Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నాగర్కర్నూల్
కరోనా నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్ ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సీఐటీ యూ జిల్లా కార్యాలయంలో నిరసన కార్యక్ర మాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ రంగానికి సంబ ంధించిన రూ.వెయ్యి కోట్లు ఇతర అవసరాల కు వాడుకున్నారని ఆరోపించారు. వాటితో వె ంటనే భవన నిర్మాణ కార్మికులకు ఆదుకోవా లని డిమాండ్ చేశారు. కార్మికులకు నెలకు రూ .7,500లతో పాటు 12 రకాల సరుకులను ఉ చితంగా ఇవ్వాలని, కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో కోరారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మీ నారాయణ, వెంకటయ్య, ఆంజనేయులు, బా లస్వామి, నిరంజన్, రాజేష్, రవీందర్, శ్రీని వాస్, రాజేందర్ పాల్గొన్నారు.