Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
సంక్షోభంలో రవాణా రంగం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Feb 23,2021

సంక్షోభంలో రవాణా రంగం

- పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం
- రోడ్డెక్కిన రవాణా కార్మికులు
- పన్నురేట్లను యథాస్థితికి తీసుకురావాలంటూ డిమాండ్‌
న్యూఢిల్లీ : దేశంలో నానాటికి పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజీల్‌ ధరలు రవాణా రంగాన్ని తీవ్రం సంక్షోభంలోకి నెట్టాయి. ఈ రంగంపై ఆధారపడి జీవించే కార్మికుల జీవితాలను ఆగం చేశాయి. దీంతో ఇప్పుడు వారంతా రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశంలో సాధారణ, మధ్యతరగతి ప్రజలతో పాటు ప్రతి ఒక్క రంగానికి చెందిన కార్మికుడూ పెరిగిన పెట్రో ధరలకు బాధితుడిగానే మిగిలాడు. కానీ, కేంద్రం తీరులో మాత్రం ఏ మాత్రం సానుకూల స్పందన కనబడటం లేదు. దీంతో మోడీ సర్కారు తీరుపై దేశంలో రవాణా రంగానికి చెందిన కార్మికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న ఇంధన ధరల ప్రభావంతో మొత్తం రవాణా రంగమే తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయిందని ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ డిప్యూటీ జనరల్‌ సెక్రెటరీ ఆర్‌. లక్ష్మయ్య అన్నారు. ఇంధన ధరల పెరుగుదలపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని రోజులుగా నిరసనప్రదర్శనలు కొనసాగుతున్నాయి. పెరుగుతున్న ధరలను సాధారణ ప్రజలు సైతం ఖండిస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనల్లో భాగమవుతున్నారు.
''మహమ్మారి సమయంలో లీటర్‌ పెట్రోల్‌పై రూ. 13, డీజీల్‌పై రూ. 16 ఎక్సైజ్‌ సుంకాన్ని కేంద్రం పెంచింది. దేశంలోని కోట్లాది మంది ప్రజల జీవితాలపై భారాన్ని మోపుతూ, వినియోగదారుల ముక్కు పిండి మరీ కేంద్రం ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నది. ఫలితంగా రవాణా చార్జీలు, దీంతో నిత్యవసర ధరలు కచ్చితంగా పెరుగుతాయి'' అని లక్ష్మయ్య వివరించారు. అయితే, పెట్రోల్‌, డీజీల్‌లపై పన్ను రేట్లను గతేడాది మార్చి 1 నాటికి ఉన్న స్థితికి తీసుకురావాలని ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ యూనియన్లు డిమాండ్‌ చేస్తున్నాయని ఆయన తెలిపారు.
దేశవ్యాప్తంగా హైదరాబాద్‌, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైతో పాటు అనేక నగరాల్లో గత కొన్ని రోజులుగా ఉబర్‌, ఓలా, ఇతర యాప్‌-ఆధారిత ట్రాన్స్‌పోర్టేషన్‌ కార్మికులు నిరసనలు చేస్తున్నారు. ఇంధన ధరలను అదుపులో ఉంచాలనీ, పెట్రోల్‌, డీజీల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. '' లాక్‌డౌన్‌ కాలంలో నగరంలోని దాదాపు 60శాతం మంది డ్రైవర్లు ఇంటి బాట పట్టారు. ఇప్పుడు చమురు ధరల పెరుగుదలతో అతి కష్టం మీద 40శాతం క్యాబ్‌లు మాత్రమే రోడ్లపై తిరుగుతున్నాయి'' అని ఇండియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ యాప్‌ బేస్డ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ (ఐఎఫ్‌ఏటీ) జాతీయ ప్రధాన కార్యదర్శి షేక్‌ సలావుద్దీన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, రవాణా కార్మికులకు మద్దతుగా సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీలు నిరసనల్లో భాగస్వామ్యమవుతున్నాయి. వారి తరఫున గొంతెత్తి వినిపిస్తున్నాయి. '' ధరల పెరుగదలతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర కష్టాలను అనుభవిస్తున్నారు. సేవారంగం ఇంకా మహమ్మారి దెబ్బ నుంచి కోలుకోలేదు. అయితే, ఇంధన ధరలు ఆ కష్టాలను ఇంక విస్తృతం చేస్తున్నాయి'' అని ఆంధ్రప్రదేశ్‌ సీఐటీయూ యూనిట్‌ జనరల్‌ సెక్రెటరీ ఎం.ఏ గఫూర్‌ అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

త్యాగాలే ఊపిరిగా...
ఎడాపెడా వాయింపే
మానవ హక్కుల స్వేచ్ఛకు భంగం
లూటీ సర్కార్‌...
ఒక్క డోసు రూ.250
సాగు వ్యతిరేక చట్టాలు రద్దయ్యే వరకు దేశవ్యాప్త పోరు
రాందేవ్‌ బాబాను అరెస్టు చేయాలి
తప్పిన ఆదాయ లెక్కలు !
వైరస్‌ పరిశోధనలో వెనుకే!
చిన్నారి భవిష్యత్తుకు కరోనా కాటు
మహిళపై ప్రభావం తీవ్రమే
మెగా ర్యాలీకి సిద్ధమైన బ్రిగేడ్‌
'టాయ్ ఫెయిర్‌'ను ప్రారంభించిన మోడీ
మరో ఇద్దరు స్టాండప్‌ కమెడియన్లకు బెయిల్‌
గుజరాత్‌లో ఫైర్‌ సేప్టీలేని భవనాలు 58 వేలకు పైనే
కరోనా.. అదే తీరు
కరోనా నిర్దారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచుకోండి
యూపీలో మరో దారుణం..
యోగి ప్రభుత్వ రైతు కమిటీకి బీకేయూ సభ్యుని రాజీనామా
ఏప్రిల్‌ 23 నుంచి మహారాష్ట్ర బోర్డు పరీక్షలు
గొగోయ్ పై ధిక్కార చర్యలకు అటార్నీ జనరల్‌ తిరస్కృతి
తమిళనాడులో మూడో ఫ్రంట్‌!
చిరుతను పరుగులు తీయించిన 12 ఏండ్ల బాలుడు
అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు
ప్రకాశం జిల్లా వాసి ఆస్ట్రేలియాలో అనుమానాస్పద మృతి
'ఫ్రై'డే..
దందా బంద్‌
పోల్‌ వార్‌..
ప్రయివేటీకరణను ఐక్యంగా ప్రతిఘటిద్దాం
కరోనా విజృంభణ

తాజా వార్తలు

09:56 PM

గ్రేటర్‌ హైదరాబాద్‌ నేతలతో కేటీఆర్ భేటీ..

09:47 PM

బైక్ దొంగతనాలు చేస్తున్న ముఠా అరెస్ట్

09:39 PM

మార్చి నెలలో బ్యాంకులకు 8రోజులు సెలవులు..

09:30 PM

పాము కాటుతో గొర్కెల కాపరి మృతి

09:19 PM

కుమార్తెను తల్లిదండ్రులే విక్రయించిన ఘటనపై చంద్రబాబు స్పందన

09:12 PM

సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం..12మందికి పాజిటివ్

09:02 PM

స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే ఇండియా-ఇంగ్లండ్ వన్డే సిరీస్

08:53 PM

సూర్యాపేట జిల్లాలో 129 కేజీల గంజాయి పట్టివేత

08:47 PM

జగిత్యాల జిల్లాలో వైద్యం వికటించి వ్యక్తి మృతి..

08:39 PM

చిన్న వయసులోనే సివిల్​ జడ్జిగా ఎంపికైన చేతన

08:25 PM

ఎట్టి పరిస్థితుల్లో నేను మాస్క్ ధరించను: రాజ్ థాకరే

08:17 PM

పోలీసుల అదుపులో యూట్యూబ్‌‌ స్టార్‌ షణ్ముఖ్‌‌..

08:10 PM

న్యాయవాదుల హత్యపై కేసీఆర్‌ స్పందించకపోవడం శోచనీయం..

08:02 PM

అసోం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం : తేజస్వీ యాదవ్‌

07:54 PM

దేశంలో పెరుగుతున్న కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

07:40 PM

టీకా ధర నిర్ణయించిన కేంద్రం.. రేటు ఎంతో తెలుసా..?

07:33 PM

పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మహిళ అదృశ్యం

07:26 PM

భార్యను బెదిరించడానికి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు..

07:15 PM

మే 2న నా చివరి ట్వీట్ కోసం వేచి చూడండి: ప్రశాంత్ కిశోర్

07:08 PM

మహారాష్ట్రలో మార్చి 8వరకు లాక్‌డౌన్‌..

07:00 PM

బిట్టు శ్రీనును పోలీస్​ కస్టడీకి అనుమతించిన కోర్టు

06:56 PM

నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వివాహిత

06:44 PM

ఖమ్మం జిల్లాలో గ్యాస్ సిలిండర్లు పేలి రెండు ఇళ్లు దగ్థం..

06:39 PM

ఏపీలో కొత్తగా మరో 118 పాజిటివ్ కేసులు

06:10 PM

కాంగ్రెస్ బలహీనపడుతోంది.. సీనియర్ నేత షాకింగ్ కామెంట్స్

06:00 PM

ఆమె కలెక్టర్.. ఆమె చేసిన పనికి నెటిజన్లు ఫిదా..

05:47 PM

నిరూపిస్తే.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా: కేకే

05:38 PM

పవన్ కల్యాణ్ స్టేట్ రౌడీ అంటూ మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్యే

05:29 PM

విషాదం.. అలిపిరి మెట్ల మార్గంలో బీటెక్ విద్యార్థి మృతి

05:19 PM

క్రికెట్ కిట్లు పంపిణీ చేస్తున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.