Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఆ వైరస్‌ కన్నా ప్రమాదకరం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Mar 18,2020

ఆ వైరస్‌ కన్నా ప్రమాదకరం

- సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌పై బిలాల్‌బాగ్‌ ఉద్యమకారులు
- ఆందోళనను ఆపేది లేదని స్పష్టీకరణ
బెంగళూరు : ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను గజగజలాడిస్తున్న కరోనా వైరస్‌ భారత్‌లోనూ తన ప్రతాపాన్ని చూపిస్తున్నది. అదే సందర్భంలో మోడీ సర్కారు తీసుకొచ్చిన వివాదాస్పద సీఏఏ, ప్రతిపాదిత ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాల్లో మహిళల నేతృత్వంలో నిరసనలు జరుగుతున్నాయి. అయితే దేశంలో కరోనా ప్రభావం ఉన్నప్పటికీ అది తమ నిరసనలపై ప్రభావం చూపదనీ అంటున్నారు బెంగళూరులోని బిలాల్‌ బాగ్‌ నిరసనకారులు. దాదాపు గత 39 రోజులుగా బిలాల్‌ బాగ్‌లో సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా మహిళలు నిరసనల్లో పాల్గొంటున్నారు. ''మాకు కరోనా వైరస్‌ గురించి బాధలేదు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లు అనే మూడు వైరస్‌లు కరోనా కంటే చాలా ప్రమాదకరం'' అని వారు అంటున్నారు. '' కరోనా బారిన పడకుండా మేము పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. చల్లటి నీటికి దూరంగా ఉంటున్నాం. కానీ, ఈ మూడు(సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌) వైరస్‌ల కంటే కరోనా అంత ప్రమాదకరం కాదని మా అభిప్రాయం. ప్రభుత్వం మమ్మల్ని రోడ్ల మీద అవస్థలు పడేలా చేసింది'' అని మహిళలు ఆరోపించారు. కరోనా వైరస్‌ కారణంగా నిరసనలు ఆపి మేము ఇండ్లలో కూర్చుంటే నిరసనకారులను సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లతో దేశం బయటకు పంపిస్తారు అని ఒక మహిళ ఆరోపించింది. కాగా, రాష్ట్ర సీఎం యడియూరప్పతో చర్చించిన అనంతరం బిలాల్‌బాగ్‌పై చర్యలు తీసుకుంటామని వైద్య విద్య మంత్రి సుధాకర వెల్లడించడం గమనార్హం.
యూపీ లాయర్‌పై దేశద్రోహం కేసు:ట్విటర్‌లో యోగిపై కామెంట్ల ఫలితం
లక్నో : బీజేపీ పాలిత యూపీ రాష్ట్రంలో పౌరులకు భావప్రకటనా స్వేచ్ఛ కఠినంగా మారిపోయింది. సామాజిక మాధ్యమంలో ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై అభ్యంతరకర కామెంట్లు పెట్టినందుకు ఒక లాయర్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. రాష్ట్ర సమాచార విభాగానికి చెందిన మీడియా సలహాదారు శలభ్‌ మని త్రిపాఠి.. రాష్ట్ర అసెంబ్లీలో యోగి ప్రసంగించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నవారిపై లాఠీచార్జ్‌ను సమర్థిస్తూ యోగి చేసిన వ్యాఖ్యలు ఆ వీడియోలో ఉన్నాయి. అంతే కాదు.. '' మీరు పత్రాలు చూపెట్టరు. నిరసనల్లో కూడా పాల్గొంటారు. మరిమేము.. మీ ఇండ్లను వేలం వేస్తాం. వాటికి పోస్టర్లు అంటిస్తాం'' అని రెచ్చగొడుతూ ఆ వీడియోకు క్యాప్షన్‌ను జోడించారు. అయితే ఈ ట్వీట్‌పై కాన్పూర్‌ జిల్లా కోర్టు లాయర్‌ అయిన అబ్దుల్‌ హన్నన్‌ స్పందించారు. సీఏఏ నిరసనకారులపై ప్రతీకారంతో వ్యవహరిస్తున్న యోగిని తీవ్రవాదిగా పేర్కొంటూ రిట్వీట్‌ చేశారు. తన ట్వీట్‌ను షేర్‌ చేయాల్సిందిగా మరొక ట్వీట్‌లో తన ఫాలోవర్స్‌ను కోరారు. అయితే దీనిపై స్పందించిన పోలీసులు హన్నన్‌పై దేశద్రోహం కింద కేసును నమోదు చేశారు. న్యాయస్థానం ముందు ఆయనను ప్రవేశపెట్టి అనంతరం జైలుకు తరలించినట్టు కళ్యాన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ అజరు సేథ్‌ తెలిపారు.
యోగి ఆదిథ్యనాథ్‌, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యలకు వ్యతిరేకంగా అమర్యాదకర పోస్టర్లు పెట్టారని ఆరోపిస్తూ పోలీసులు రెండు రోజుల క్రితం ఇద్దరిని అరెస్టు చేశారు. '' సుధాన్షు, అశ్వనీ అనే ఇద్దరిని అరెస్టు చేశాం. మూడో వ్యక్తి లాలూ కోసం గాలిస్తున్నాం'' అని పోలీసులు చెప్పారు. కాగా, వీరి అరెస్టులను విపక్ష కాంగ్రెస్‌ ఖండించింది. నిందితులను విడుదల చేయాలని లక్నోలో నిరసననూ చేపట్టింది. రాష్ట్రంలో నిరసన గళాలను యోగి సర్కారు అణచివేస్తున్నదని అరెస్టులపై యూపీ కాంగ్రెస్‌ చీఫ్‌ అజరు కుమార్‌ లల్లూ ఆరోపించారు.
కేరళ బాటలో రాజస్థాన్‌:సీఏఏపై సుప్రీంను ఆశ్రయించిన రాష్ట్ర సర్కార్‌
జైపూర్‌ : వివాదాస్పద సీఏఏపై కేరళ దారిలో రాజస్థాన్‌ పయనిస్తున్నది. సీఏఏ రాజ్యాంగ బద్దతను సవాలు చేస్తూ ఆ రాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో దేశంలో పౌరసత్వ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన రెండో రాష్ట్రంగా రాజస్థాన్‌ నిలిచింది. లౌకికవాద సూత్రాన్ని సీఏఏ ఉల్లంఘిస్తుందని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన తన పిటిషన్‌లో అశోక్‌ గెహ్లాట్‌ సర్కారు పేర్కొన్నది. అలాగే జీవించే హక్కు, సమానత్వపు హక్కులకు ఇది తూట్లు పొడుస్తుందని వివరించింది. సీఏఏను సవాలు చేస్తూ దేశంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన తొలి రాష్ట్రంగా కేరళ ఉన్నది. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాలూ సీఏఏకు వ్యతిరేకంగా తమ తమ రాష్ట్ర అసెంబ్లీలలో తీర్మానాలను ఆమోదించిన విషయం విదితమే. సీఏఏతో పాటు పాస్‌పోర్ట్‌ సవరణ నిబంధనలు,2015, ఫారీనర్స్‌(అమెండ్మెంట్‌) ఆర్డర్‌ 2015 లనూ రాజస్థాన్‌లోని కాంగ్రెస్‌ సర్కారు సుప్రీంకోర్టులో సవాలు చేసింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జై కిసాన్‌..
ఆ ఘటన దురదృష్టకరం..
ఎర్రకోటపై జెండా ఎగరేసింది బీజేపీ అనుచరుడేనా..?
కట్టుదిట్టమైన భద్రత నడుమ గణతంత్ర వేడుకలు
వ్యాక్సిన్‌ వేసుకోవాలా? వద్దా?
నిధుల సమీకరణలో మోతిలాల్‌ ఓస్వాల్‌ రియల్‌ ఎస్టేట్‌
డిజిటల్‌ కరెన్సీపై ఆర్బీఐ దృష్టి..!
చట్టాల రద్దే ఏకైక పరిష్కారం : ఏచూరి
ఇది దారుణం..
కర్నాటక క్యాబినెట్‌ లో కుర్చీలాట
పిల్‌ ఉపసంహరణకు అనుమతివ్వం!
లీటర్‌ పెట్రోల్‌ రూ.90 !
రైతుల అపూర్వ భాగస్వామ్యం
పారిశ్రామికం ఇప్పటికీ వెనుకడుగే!
దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు
జేఈఈ అభ్యర్థులకు కీలక ప్రకటన
అయోధ్య మసీదు పనులు ప్రారంభం
బ్రోకర్‌ ఎంపికకు ఫినాలజీ సెలెక్ట్‌
నేడు కిసాన్‌ పరేడ్‌
కల్నల్‌ సంతోష్‌కు మహావీర్‌ చక్ర
బాలుకు పద్మవిభూషణ్‌
జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో పతకాలు
రైతన్నపై కత్తికట్టిన బీజేపీ ప్రభుత్వాలు
కరోనా సమయంలోనూ భారీగా పెరిగిన అంబానీ సంపద
భారత్‌ శాంతికి కట్టుబడి ఉంది
బాల పురస్కార్‌ విజేతలతో మోడీ సంభాషణ
ఏపీ లో వెల్లువెత్తిన సంఘీభావం
మోడీ ద్వారానే అర్నబ్‌కు బాలాకోట్‌ సమాచారం : రాహుల్‌ గాంధీ
దేశ ప్రయోజనాల కోసం
ముంబయిలో భారీ ర్యాలీ

తాజా వార్తలు

09:01 AM

యువకుడి మర్మాంగంపై కత్తి, రాడ్‌తో దాడి చేసి..!

08:44 AM

నేడు గవర్న‌ర్‌ను క‌ల‌వ‌నున్న‌ ఎస్ఈసీ నిమ్మగడ్డ

08:29 AM

ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి

08:19 AM

కరోనా వ్యాక్సిన్ వేసుకునే వారికి బంపర్ ఆఫర్

08:08 AM

గొర్రెల డీసీఎం వ్యాన్‌ బోల్తా..70 గొర్రెలు మృతి

08:04 AM

ఫోన్ కోసం తండ్రిని కొట్టి చంపిన కూతురు

07:50 AM

సంగారెడ్డికి మెట్రోరైలు విస్తరించేలా కృషి చేయాలి : కాంగ్రెస్

07:40 AM

ఏపీలో ఇద్దరు కలెక్టర్ల బదిలీకి సీఎస్‌ ఉత్తర్వులు

07:23 AM

నాంపల్లిలో తమ్ముడ్ని వెంటాడి మరీ చంపిన అన్న

07:07 AM

నేడు జైలు నుంచి విడుదల కానున్న శశికళ

07:03 AM

వనస్థలిపురంలోని అపార్టుమెంటులో అగ్నిప్రమాదం

06:56 AM

క‌రోనా వ్యా‌క్సి‌న్ తీసుకున్న‌ వైద్యు‌రాలికి అస్వ‌స్థ‌త‌

06:46 AM

ఏకగ్రీవాలకు భారీ నజరానా

06:39 AM

విమానాల రాకపోకలపై బ్రెజిల్ నిషేధం

10:01 PM

కోహ్లీయే నా కెప్టెన్ : రహానే

09:48 PM

టీడీపీ మాజీ మహిళ ఎమ్మెల్యే కన్నుమూత

09:24 PM

డిజిటల్ నగదు యోచనలో ఆర్బీఐ

09:11 PM

పాల్వంచ కేటీపీఎస్‌లో ప్రమాదం.. కార్మికులకు గాయాలు

09:01 PM

భూ తగాదాల దాడిలో ఒకరి మృతి

08:56 PM

ఈ స్వ‌తంత్ర దేశంలో గ‌ణ‌తంత్రం ఎవ‌డికో..ఎందుకో

08:35 PM

దేశంలో బిజెపి పాలనలో రాజ్యాంగం ధ్వంసం: బృందా కారత్

08:11 PM

వింత గొర్రె జననం..

08:04 PM

ఏపీలో 172 పాజిటివ్‌ కేసులు

07:59 PM

ఎప్పుడో చెప్పకపోతే.. లీక్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నా..

07:39 PM

భార్య లేచిపోయిందనే కోపంతో ఏకంగా 17 మందిని..

07:14 PM

గోల్నాకలో ఉరివేసుకొని భార్యాభర్తల ఆత్మహత్య

06:57 PM

కరోనాతో రక్షణ మంత్రి మృతి

06:42 PM

పద్మజ, పురుషోత్తంనాయుడులకు 14 రోజుల రిమాండ్

06:31 PM

రైతులపై దాడికి కేంద్రం ప్రభుత్వమే బాధ్యత వహించాలి : రేవంత్‌రెడ్డి

06:21 PM

రైతులపై నిర్బంధాన్ని ఆపాలి - రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.