోరం పిలునిచ్చింది. బీమా కార్మికులు కూడా దీర్ఘకాల పోరాటానికి సన్నద్ధమవుతున్నారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, కార్మికులతో కలిసి సమగ్ర, సమన్వయ ప్రతిఘటనను నిర్మించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ రంగంపై సాగే ఈ యుద్ధానికి వ్యతిరేకంగా విస్తృత రీతిలో ప్రజలను సమీకరించేందుకు కార్మిక సంఘాలు, వామపక్ష శక్తులు కృషి చేయాలి.

- 'పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అమాయకులను బలిగొన్న 'ఉపా' చట్టం
ఘజియాబాద్‌ సమీపాన.. దాస్నా గ్రామంలో...
భగభగలు...
ఇతరులకు చెప్పేందుకే...
కుసంస్కారమే.!
బీజేపీ, మోడీల పరిధిని మించిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండా
మోటారు వాహనాల స్క్రాప్‌ పాలసీ ఆంతర్యం ఏమిటీ?
ఉద్యోగుల్లో విభజనరేఖలు సమంజసమా?
విశ్వాసం ఉన్నచోట విశ్లేషణ ఉండదు
నిరంకుశ పాలనకు మచ్చుతునక బీహార్‌ పోలీస్‌ చట్టం
ప్రణాళికా రహిత ఇండ్ల లేఅవుట్లు
మోడీ ప్రధాని అయిన వేళా విశేషం
అమెరికా నౌక - అక్రమ చొరబాటు
కోవిడ్‌ విజృంభిస్తోంది.. ప్రభుత్వం ఏంచేస్తోంది..?
వి'ప్లవ' నామ సంవత్సరం
రాజ్యాంగ రక్షణే అంబేద్కర్‌కు నివాళి
ఆయన అమరత్వం చిరకాలం...
ప్రధాని పాఠాల ప్రయోజనమేమిటి?
పాలక వర్గాలు - పేదలపట్ల శ్రద్ధ
లాల్‌ సలామ్‌!
ఐదు మూసుడు పది అమ్ముడు
చిరకాల స్పూర్తి....... మన బొజ్జి !!
పంచతంత్రంలో పారని మోడీమంత్రం!
క్రాంత దర్శి
తారా లోకం!
పాఠశాల విద్యలో వినూత్న పథకం ఎలా ఉండాలి..?
న్యాయవ్యవస్థే చట్టాన్ని ధిక్కరిస్తే...?
భాయీ భాయీ..
మన పురాణ పాత్రల మూలాలు ఈజిప్టులో ఉన్నాయా?
ఆన్‌లైన్‌ విద్యతో విద్యార్థులకు ఒరిగేదెంత?

తాజా వార్తలు

08:28 PM

మళ్లి భయపెడుతున్న డెంగ్యూ

08:08 PM

18 ఏండ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్

07:41 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు

07:28 PM

సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్

07:19 PM

పుర ఎన్నికలు నిలిపివేయలేం: తెలంగాణ హైకోర్టు

07:06 PM

కొత్త పింఛన్లు ఇవ్వాలని వినతి..

07:02 PM

ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభం...

06:59 PM

పీవైఎల్ జిల్లా అధ్యక్షకార్యదర్శులుగా చింత నరసింహారావు, పర్శిక రవి.

06:52 PM

అరుణ గ్రహంపై తొలిసారి ఎగిరిన హెలికాప్టర్‌

06:48 PM

మాజీ ప్రధానికి కరోనా పాజిటివ్​

06:15 PM

నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ కు కరోనా పాజిటివ్

05:54 PM

లాక్ డౌన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు..

05:49 PM

లాక్ డౌన్ పెట్టే ఆలోచన లేదు : మంత్రి ఈటల రాజేందర్

05:29 PM

రూ.3వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత

05:15 PM

గంటల వ్యవధిలో తల్లీ, కొడుకు మృతి.. విషాదం నింపిన కరోనా

04:56 PM

రెండు టీకా కంపెనీలకు రూ.4,500కోట్లు ప్రకటించిన కేంద్రం

04:47 PM

వీకెండ్స్ మాత్రమే తెరుచుకొనున్న వండర్‌లా

04:35 PM

ఏపీలో స్కూళ్లకు సెలవులు..

04:25 PM

ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో తీవ్ర ఉద్రిక్తత

04:04 PM

చెరువులో పడి ఇద్దరు మృతి

03:53 PM

ప్రముఖ డాక్టర్లతో ప్రధాని మోడీ సమావేశం

03:35 PM

ఆశ్రయం ఇచ్చి.. అదును చూసి.. అక్కాచెల్లెళ్లపై దారుణం

03:23 PM

సోనూసూద్ ఆదర్శంగా ఆటో డ్రైవర్ సేవలు..

03:14 PM

ఇప్పటికిప్పుడు లాక్ డౌన్ అవసరం లేదన్న సీఎం

02:58 PM

భారీ ఆఫర్లు ప్రకటించిన హ్యూండాయ్

02:47 PM

ఇంజక్షన్లు పనిచేయవు.. ఆల్కాహాల్ సర్వరోగ నివారణి అంటున్న మహిళ

02:31 PM

అందరూ చూస్తుండగానే రూ.9లక్షలు ఎత్తుకెళ్లిండు

02:21 PM

ఓపెనింగ్ రోజే బిర్యానీ షాపుకు సీల్..

02:01 PM

నల్గొండలో ధాన్యాన్ని కొనాలంటూ రైతుల ఆందోళన..

01:46 PM

నాగర్ కర్నూల్ లో చైన్ స్నాచింగ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.