Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
భారతీయ వైజ్ఞానిక రంగంలో మహిళలు | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Nov 27,2020

భారతీయ వైజ్ఞానిక రంగంలో మహిళలు

ఫిబ్రవరి 28న భారతదేశ ప్రజలందరూ తప్పక గుర్తుంచుకోవాల్సిన రోజు. 1930లో భారతీయ శాస్త్రవేత్త సి.వి.రామన్‌, నోబెల్‌ బహుమతిని సాధించింది ఈరోజునే. ఆ సందర్భాన్ని స్మరించుకోవడానికి మనం ప్రతి సంవత్సరం దేశంలో ఫిబ్రవరి 28న జాతీయ వైజ్ఞానిక దినోత్సవం (నేషనల్‌ సైన్స్‌డే)గా జరుపుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేక అంశాన్ని (థీమ్‌ని) ఎంచుకుంటున్నాం. ఈ 2020 సంవత్సరానికి ''వైజ్ఞానిక రంగంలో మహిళలు (వుమెన్‌ ఇన్‌ సైన్స్‌)'' అనేది ముఖ్యాంశంగా ఎన్నుకున్నాం.
కొంతమంది జీవితాలు తెరచిన పుస్తకాలు. ఆ పుస్తకాలు ఎన్నిసార్లు చదివినా కొన్ని కొత్త విషయాలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంటాయి. పుస్తకం తెరచి ఉన్నా, చూడాల్సిన కోణంలోంచి చూసి, అవగాహన చేసుకోవాల్సిన అంశాలు అవగాహన చేసుకోవడం కొందరికే చేతనవుతుంది. భారతదేశానికే కాదు, అసలు ఆసియా ఖండానికే మొట్టమొదటిసారి వైజ్ఞానిక రంగంలో నోబెల్‌ బహుమతి సాధించి పెట్టిన మహామేధావి సర్‌ సి.వి. (చంద్రశేఖర్‌ వెంకట) రామన్‌ జీవితమూ అలాంటిదే! భౌతిక శాస్త్రంలో నోబెల్‌ గ్రహీతగా చాలా మందికి తెలుసు. కానీ, ఒక మహౌన్నతమైన వ్యక్తిగా, జాతీయవాదిగా, దేశభక్తుడిగా చాలా కొద్ది మందికే తెలుసు. నేటి యువతీ యువకులు, రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు స్వలాభం కోసం దేశాన్ని అమ్మడానికైనా సిద్ధపడే కుట్రదారులు, పైరవీ కారులు ఆయన జీవితంలోంచి ఎన్నో విషయాలు తెలుసుకుని ఆచరించాల్సి ఉంది.
వైజ్ఞానిక పరిశోధనారంగంలో రాజకీయాల జోక్యం ఏమాత్రం సహించని సి.వి.రామన్‌ బెంగుళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ - డైరెక్టర్‌ పదవి తనకు తానై వదులుకున్నారు. హాలెండ్‌లోని ఒక ప్రముఖ పరిశోధనా సంస్థకు డైరెక్టర్‌గా రమ్మని ఆహ్వానం వస్తే, మర్యాదగా తిరస్కరించారు. ఎందుకంటే జీవితాంతం తన సేవలు మాతృభూమికే అర్పించాలని దృఢంగా నిర్ణయించుకున్నారు గనక. అలాంటి అతి సున్నితమైన మరో కారణం వల్లనే లండన్‌ రాయల్‌ సొసైటీ ఫెలోషిప్‌కు రాజీనామా చేశారు. వీటన్నిటికంటే ఎంతో ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. భారత ఉప రాష్ట్రపతి పదవికి ఆహ్వానం వస్తే, ఆయన ఏమాత్రం ఆసక్తి కనబరచలేదు. బాధ్యతాయుతమైన ఒక శాస్త్రవేత్తగానే ఆయన ఉండదలిచారు. రాజకీయాలు - పరిపాలనా వ్యవహారాల మధ్య - తనలోని శాస్త్రవేత్తను ఆయన అణగదొక్కదలుచుకోలేదు. సైన్సు పట్ల, దేశం పట్ల ఆయనకు ఉన్న అపారమైన ప్రేమను బేరీజు వేయడం కష్టం! ఏ కొద్దిపాటి ఆసరా దొరికినా, విదేశాలకు పరుగులు తీసేవారూ, ఏ చిన్నపాటి ఉన్నత పదవి లభించేట్లు ఉన్నా - నైతికంగా పతనమై పదవులకోసం పాకులాడే వాళ్ళూ ఉన్న నేటి సమాజంలో సర్‌ సి.వి.రామన్‌ నెలకొల్పిన జీవిత విలువలు, ఉన్నత ఆదర్శాలు అర్థం చేసుకోగలిగేవారు ఎంత మంది?
సి.వి.రామన్‌ 1927లో 'రామన్‌ ఎఫెక్ట్‌'ను ప్రపంచానికి ప్రకటించాడు. మూడేండ్లు రామన్‌ ఎఫెక్ట్‌ పై ప్రపంచవ్యాప్తంగా పరిశీలనలు, చర్చలూ జరిగాయి. 1930లో నోబెల్‌ బహుమతులు ప్రకటించడానికి ముందే ఆయన స్టాక్‌హౌమ్‌ వెళ్ళి రావడానికి టికెట్స్‌ బుక్‌ చేసుకున్నాడు. బహుమతి ప్రకటించకముందే వెళ్ళి రావడానికి ఏర్పాట్లు చేసుకోవడం పిచ్చి పనిగానే తోస్తుంది. కానీ, ఆయన ఆత్మవిశ్వాసం అంత బలమైంది. తెల్లవాళ్ళ ప్రాబల్యం ఎక్కువగా ఉన్నచోట, ఒక భారతీయుడికి అందునా దక్షిణ భారతీయుడికి అంటే ఒక నల్లవాడికి నోబెల్‌ పురస్కారం వంటి ఒక అపూర్వ గౌరవం లభించడం జరిగేపని కాదని అందరూ అనుకుంటున్న సమయంలో.. ఆయన తన ఆత్మవిశ్వాసాన్ని అంత బలంగా నమ్ముకుని ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం.
రామన్‌ విషయాలు అలా ఉంచి, ఈ సంవత్సరానికి ఎంచుకున్న ''వుమెన్‌ ఇన్‌ సైన్స్‌'' అనే అంశంపై దృష్టి సారిద్దాం. అన్ని రంగాలలో స్త్రీలు ముందడుగు వేస్తున్నారు. సమాజ స్వరూపాన్ని కొద్దికొద్దిగా మార్చేస్తున్నారు. అయితే ఇప్పటికీ శాస్త్ర సాంకేతిక రంగాలలో వారి పాత్ర అంతంత మాత్రంగానే ఉంది. మన దైనందిన జీవితానికీ, శాస్త్రసాంకేతిక రంగాలకూ విడదీయరాని బంధం ఏర్పడి ఉంది. అందువల్ల సమాజ పురోగతికీ, దేశాభ్యున్నతికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపయోగపడే ఈ రంగాలలో సహజంగా మహిళలు ఇంకా ఎక్కువగా పాల్గొనాల్సి ఉంది. అన్నిటికీ అధిగమించి, ఏండ్ల కేండ్లు వైజ్ఞానిక పరిశోధనా రంగంలో నిలదొక్కుకుని ఉండగలగడం స్త్రీలకు కష్టసాధ్యమే తప్ప, సామాన్యంగా, సహజంగా జరిగే పనికాదు. సైన్స్‌లో పట్టభద్రులయిన మహిళలు జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులవుతున్నారు తప్పితే, శాస్త్రవేత్తలు కావడం లేదు.
గతంలో తల్లిదండ్రులు తమ కూతుళ్ళకు భాష, సాహిత్యం, లలిత కళలు, సామాజిక శాస్త్రం, చరిత్ర వంటి విషయాలలో మాత్రమే చదువు చెప్పిస్తూ వచ్చారు. సైన్సు, టెక్నాలజీలు ఆడపిల్లలకు ఎందుకులే అనే భావం ఉండేది. క్రమంగా మార్పు వచ్చింది. మెడిసిన్‌, ఇంజనీరింగ్‌, కంప్యూటర్స్‌లలో అమ్మాయిల్ని చేర్పించసాగారు. ఫలితంగా ఈ రోజుల్లో అమ్మాయిలు అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతున్నారు. వైజ్ఞానిక, పరిశోధనా శాలల్లో కర్మాగారాలలో స్త్రీలు పనిచేయడం లేదని కాదు. వర్కర్లుగా, రిసెప్షనిస్టులుగా, టెలిఫోన్‌ ఆపరేటర్‌లుగా, క్లర్కులుగా, టైపిస్టులుగా ఎంతోమంది పనిచేస్తున్నారు. నిజమే కానీ, శాస్త్రవేత్తలుగా, సాంకేతిక నిపుణులుగా చాలా కొద్ది మంది మాత్రమే ఎదగగలుగుతున్నారు. బాధ్యతాయుతమైన డైరెక్టర్‌, సెంటర్‌ ఇన్‌ఛార్జి వంటి ఉన్నత పదవులలో కొద్ది మంది మహిళలు మాత్రమే ఉంటున్నారు. అదీగాక, స్వాతంత్య్రానంతరం భారతీయ వైజ్ఞానిక పరిశోధనలు పరిశీలిస్తే అందులో మహిళా శాస్త్రవేత్తల కృషి పెద్దగా చెప్పుకోదగ్గది ఏమీలేదు. ఒక జగదీశ్‌ చంద్ర బోస్‌, ఒక సి.వి.రామన్‌ వంటి మహిళా శాస్త్రవేత్తలింకా తయారుకాలేదు. శ్రీనివాస రామానుజన్‌, మహేంద్రలాల్‌ సర్కార్‌, బోస్‌, సాహా, భట్నాగర్‌, సలీం అలీ, హామీజె.బాబూ, రాజా రామన్న వంటి శాస్త్రవేత్తల స్థాయికి ఎదిగిన మహిళా శాస్త్రవేత్తలు కూడామనకు లేరు. అయితే తప్పు వారిది కాదు, పురుషాధిక్య ప్రపంచానిది. అగ్రవర్ణాల వారు శూద్రుల్ని విద్యకు దూరం చేసిన విధంగానే, పురుష ప్రపంచం చాలా కాలం స్త్రీలను విద్యకు దూరం చేసింది.
పూర్వకాలంలో కూడా నృత్యాంగనలు, గాయనీ మణులు, కవయిత్రులు ఉండేవారు తప్పిస్తే, ఆర్యభట్టు, వరాహమిహిరుడు వంటి వారి స్థాయి గల మహిళా శాస్త్రవేత్తలు ఎవరూ లేరు. ఆనాటి పురుష ప్రపంచం తమ ఆనంద విలాసాల కోసం స్త్రీలను ఆమేరకే ప్రోత్సహించింది. అనుమతించింది. పరిపాలన, రక్షణ, ఆర్థికరంగాలలో వారిని భాగస్వాములుగా చేయలేదు. అందుకే రాజుల ఆస్థానాలలో స్త్రీలు మంత్రులుగా, సలహాదారులుగా, కోశాధికారులుగా, సైన్యాధిపతులుగా లేరు. ఇటీవల కాలం వరకూ పరిస్థితి అలాగే కొనసాగింది. అచిర కాలంలో స్త్రీలు పేరు, డబ్బు సంపాదించుకోవాలంటే వారు సినిమా, టీవీ కళాకారులుగానో, యాంకర్లుగానో, మోడల్స్‌గానో, లేక అందాల పోటీల్లో పోటీదారులవుతున్నారు తప్పితే, మహౌన్నత వ్యక్తులుగా, మేధావులుగా, శాస్త్రజ్ఞులుగా, ఇంజనీర్లుగా నిలబడుతున్నవారు చాలా కొద్దిమంది మాత్రమే. అందుకు వ్యవస్థలోని లోపాలు, వివక్ష వంటివి ముఖ్య కారణాలు.
ఘనవిజయాలు సాధించిన పురుషుల జీవితాలలో స్త్రీలు ఉన్నట్టుగానే, స్త్రీల జీవితాలలో కూడా పురుషులు ఉంటారు. ఉండాలి కూడా! ఉదాహరణకు మనం కొందరిని గుర్తుచేసుకోవచ్చు. వైద్య శాస్త్రంలో తొలి అమెరికన్‌ డిగ్రీ సాధించిన ఆనందీబాయి జోషి భర్త గోపాలరావు జోషి ఒక మామూలు గుమస్తా. పద్నాలుగేండ్లకే తల్లయి కొడుకును పోగొట్టుకున్న ఆమె ఎలాగయినా తను వైద్య శాస్త్రం చదవాలనుకుంది. భర్త సహకరించి తోడ్పడి అమెరికా పంపించాడు. 1886లో ఎం.డి.పట్టా స్వీకరించిన ఆనందీబాయి తిరిగి వచ్చి స్వదేశానికి ఉపయోగపడలేక పోయింది. డిగ్రీ తీసుకున్న సంవత్సరానికే క్షయ వల్ల మరణించింది. అయితే ఆమె చూపిన చొరవ ఎంతోమంది భారతీయ మహిళలకు స్ఫూర్తినిచ్చింది. వృక్షశాస్త్రంలో మిషిగన్‌ అమెరికాలో పరిశోధనలు చేసిన జానకీ అమ్మాళ్‌ - జమ్మూలోని రీజినల్‌ రీసెర్చ్‌ లబోరేటరీలో మూడున్నర వేల వృక్షజాతుల జన్యువుల మీద పరిశోదనలు చేశారు. బ్రిటిష్‌ ఇండియాలో సైన్స్‌లో తొలి డాక్టరేట్‌ సాధించిన అసీమా ఛటర్జీ, అమెరికా వెళ్ళి విస్కాన్సిన్‌, కాలిఫోర్నియాలలో పరిశోధనలు చేసి వచ్చారు. దేశంలో మలేరియా, కేన్సర్‌ల నివారణకు ఆమె పరిశోధనల ఫలితంగానే మందులు తయారయ్యాయి. నీరా (తాటికల్లు)లోని పోషక విలువలపై పరిశోధనలు చేసి రాష్ట్రపతి అవార్డు స్వీకరించిన ధీరవనిత కమలా సోహానీ. ఈమె ప్రతిభను గుర్తించి కేంబ్రిడ్జి యూనివర్సిటీవారు ఆహ్వానించారు. అప్పుడక్కడ గింజధాన్యాలలోని పోషక విలువలపై పరిశోధనలు చేశారు. దేశంలోనే తొలి వాతావరణ శాస్త్రవేత్త అన్నామణి. బాల్యంలో ఆమె తండ్రి ఆమెకు వజ్రాల చెవిరింగులు కొనిపెడతానంటే.. తనకు అవి అవసరం లేదనీ, తనకు 'ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ బ్రిటానికా' కొనిపెట్టమని మారాం చేసింది. ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించిన అన్నామణి ప్రపంచ వాతావరణ సంస్థకు (డబ్ల్యూఎంఓ)కు కన్సల్టెంట్‌గా కూడా ఉన్నారు. ఇలా వేళ్ళమీద లెక్కబట్టెగలిగే మహిళా శాస్త్రవేత్తలలో ఎక్కువ మంది మన దక్షిణ భారతదేశానికి చెందినవారు కావడం మనకు గర్వకారణం. అంతకంటే ప్రపంచంలోనే తొలి అనెస్తీషియా నిపుణురాలు మన హైదరాబాదు నగరానికి చెందిన రూపాబాయి ఫర్దూన్జీ. హైదరాబాదులోని ఒక పార్శీ కుటుంబంలో పుట్టి హైదరాబాదు మెడికల్‌ కాలేజి నుంచి హకీం (డాక్టరు) పట్టా తీసుకుని, ఎన్నో విదేశీ సంస్థలలో పరిశోధనలు చేసి తిరిగి హైదరాబాదుకు వచ్చి, ఏండ్లకేండ్లు శస్త్ర చికిత్సలలో తన సహకారం అందించారు. 1929లో ఛాదర్‌ఘాట్‌ హాస్పిటల్‌ సూపరిండెంటెన్‌గా పదవీ విమరణ చేశారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, ఇటీవలి కాలంలో ''మిస్సైల్‌ వుమెన్‌''గా ప్రసిద్ధి చెందిన టెస్సీ థామస్‌ అగ్ని క్షిపణి ప్రాజెక్ట్‌కు నేతృత్వం వహించడం మరో ఎత్తు! అంటార్కిటి కాను చుట్టివచ్చిన తొలి భారతీయురాలు అదితిపంత్‌తో సహా అనేక మంది మహిళా శాస్త్రవేత్తలు దేశ పురోగతిలో భాగస్వాములవుతున్నారు. అవకాశం వస్తే తాము పురుషులకు ఏమాత్రం తీసిపోమని మహిళలు తేల్చి చెపుతున్నారు. అయితే, మారిన పరిస్థితుల్లో వైజ్ఞానిక రంగంలో మహిళల భాగస్వామ్యం ఇంకా గణనీయంగా పెరగాల్సి ఉంది.

- డాక్టర్‌ దేవరాజు మహారాజు
వ్యాసకర్తం: సుప్రసిద్ధ సాహితీవేత్త, బయాలజీ ప్రొఫెసర్‌.


మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇది రైతుకు జీవన్మరణ సమస్య
రోహిత్‌ వేములది వ్యవస్థీకృత హత్యే!
అర్హతలేని.. మహానుభావులున్నారు జాగ్రత్త!
సాగు చట్టాల అమలునుకాదు... చట్టాలనే రద్దుచేయాలి
అధ్యక్షుడే నేరస్తుడు
మీడియాలో సారం, సారాంశం ఎక్కడ?
ప్రజాస్వామ్యానికి ప్రమాదం!
ఇది తిరోగమనమా? పురోగమనమా?
యూనివర్సిటీలను చంపడమే బంగారు తెలంగాణ!
కౌలుదారుల కడుపుకొట్టే కాంట్రాక్టు సేద్యం చట్టం
సమస్యల సమాహారం సం'క్రాంతి'
మార్క్సిజమే మానవజాతి విముక్తికి మార్గం!
విద్వేష రాజకీయాలతో విధ్వంసమే...
అక్షర భాస్కరుడు...
విశ్వాసమే ఊపిరిగా!
కరోనా డైరీ - 2020
సహనం అంచున రైతాంగ ఉద్యమం
ఎవరి అభివృద్ధి? ఎవరి కోసం అభివృద్ధి?
రైతుల ఐక్యతే ప్రభుత్వ మెడలు వంచుతుంది!
ధర్మం నడిచేది నాల్గు పాదాలమీద కానేకాదు!
అమెరికాలో అగంతక రాజకీయాలు
పదోన్నతులకు ప్రాతిపదిక ఏమిటి?
పదవీ విరమణ వయసు పెంపు
ఇది మరో జాతీయ పోరాటం
కేరళే ప్రత్యామ్నాయం
'మార్పు మనలోనూ రావాలి.!'
చైనాపై మాటలకుస్తీ.. మోడీ విదేశీ భక్తి..
మరో ప్రమాదకర ప్రతిపాదనలు
వద్దంటుంటే రుద్దుతారెందుకు?
యోగి.. రాజ్యాంగ వ్యతిరేకి..

తాజా వార్తలు

06:41 PM

కడుపులో బిడ్డ మాయం..డాక్టర్లకు షాక్ ఇచ్చిన మహిళ..!

06:05 PM

రిలయన్స్ జీయో యూజర్లకు భారీ షాక్...

05:37 PM

బోయిన్‌పల్లి కేసులో మరో 15మంది అరెస్టు

05:25 PM

వాట్సప్ ఓపెన్ చేయగానే యూజర్లకు షాక్..స్టేటస్‌లో..!

05:10 PM

మారిన కరోనా కాలర్ ట్యూన్!

05:04 PM

కరీంనగర్‌లో గుప్తనిధుల కలకలం

04:25 PM

ఏపీలో కొత్తగా 161 కరోనా కేసులు

04:22 PM

ఐస్ క్రీ‌మ్‌లో క‌రోనా వైర‌స్‌..!

04:14 PM

సుప్రీంకోర్టు జడ్జిలపై కాల్పులు..ఇద్దరు మహిళా న్యాయమూర్తుల మృతి

04:07 PM

మ‌హీంద్రా కార్ల‌పై భారీ డిస్కౌంట్లు..!

04:00 PM

సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం..72గంటల ముందే..!

03:50 PM

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 13మందికి పక్షవాతం.!

03:42 PM

ఫిబ్ర‌వ‌రి 24 నుంచి మేడారం చిన్న జాత‌ర‌

01:41 PM

వ్యాక్సిన్ రావ‌డంతో క‌రోనా కాల‌ర్ టోన్ లో మార్పులు

01:29 PM

బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత..

01:16 PM

13 ఏళ్ల బాలికపై 9 మంది లైంగిక దాడి..

01:05 PM

8 కొత్త రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ

12:56 PM

భారత్ 336 ఆలౌట్.. 33 పరుగుల ఆధిక్యంలో ఆసీస్

12:51 PM

హయత్ నగర్ లో కారు బీభత్సం..

12:41 PM

పొగమంచు కారణంగా పలు రైళ్లు ఆలస్యం..

12:33 PM

రెండు బైకులు ఢీ.. ఇద్దరు మృతి

12:19 PM

ఏపీలో రెండో రోజు కొన‌సాగుతోన్న వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం

12:11 PM

ఐస్ క్రీంలో కరోనా వైరస్.. కొన్న వారి కోసం గాలింపు చర్యలు..

11:59 AM

అతని వయస్సు 22.. చేసుకున్న పెళ్లిళ్లు 12..

11:45 AM

నాకు టాలీవుడ్ అంటేనే ఇష్టం : సోనూ సూద్

11:33 AM

మలబార్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు

11:24 AM

తెలంగాణలో కొత్తగా మరో 299 పాజిటివ్ కేసులు

11:16 AM

ఉద్యోగం పోగొట్టుకుని.. దొంగతనాలు చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి అరెస్ట్

11:01 AM

వ్యాక్సిన్ వేసుకున్న 51మందికి స్వల్ప అస్వస్థత..

10:54 AM

దేశంలో కొత్తగా మరో 15వేల పాజిటివ్ కేసులు నమోదు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.