Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇన్చార్జి కలెక్టర్ చంద్రశేఖర్
నవతెలంగాణ-నిడమనూరు
మార్కెట్ కార్యాలయానికి ధాన్యం తెచ్చిన రైతులకు ప్రభుత్వ మద్దతు ధర అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఇన్చార్జి కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని పలు కార్యాలయాలు, పాఠశాలలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.మండల కేంద్రంలోని పీహెచ్సీ, మార్కెట్ కార్యాలయంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం, కస్తూర్బా పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడున్న వసతులను పరిశీలించారు. రికార్డుబుక్లను, వంటగదులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. హాస్టల్లో ఉన్న విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులకు సమస్యల్లేకుండా చూడాలని ప్రత్యేకాధికారిని ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ జగన్నాథరావు తహసీల్దార్ ప్రమీల, కస్తూర్బా పాఠశాల ప్రత్యేకాధికారి ఇందిర ఉన్నారు.