Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చందంపేట
అటవీశాఖ వాహనం ఢీ కొని ఒకరు దుర్మరణం చెందిన సంఘటన మండల కేంద్రంలోని ఎస్సెల్బీసీ క్యాంపు వద్ద బుధవారం చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కలమం దతండాకు చెందిన రమావత్ కిషన్, రాజులు చందంపేటకు బైకుపై వెళ్లి వస్తుండగా ఎస్సెల్బీసీ క్యాంపు యూటర్న్ తీసుకునే సమయంలో అటుగా వస్తున్న అటవీ శాఖ వాహనం ఢీ కొనడంతో కిషన్(26) అక్కడికక్కడే మృతి చెందాడు. రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.