Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు
నవతెలంగాణ - మహబూబ్నగర్ కలెక్టరేట్
జిల్లాలో అక్రమ లే-అవుట్లను గుర్తించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ రాజ్ శాఖ అధికారులను ఆదేశిం చారు. ఈ మేరకు కలెక్టర్ తన చాంబర్లో కమిషనర్లు, డీపీఓ, సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మున్సిపాలిటీల పరిధిలో గ్రామ పంచాయతీల పరిధిలో ప్రభు త్వ అనమతి లేకుండా చేపట్టిన లే-అవుట్లను గుర్తించి అమ్మకాలు చేయకుండా చర్యలు తీసు కోవాలని తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు సీతారామరావు, తేజస్ నంద్ లాల్ పవర్, డీపీఓ వెంకటేశ్వర్లు, మహబూబ్నగర్, జడ్చర్ల, భూత్పూర్ మున్సిపల్ కమిషనర్లు సు రేందర్, సునీత, నజీబ్, ఆర్డీఓ శ్రీనివాస్ సంబ ంధిత అధికారులు పాల్గొన్నారు.