Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఆర్నాబ్‌ గోస్వామి వాట్సాప్‌ చాట్‌ లీకైనా... మౌనమేనా? | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 23,2021

ఆర్నాబ్‌ గోస్వామి వాట్సాప్‌ చాట్‌ లీకైనా... మౌనమేనా?

- దేశభక్తిపై ఇతరులకు సర్టిఫికెట్లు ఇస్తున్నవారి నిజ స్వరూపం బయటపడింది : మోడీ సర్కార్‌పై సోనియాగాంధీ ఆగ్రహం
న్యూఢిల్లీ : రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌చీఫ్‌ ఆర్నాబ్‌ గోస్వామి వాట్సాప్‌ చాట్‌ లీక్‌పై కేంద్రం మౌనం పాటించటాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశభక్తిపై ఇతరులకు సర్టిఫికెట్లు ఇస్తున్నవారి నిజ స్వరూపాన్ని 'ఆర్నాబ్‌ వాట్సాప్‌ చాట్‌' బయటపెట్టిందని ఆమె విమర్శించారు. శుక్రవారం సోనియాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సోనియాగాంధీ మాట్లాడుతూ, ఆర్నబ్‌ వాట్సాప్‌ చాట్‌పై ఇంత గొడవ జరుగుతున్నా..మోడీ సర్కార్‌ మాత్రం స్పందించటం లేదన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విపరీతమైన మౌనం పాటిస్తోందని, ఆ మౌనంతో తమ చెవులు బద్దలవుతున్నాయని సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ భద్రతలాంటి కీలకమైన అంశంలో ప్రభుత్వం రాజీపడిందని ఆరోపించారు.
''జాతీయ భద్రత విషయంలో కేంద్రం ఎంత రాజీపడిందో ఈ మధ్యే భయంకరమైన రిపోర్టులు బయటికొచ్చాయి. దేశ భద్రతకు సంబంధించిన అంశాలను బహిరంగపరిస్తే అది దేశద్రోహమని కాంగ్రెస్‌ నాయకుడు, కేంద్ర మాజీ రక్షణమంత్రి ఎ.కె.ఆంటోనీ కొన్ని రోజుల క్రితమే చెప్పారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందనా లేదు. విపరీతమైన మౌనం పాటిస్తోంది'' అని సోనియాగాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయత, దేశభక్తి మీద ఎవరైతే ఇతరులకు సర్టిఫికెట్లను జారీచేస్తున్నారో, వారి నిజస్వరూపం బట్టబయలైందని సోనియా వ్యాఖ్యానించారు.
సంచలనం సృష్టిస్తున్న ఆర్నాబ్‌ వాట్సాప్‌ చాట్‌
టీవీ రేటింగ్స్‌ కేసులో రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ ఆర్నాబ్‌ గోస్వామిపై ముంబయి పోలీసులు విచారణ జరుపుతున్నారన్న సంగతి తెలిసిందే. ఈ విచారణలో ఆర్నాబ్‌కు సంబంధించి మరొక సంచలన విషయం బయటపడింది. అదేంటంటే..బాలాకోట్‌ వైమానిక దాడులు జరగడానికి మూడు రోజుల ముందుగానే ఆ సమాచారం ఆర్నాబ్‌ గోస్వామికి చేరటం. ఈ విషయాన్ని వాట్సాప్‌లో 'బ్రాడ్‌కాస్ట్‌ ఆడియన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌' మాజీ సీఈఓ పార్థో దాస్‌గుప్తాకు ఆర్నాబ్‌ పంపాడు. 'ఇది మామూలు వైమానిక దాడి కాదు..అంతకన్నా చాలా పెద్దది' అని ఒక వాట్సాప్‌ సందేశాన్ని ఆర్నాబ్‌ పంపాడు. జాతి భద్రతకు సంబంధించిన అత్యంతక కీలకమైన బాలాకోట్‌ వైమానిక దాడుల సమాచారం ఆర్నాబ్‌ గోస్వామికి మూడు రోజుల ముందు తెలియటం, ప్రధాని మోడీ సహా బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయని ఆర్నాబ్‌ చెప్పుకోవటం వాట్సాప్‌ చాట్‌లలో ఉంది. దేశ రక్షణకు సంబంధించి కీలక సమాచారం ఆర్నాబ్‌కు ఎలా చేరిందన్నదానిపై బీజేపీ నేతలు మాట్లాడటం లేదు. కేంద్రం స్పందించటం లేదు. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఈ సంగతిపై మోడీ సర్కార్‌ మౌనం పాటిస్తోంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అన్నీ అమ్మేస్తాం..
40 లక్షల ట్రాక్టర్లతో..పార్లమెంట్‌ ముట్టడి
ఆసియాన్‌ ఒప్పందం నుంచి వైదొలగాలి
సంపన్నుల ఆదాయం పైపైకే..
రాయలసీమ ఎత్తిపోతలపై త్వరగా నిర్ణయం తీసుకోండి
లివైజ్‌ ప్రచారకర్తగా దీపికా
ప్రయివేటు బ్యాంక్‌లకు ప్రభుత్వ వ్యాపారం
ఉన్నావో దళిత బాలికలపై విషప్రయోగం
పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన
26న భారత్‌ బంద్‌ కు వ్యాపారుల పిలుపు
రైతు ఉద్యమానికి... 3 నెలలు
దిశా రవికి బెయిల్‌
ఏడాదైనా న్యాయం జరగదా?
రెండు కాదు.. నాలుగు
ఆంక్షలు విధిస్తాం..
దేశంలో మళ్లీ కరోనా పంజా
భారత ఆరోగ్యరంగం వైపు ప్రపంచ చూపు !
గుజరాత్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు
కర్నాటకలో జిలెటెన్‌ స్టిక్స్‌ పేలుడు
ఏపీ అసెంబ్లీలో ఉక్కు తీర్మానం
ప్రయివేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోండి
పోరుబాటలో బీఎస్‌ఎన్‌ఎల్‌ డిఓటి పెన్షనర్లు
శారదా చిట్‌ఫంట్‌ కేసు..
పోలీసులు తీవ్రంగా కొట్టారు
ప్రతి నిమిషానికీ వెయ్యి కోట్ల నష్టం
హర్యానాలో పంట ధ్వంసం
బతికేదెలా..!
పుదుచ్చేరిలో కుప్పకూలిన కాంగ్రెస్‌ ప్రభుత్వం
వరవరరావుకు బెయిల్‌..
రైతుల్ని బాదిన బీజేపీ కార్యకర్తలు

తాజా వార్తలు

09:47 PM

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మోడీ కీలక వ్యాఖ్యలు..

09:41 PM

మాజీ ప్లేయర్​ పీటర్సన్​ను ట్రోల్ చేస్తున్న భారత అభిమానులు

09:33 PM

కలెక్టరేట్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయండి : సీఎస్​

09:24 PM

మోడీ త్వరలోనే మాజీ ప్రధాని అవుతారు.. సీఎం షాకింగ్ కామెంట్స్

09:16 PM

కేసీఆర్‌ తీరు బీజేపీతో ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీలా ఉంది : జీవన్ రెడ్డి

09:04 PM

కేసీఆర్, జగన్, విజయశాంతిపై షర్మిల సంచలన వ్యాఖ్యలు..

08:58 PM

నోటుకు ఓటు కేసులో కోర్టుకు హాజరైన రేవంత్​రెడ్డి

08:44 PM

సీఎం కీలక నిర్ణయం..1 నుండి 7వ తరగతి విద్యార్ధులకు..

08:32 PM

వామన్ రావు హత్య కేసు.. ప్రభుత్వానికి లేఖ రాసిన గవర్నర్

08:20 PM

క్రికెట్ స్టేడియంకు మోడీ పేరు పెట్టడంపై రాహుల్ గాంధీ విమర్శలు

08:02 PM

పట్టభద్రుల ఎమ్మెల్సీ నామపత్రాల పరిశీలన పూర్తి

07:54 PM

దిశ చట్టం అంటూ మాయ చేసిన జగన్ : లోకేశ్

07:40 PM

తెలంగాణ విద్యార్ధులు, నిరుద్యోగులతో ముగిసిన షర్మిల భేటీ..

07:23 PM

అమెరికాలో కరోనా విజృంభణ.. బైడెన్ కీలక నిర్ణయం

07:11 PM

గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బోణి కొట్టిన ఆమ్‌ ఆద్మీ

07:01 PM

రేపటి నుండి ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నిలిచిపోనున్న సర్వీసులు

06:52 PM

ప్రైవేటు బ్యాంకులకు శుభవార్త..

06:44 PM

వామన్‌రావు హత్య కేసు : పోలీసుల కస్టడీలో నిందితులు..

06:40 PM

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

06:34 PM

చెలరేగిన భారత స్పిన్నర్లు.. 112పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్

06:29 PM

నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లావాసులకు హెచ్చరిక..

06:13 PM

ఎనీ వేర్​-ఎనీ టైం సేవలకు గుర్తింపు.. అవార్డు ప్రదానం

06:04 PM

టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కు లేదు: ఉత్తమ్​

05:49 PM

కామారెడ్డి జిల్లాలో గొంతు కోసుకుని యువతి ఆత్మహత్య..

05:38 PM

పెరుగుతున్న కేసులు.. రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్రం

05:32 PM

పోలీసులు, లిక్కర్ మాఫియాకు మధ్య కాల్పులు.. ఎస్ఐ మృతి

05:22 PM

ఎర్రకోట ముట్టడి ఘటనలో 19 అరెస్టులు, 25 కేసులు : కేంద్రం

05:13 PM

ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు..

05:05 PM

భార్య, కుమార్తెను కాపాడేందుకు ఏకంగా పులితోనే పోరాడి..

04:50 PM

108 సిబ్బందే బంగారం దొంగతనం చేశారు : పోలీసులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.