Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
టెన్షన్‌.. టెన్షన్‌ ! | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Jan 25,2020

టెన్షన్‌.. టెన్షన్‌ !

- అభ్యర్థుల అనుయాయుల్లో తీవ్ర ఉత్కంఠ
- గెలుపోటములపై జోరుగా బెట్టింగులు
- కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
- విప్‌ జారీ చేసిన ప్రధాన పార్టీలు
- నేడు పుర ఎన్నికల ఫలితాలు
      పురఎన్నికల ఫలితాలకు కౌంట్‌.. డౌన్‌ మొదలైంది. మరి కొన్నిగంటల్లో బ్యాలెట్‌బాక్స్‌లో దాగున్న అభ్యర్థుల భవితవ్యం బయటపడనుంది. నువ్వా..? నేనా..? అన్నట్టుగా హోరాహోరీగా ఎన్నికల్లో తలపడిన అభ్యర్థులు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఈక్రమంలో ఎన్నికల ఫలితం అనుకూలమా? ప్రతికూలమా? తెలియక నరాలు తెగేంత టెన్షన్‌కు గురవుతున్నారు.వారి అనుయాయులు సైతం గెలుపోటముల గురించి తెలుసుకునేందుకు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. పుర ఎన్నికల గెలుపు గుర్రాలపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జోరుగా బెట్టింగులు సాగాయి. శనివారం జరిగే మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ కోసం నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల కలెక్టర్ల అధ్వర్యంలో ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు.ఫలితాలు వెలువడిన తర్వాత విజయోత్సవ ర్యాలీలను పోలీసులు నిషేధించారు.సమస్యాత్మాక ప్రాంతాల్లో పోలీసులను మోహరించారు. ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించినట్టు పోలీస్‌ ఉన్నతాధికారులు ప్రకటించారు.
నవతెలంగాణ-నల్లగొండిపాంతీయ ప్రతినిధి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో 407 వార్డులు ఉండగా 3వార్డులు ఏకగ్రీవమైనాయి. యాదాద్రి జిల్లాలోని 433 మంది అభ్యర్థులు పోటీ చేసిన 103 వార్డుల్లో 1,17,769 ఓట్లకు గాను 104014 ఓట్లు పోలైనాయి.సూర్యాపేట జిల్లాలోని 556 మంది పోటీ చేసిన 140వార్డుల్లో 2,06,238 ఓట్లకు గాను 1,71,710 ఓట్లు పోలయ్యాయి. నల్లగొండ జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో 718 మంది పోటీ చేసిన 161 వార్డుల్లో 2,81,444 ఓట్లకు గాను 2,23,684 ఓట్లు పోలయ్యాయి. 1707 మంది పోటీ చేసిన 404 వార్డుల్లో మొత్తంగా 6,05,451ఓట్లకు గాను 4,99,344 ఓట్లు ఈనెల 22న 1006 పోలింగ్‌ బూత్‌ల్లో పోలయ్యాయి.మిగతా 1,06,107 ఓటర్లు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఎన్నికల ఆనంతరం బ్యాలెట్‌ బాక్స్‌లను స్ట్రాంగ్‌ రూంల్లో భద్రపరిచారు. వీటికి మూడంచెల భద్రతను పోలీసులు కల్పించారు. సీసీ కెమెరాల నిఘాలో 24గంటల పాటు పర్యవేక్షించారు. పోలీసులభద్రతలో ఉన్న బ్యాలెట్‌బాక్స్‌లు కౌంటింగ్‌ సందర్భంగా నేడు తెరుచుకోనున్నాయి. వాటిల్లో దాగి ఉన్న అభ్యర్థుల భవితవ్యాన్ని బయట పెట్టనున్నాయి.
యాదాద్రి జిల్లాలో....
యాదాద్రి జిల్లాలోని భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూరు, పోచంపల్లి, చౌటుప్పల్‌ పురపాలిక ఓట్ల లెక్కింపు భువనగిరిలోని ఆరోరా ఇంజనీరింగ్‌ కళాశాలలో జరుగుతుంది.ఏబ్లాక్‌లో భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, బీబ్లాక్‌లో చౌటుప్పల్‌, మోత్కూరు, పోచంపల్లి మున్సిపల్‌ కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.ఆరు మున్సిపాలిటీల్లో 104 వార్డులకు గాను పోచంపల్లి ఒకటవ వార్డు ఏకగ్రీవం కాగా 103వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఒక్కో వార్డుకు ఒక్కో టేబుల్‌ చొప్పున 103 టేబుళ్లను ఏర్పాటు చేశారు.ఓట్ల లెక్కింపు కోసం 360 మంది సిబ్బందిని నియామకం చేశారు. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు లెకింపు పూర్తవ్వనుంది.అయితే ఉదయం 11గంటల లోపు ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తోన్నాయి.
సూర్యపేట ఎస్‌.వి కాలేజీలో...
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు సూర్యపేట ఎస్‌.వి ఇంజనీరింగ్‌ కళాశాలలో జరుగుతుంది.సూర్యపేటలోని 48వార్డులకు 21 టేబుల్స్‌ సిద్ధం చేశారు. 3రౌండ్లల్లో ఫలితాలు ముగి యనున్నాయి. 35 వార్డులను కోదాడకు 15టేబుళ్లు, నేరడుచర్ల ఆరు, హుజూర్‌నగర్‌కు 10, తిరుమల గిరికి 6 టేబుళ్లు ఏర్పాటు చేసి ఓట్లను లెక్కిస్తారు.
నల్లగొండలో ఎక్కడికక్కడే...
నల్లగొండ జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు ఎక్కడికక్కడే జరుగుతుంది. నల్లగొండలోని 48వార్డుల ఓట్ల లెక్కింపు పాలిటెక్నిక్‌ కళాశాల వద్ద ఎఫ్‌సీఐ గోదాంలో వార్డుకు ఒక టేబుల్‌ చొప్పున ఏర్పాటు చేశారు.మిర్యాలగూడలోని 48వార్డుల ఓట్ల లెక్కింపు ఏ.ఎం.సి ఆవంతీపురం మార్కెట్‌ యార్డులో సిద్దం చేశారు. దేవరకొండలోని 20వార్డులకు ఎంకేఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందికొండలోని 12వార్డులకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల హలియా, చిట్యాలలో ఎంపీడీఓ ఆఫీస్‌, చండూర్‌లో మారినికేతన్‌ పాఠశాలలో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు సిద్ధం చేశారు. ఒక్కో టేబుల్‌కు రిటర్నింగ్‌ అధికారి, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి, సూపర్‌వైజర్‌, ఇద్దరు క్లర్కులు ఉంటారు. ప్రతి లెక్కింపు కేంద్రం వద్ద మూడెంచల భద్రతను పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో సెంటర్‌ వద్ద 100 మించి పోలీసులను మోహరించారు. కౌంటింగ్‌ జరిగే ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను విధించారు.
విజయోత్సవ ర్యాలీలు నిషేధం..
పుర ఫలితాల్లో గెలుపొందిన విజేతలు విజయోత్సవ ర్యాలీలు తీయకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు.సభలు, సమావేశాలు సైతం నిర్వహించకూడదని ప్రకటించారు. సమస్యాత్మాక ప్రాంతాల్లో శనివారం తెల్లవారుజాము నుంచి పోలీస్‌ పికెటింగ్‌ నిర్వహిస్తారు.
జోరుగా బెట్టింగ్‌లు...
పురఎన్నికల గెలుపు గుర్రాలపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జోరుగా పందాలు కాసారు. నేడు వెలువడే ఫలితాల్లో గెలిచే అభ్యర్థులు వీరేనంటూ.. పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు చేసుకున్నారు.రూ.5వేల నుంచి లక్ష వరకు బెట్టింగ్‌ పెట్టుకున్నారు. ఇందులో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఉండడం విశేషం. చౌటుప్పల్‌, యాదగిరిగుట్ట, హుజూర్‌నగర్‌, కోదాడ, సూర్యాపేట తదితరు మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలు తగ్గాపోరు ఉన్న చోట తమ పార్టీ అభ్యర్థి గెలుస్తున్నాడని తొడగొట్టి ఛాలెంజ్‌ చేస్తూ పందాలు కట్టుకున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చాలా పురపాలికల్లో శుక్రవారం ఇదే చర్చ వినిపించింది.చౌటుప్పల్‌, పోచంపల్లి, యాదగిరిగుట్ట తదితర పురపాలికల్లో గతం కంటే ఎక్కువ ఓట్లు పోలవ్వడంతో పోటీలో ఉన్న అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పట్టణ యువత ఓట్లు ఎవరికి మొగ్గు చూపాయో అర్ధం కాక ప్రధానపార్టీల అభ్యర్థులకు గుబులు మొదలైంది. పట్టణ యువత ఓట్లు ఎవ్వరికి అధికంగా పడుతాయో.. వారికి విజయం వరించడం ఖాయమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
విప్‌ జారీ చేసిన పార్టీలు..
ఎన్నికలకు ముందు క్యాంపు రాజకీయాలు మొదలుకావడంతో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఐ(ఎం) పార్టీలు విప్‌ను జారీ చేశాయి.కౌంటింగ్‌ సమావేశాల పేరిట అభ్యర్థులను పిలిచి విప్‌ పత్రాలను అందజేశాయి.ఓట్ల లెక్కింపు తర్వాత ఫలితాలను బట్టి కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ క్యాంపులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేసేంతవరకు ఐక్యంగా పోరాడాలి
రైతులను ముంచేందుకే నల్లాచట్టాలు
ముగిసిన జాన్‌పహాడ్‌ ఉర్సు వేడుకలు
మునగాల సీఐగా ఆంజనేయులు
సూర్యాపేట అభివృద్ధికి కృషి
గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాటు చేయాలి
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ట్రాక్టర్‌ ర్యాలీ
దళిత కాలనీలో దాహం కేకలు
రైతుల పాత్ర గొప్పది
పీఆర్‌సీ ప్రకటించాలి
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
10కి చేరిన రోడ్డు ప్రమాదాల మృతుల సంఖ్య
ఆర్థిక ఇబ్బందులతో వివాహిత ఆత్మహత్య
డబ్బులివ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని..బావను హత్య చేసిన బావమరిది
చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికి తీయాలి
అన్నం పెట్టే రైతన్న అలమటిస్తున్నడు
ఈటెల, హరీష్‌రావులకు అర్హత లేదా ?
మోడీ విధానాలపై గొంతెత్తాలి
మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి..
జాన్‌పహాడ్‌ ఉర్సు ప్రారంభం
బస్సు యాత్రను విజయవంతం చేయండి
అంగీకార పత్రం ఉంటేనే బడిలోకి ప్రవేశం
ఫార్మా కంపెనీ లైసెన్స్‌ రద్దు చేసి పనులను ఆపండి
అంబేద్కర్‌ విగ్రహంపై దాడి చేసిన దుండగులను అరెస్ట్‌ చేయాలి
ఈ - లైబ్రరీ తెలంగాణ మొబైల్‌ యాప్‌ విడుదల
నార్కట్‌పల్లిలో 6019 కోళ్లు మృతి
స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి
విద్యార్థులకు సన్మానం

తాజా వార్తలు

09:43 PM

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

09:35 PM

అక్క‌డ జూలై 17 వరకు లాక్‌డౌన్‌ పొడగింపు

09:10 PM

మెదక్‌లో దారుణం...

09:02 PM

వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల బాధ్యత పెరిగింది: కేసీఆర్

08:47 PM

యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు

08:24 PM

ఉద్యోగ సంఘాలతో త్రిసభ్య కమిటీ చర్చలకు సీఎం ఆదేశం

08:20 PM

భూపాలపల్లిలో ముగ్గురు చిన్నారులకు అస్వస్థత

07:57 PM

రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ డేవిడ్‌ మృతి

07:34 PM

రైల్వే ప్రయాణికులను హెచ్చరించిన కేంద్రం

07:19 PM

మర్మాంగంలో 9 కిలోల బంగారం త‌ర‌లింపు..!

07:12 PM

మెదక్‌లో విద్యుదాఘాతంతో రైతు మృతి

07:04 PM

పౌల్ట్రీ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: వెంకట్‌రెడ్డి

06:33 PM

ల‌బ్ధిదారుల‌కు పాడి గేదెల‌ను పంపిణీ చేసిన మంత్రి ఎర్ర‌బెల్లి

06:24 PM

ఒడిశాలో జాతీయ రహదారిపై ఏనుగుల హల్‌చల్‌

06:07 PM

ఈ చాక్లెట్లను రుచి చూస్తే గంటకు రూ.1700

05:50 PM

ఏపీలో కొత్తగా 158 కరోనా కేసులు

05:32 PM

గణతంత్ర వేడుకల్లో పాల్గొనే గిరిజన అతిథిలకు శుభాకాంక్షలు..

05:26 PM

బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు పసుపు రైతులను ఆదుకోవాలి : భట్టి

05:20 PM

వికలాంగ చట్టాల సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం

05:11 PM

నెక్సాస్ ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి..

05:08 PM

పలు భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన గుత్తా సుఖేందర్

04:52 PM

పార్లమెంట్ సమావేశాల్లో ట్రైబల్ వర్సిటీ బిల్లు ప్రవేశపెట్టాలి : గిరిజన శక్తి

04:46 PM

జాతి నిర్మాణంలో సాహితీ ప్రక్రియల పాత్ర కీలకం: ఎమ్మెల్సీ కవిత

04:41 PM

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌ త‌మిళిసై

04:38 PM

పెట్రోల్ ధరలపై కీలక ప్ర‌క‌ట‌న చేయ‌నున్న కేంద్రం..!

04:29 PM

వరంగల్‌ లో వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్‌ వర్కర్‌ మృతి..

04:17 PM

మానసిక పరిస్థితి బాగాలేని మహిళపై గ్రామస్థుల దాడి

04:12 PM

రోడ్డు ప్రమాదంలో తండ్రీకుమారుడు మృతి

04:05 PM

నిజామాబాద్ జిల్లాలో 6లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

04:02 PM

రైతు ఉద్యమంపై అఖిల పక్ష రాజకీయ పార్టీల సమావేశం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.