Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాజాపేట
దోపిడీ రహిత సమాజ నిర్మాణం, నూతన ప్రజాస్వామిక విప్లవ రాజకీయాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడం కటకం అంజయ్య ఆశయమని సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్.జనార్థన్ అన్నారు. మండలంలోని రఘునాథపురంలో గురువారం కామ్రేడ్ కటకం అంజన్న 39వ వర్ధంతి సభ నిర్వహించారు. అంజన్న స్థూపం వద్ద జెండా ఎగురవేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వ్యతిరేకించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ గ్రామ కార్యదర్శి కొంగరి సాయిరాం, గడ్డం యాదగిరి, బేజాడి కుమార్, ఇ.కుమార్, ఆర్.సీత, నేరేడు స్వామి, జి.భిక్షపతి, సిహెచ్.రాజయ్య, ఎస్.రామకృష్ణ, కె.ప్రమీల, ఎం.శివ, జి.రాములు, ఇంజా శ్రీను, ఎస్.సుగుణ, ఉప్పలయ్య, ఎస్.జ్యోతి, కె.పాండరి, వగ్గు మల్లయ్య పాల్గొన్నారు.