Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
మార్పు రావాలంటే ఓపిక పట్టాలి | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Jan 16,2021

మార్పు రావాలంటే ఓపిక పట్టాలి

ఆమెకు పెండ్లయి ఏడాదిన్నర. నాలుగు నెలల పాపవుంది. భర్త నోరు తెరిచి అస్సలు మాట్లాడడు. సరైన సంపాదన లేదు. ఇంట్లో పెత్తనమంతా మామదే. భర్తకు సంపాదన లేకపోవడంతో మామతో సూటి పోటి మాటలు భరించాల్సి వస్తుంది. తనకూ, భర్తకు విలువలేని ఆ ఇంట్లో ఉండలేక పోతుంది. తన సమస్యను ఎలాగైన పరిష్కరించమంటూ అన్నను వెంటబెట్టుకుని ఐద్వాలీగల్‌ సెల్‌కు వచ్చింది. ఆమె సమస్య ఎలా పరిష్కారమయిందో ఈ వారం కేస్‌ స్టడీలో తెలుసుకుందాం...
స్వప్న చిన్నప్పుడే తల్లిదండ్రులు ఓ ప్రమాదంలో చనిపోయారు. ఆమెకు ఓ అన్న ఉన్నాడు. వీరిద్దరి ఆలనా పాలన మేనమామలే చూసుకున్నారు. స్వప్న చాలా తెలివైన పిల్ల. బీటెక్‌ పూర్తి చేసిన ఆమెకు పెండ్లి చేయాలనుకున్నారు. మేనమామలే ఓ సంబంధం చూశారు. అబ్బాయి పేరు సంతోష్‌. ఎంబీఏ చదివి మార్కెటింగ్‌ జాబ్‌ చేస్తున్నాడని చెప్పారు. నెలకు 35 వేల జీతం అని కూడా చెప్పారు. అమ్మానాన్న లేని పిల్ల మంచి ఉద్యోగం ఉన్న వ్యక్తికిచ్చి పెండ్లి చేస్తే సుఖ పడుతుందనుకున్నారు.
సర్ధిచెప్పుకుంది
పెండ్లయిన పది రోజులకే అసలు విషయం బయటపడింది. సంతోష్‌ చదివింది ఇంటర్‌ మాత్రమే. ఫుడ్‌ డెలివరీ బారుగా పని చేస్తున్నాడని స్వప్నకు తెలిసింది. ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగు పెట్టిన ఆమె ఈ నిజం భరించలేకపోయింది. అయినా ఏ పని చేస్తే ఏంటి తనను ప్రేమగా చూసుకుంటే చాలని తనకు తానే సర్ది చెప్పుకుంది. అయితే సంతోష్‌ పనికి సరిగా పోడు. వచ్చిన డబ్బులు కాస్త పెట్రోల్‌ ఖర్చులకే అయిపోతాయి. ఇంటి ఖర్చులకు పైసా ఇవ్వడు. దాంతో తండ్రి అతన్ని చీటికీ మాటికి తిడుతుంటాడు. దండగ తిండి తింటున్నారని స్వప్నను కలిపి మాటలు అంటుంటాడు. ఈ మాటలు స్వప్న భరించలేకపోయేది. భర్త మాత్రం నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడడు. ఎప్పుడూ మౌనంగా ఉంటాడు.
ఎలా మాట్లాడాలో తెలియదు
స్వప్న బాధపడుతున్నా పట్టించుకోడు. కాస్త కూడా ఓదార్చడు. నలుగురిలో ఉన్నప్పుడు కాకపోయినా కనీసం తమ గదిలో కూడా ఆమెను ప్రేమగా పలకరించడు. ఇది ఆమెకు మరింత బాధ కలిగించేది. సంతోష్‌కు నలుగురితో కలిసి మెలిసి ఎలా ఉండాలో తెలియదు. ఎవరితో ఎలా మాట్లాడో రాదు. ఇది గమనించిన స్వప్న భర్తలో ఎలాగైనా మార్పు తీసుకురావాలని ఎక్కువగా తన అన్న దగ్గరకు సంతోష్‌ని తీసుకువెళుతుండేది. దాంతో అత్తా, మామా ''ఎప్పుడూ మా కొడుకుని తీసుకుని అన్న దగ్గరకు పోతావు'' అంటూ గొడవ చేసేవారు. స్వప్న ఎంత చెప్పినా అర్థం చేసుకోరు. దాంతో ఆమెకు మరీ చిరాకు వచ్చింది. భర్తను మార్చుకోవడానికి ప్రయత్నిస్తే సహకరించడం లేదని కోపం. దాంతో అత్త, ఆడపడుచుతో సరిగా మాట్లాడేది కాదు.
ఇక భరించలేక
లాక్‌ డౌన్‌కి ముందు స్వప్న నెల తప్పింది. ఇక అప్పటి నుండి అన్న దగ్గరే ఉంటుంది. సంతోష్‌ కనీసం ఫోన్‌ చేసి మాట్లాడడు. ఆమె ఫోన్‌ చేస్తే 'నేను బయట బిజీగా ఉంటా నాకు ఫోన్‌ చెయ్యకు' అంటాడు. ఇదంత భరించలేక పెద్దవాళ్ల మధ్య కూర్చోబెట్టి మాట్లాడితే అప్పుడు స్వప్న దగ్గరకు వచ్చాడు. వీరిద్దరి మధ్య తరచుగా జరిగే గొడవలను ఆడపడుచు భర్త పరిష్కరిస్తుండేవాడు. స్వప్నకు నెలలు నిండి పాప పుట్టింది. ఆడపిల్ల పుట్టిందని సంతోష్‌ పాపను సరిగా ఎత్తుకోనుకూడా ఎత్తుకోలేదు. వెంటనే హాస్పిటల్‌ నుండి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పాపకు నాలుగు నెలలు నిండాయి. ఏమీ పట్టించుకోని భర్త దగ్గరకు పాపను తీసుకుని వెళ్ళడానికి ఆమె థైర్యం చేయలేకపోయింది. అందుకే లీగల్‌సెల్‌కు వచ్చింది.
అందరితో అంతే
స్వప్న సమస్యను విన్న లీగల్‌సెల్‌ సభ్యులు తర్వాతి వారం రమ్మని సంతోష్‌కు లెటర్‌ పంపారు. చెప్పిన ప్రకారమే సంతోష్‌ తన తల్లి, చెల్లి, బావను వెంటబెట్టుకుని లీగల్‌సెల్‌కి వచ్చాడు. సంతోష్‌తో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత సభ్యులకు విషయం అర్థమయింది. అతను నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడడం లేదు. చెల్లెలి భర్తనే అంతా మాట్లాడుతున్నాడు. సంతోష్‌ తండ్రి ఒక్క స్వప్ననే కాదు కూతురితో, అల్లుడితో, భార్యతో, కొడుకుతో అందరితో అలాగే మాట్లాడతాడు. ఎవ్వరినీ మనుషులుగా గుర్తించడు.
వేరు కాపురం కష్టం
లీగల్‌సెల్‌ సభ్యులు స్వప్నతో ''నువ్వు నీ భర్తతో కలిసి బతకాలనుకుంటున్నావు. అతన్ని మార్చుకోవాలనుకుంటున్నావు. కాబట్టి కాస్త ఓపిక పట్టక తప్పదు. మీ మామయ్య మాటలు పట్టించుకుంటే నువ్వుక్కడ అస్సలు ఉండలేవు. ఆ మనిషి మనస్తత్వమే అది. సంపాదిస్తున్నాను కాబట్టి ఏమైనా అనొచ్చు అనే అహంకారం బాగా ఉంది. పైగా వయసు కూడా పెరిగింది. ఇప్పుడు అతనికి ఏం చెప్పినా ఉపయోగం లేదు. ఇంకా సమస్య ఎక్కువవుతుంది. ముందు నువ్వు నీ భర్తను మార్చుకోవడంపై దృష్టిపెట్టు. పోని వేరు కాపురం పెట్టాలన్నా ప్రస్తుతం నీ భర్తకు సరైన సంపాదన లేదు. ఇప్పుడు అతన్ని నమ్మి వేరు ఉంటే నీ కష్టాలు మరీ ఎక్కువవుతాయి'' అన్నారు.
అమ్మగా తోడు నిలబడండి
''వేరు కాపురం పెట్టాలనే ఆలోచన లేదండీ. సంతోష్‌ని మార్చుకోవాలనే మీ దగ్గరకు వచ్చాను. కానీ ఆ ఇంట్లో నాకు సపోర్ట్‌ చేసేవాళ్ళు లేరు. ఆయనకు ఏమైనా చెబుతుంటే అడ్డుపడుతుంటారు'' అని స్వప్న కన్నీళ్ళు పెట్టుకుంది. లీగల్‌ సెల్‌ సభ్యులు సంతోష్‌ తల్లిని పిలిచి ''మీ అబ్బాయి గురించి మీకు బాగా తెలుసు. అబద్దాలు చెప్పి పెండ్లి చేశారు. అయినా స్వప్న భరిస్తుంది. భర్తతోనే ఉండాలని కోరుకుంటుంది. అమ్మానాన్నలు లేని ఆమెకు మీరు సపోర్ట్‌ చేయాలి. మీ కొడుకును మార్చుకోవాలి. పని చేసేలా చూడాలి. బాధ్యతలు నేర్పించాలి. అతను చాలా అమాయకంగా ఉన్నాడు. ఇలాంటప్పుడు మీరు స్వప్నకు ఓ తల్లిగా మారి తోడుగా నిలబడాలి. కానీ మీరు ఆమె ప్రయత్నాలకు అడ్డుపడితే ఎలా? మీ కొడుకు జీవితం నాశనం అయిపోతుంది. ఏం చేస్తారో మీరే ఆలోచించుకోండి'' అన్నారు.
మీ కొడుకును మార్చుకోండి
''ఆ అమ్మాయికి నేనంటే అస్సలు లెక్కలేదు. అత్త అనే మర్యాద లేకుండా కుర్చీలో అలాగే కూర్చుంటుంది. ప్రతి చిన్న గొడవకు అన్న దగ్గరకు పరిగెత్తుతుంది'' అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ''మేమేం చెబుతున్నాం.. మీరేం చెబుతున్నారు. అబద్దాలు చెప్పి పెండ్లి చేశారన్న కోపం, బాధ మీ కోడలిలో ఉన్నాయి. పైగా భర్తకు ఏమీ తెలియదు. దాంతో స్వప్న మీతో అలా ఉంటుంది. మేం ఆమెతో మాట్లాడతాం. మీరవేమీ పట్టించుకోకుండా స్వప్నకు తోడుగా ఉండి మీ కొడుకును మార్చే ప్రయత్నం చేయండి'' అన్నారు.
బాధ్యతగా ఉండాలి
దానికి ఆమె అంగీకరించింది. స్వప్నతో ''ఇప్పుడు నీకు తోడుగా మేముంటాం. నీకు ఎలాంటి సహకారం కావాలన్నా చేస్తాం. మా దగ్గరకు నువ్వు ఎప్పుడైనా రావొచ్చు. ధైర్యంగా ఉండు. నీ భర్తకు కొన్ని వారాల పాటు కౌన్సిలింగ్‌ ఇద్దాం'' అన్నారు. స్వప్న కూడా అంగీకరించింది. సంతోష్‌తో మాట్లాడుతూ ''ఆడపిల్ల పుట్టిందని ఎత్తుకోనన్నావంట. అది మంచి పద్ధతి కాదు. స్వప్నకు తోడుగా మేమున్నాము. ఇకపై నువ్వు బాధ్యతగా ఉండాలి. ప్రతి రోజూ నువ్వు పనిలోకి పోవాలి. ఇంటి ఖర్చులకు ఐదు వేలు ఇవ్వాలి, నీ భార్యకు కూడా ఖర్చుల కోసం కొంత ఇవ్వాలి, బయటకు వెళ్ళినపుడు స్వప్నకు అప్పుడప్పుడు ఫోన్‌ చేసి మాట్లాడాలి. నాలుగు వారాలపాటు ప్రతి వారం మా కౌన్సెలింగ్‌ సెంటర్‌కు రావాలి'' అన్నారు.
చెప్పిన ప్రకారం చేయడానికి అతను ఒప్పుకున్నాడు. సంతోష్‌ బావ కూడా అన్ని రకాలుగా సపోర్ట్‌ చేస్తానని చెప్పాడు. దాంతో స్వప్న పాపను తీసుకుని ఐద్వా లీగల్‌సెల్‌ నుండే భర్తతో కలిసి అత్తగారింటికి వెళ్ళింది.

- సలీమ

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎంపికలో జాగ్రత్తలు అవసరం
సడన్‌ గా మానేస్తున్నారా..?
నిమ్మ ఆకులతో...
పోల్చితే భరించలేను
మాట వినడం లేదా..?
అదే పనిగా చూస్తుంటే
వాడేసిన వాటితోనే వైభవంగా
టీనేజర్లకు అత్యంత ప్రమాదం
క్యాప్సికంతో స్పై‌సీగా రుచిగా
వ్యాయామం చేయాల్సిందే
నల్లని జుట్టు కోసం...
వివక్షను తరిమికొట్టేందుకు
ముద్దులొలికే బుజ్జాయిలకు
ఇలా ఉంటే మారాల్సిందే...
పెరుగు తింటే చాలు
సాఫీగా సాగిపోవాలంటే..?
చర్మ సంరక్షణకు...
ఇలా శుభ్రం చేయండి
ఉదయాన్నే వీటిని తినొద్దు
యువ చైతన్య 'దిశ'
మాట విన్నాడు బాగుపడ్డాడు
ఇంటి నుండే పనిచేస్తున్నారా?
పాత వస్తువులతో పసందుగా
ఆరోగ్యం మీ సొంతం కావాలంటే..?
రాగులతో రుచికరంగా...
ఓ కప్పు చాలు
మీ చర్మతత్వాన్ని బట్టి...
స్త్రీల జీవితాలు ప్రపంచానికి తెలియాలి
కండ్లు చెదరగొట్టే కాటన్‌
పాలిచ్చే తల్లుల కోసం...

తాజా వార్తలు

01:10 PM

టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకుంటేనే సంక్షేమ పథకాలు.. ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

12:59 PM

విద్యావ్యవస్థలో మార్పులు రావాలి : రాహుల్ గాంధీ

12:48 PM

జగిత్యాల జిల్లాలో కారు ఢీకొని బాలుడు మృతి

12:40 PM

ముగిసిన రామమందిరం విరాళాల సేకరణ..రూ.2వేల కోట్లు వసూలు

12:29 PM

అప్పు తీర్చలేదని స్నేహితుడిపై కత్తితో దాడి

12:20 PM

గెలిచే టీడీపీ అభ్యర్థులను.. జగన్ పార్టీలో చేర్చుకుంటున్నారు: లోకేశ్

12:08 PM

కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనల్లుడు దారుణ హత్య..

11:53 AM

సినీ ఫక్కీలో దొంగలను పట్టుకున్న పోలీసులు..

11:43 AM

మా కూటమిలో ఎవరు చేరినా సీఎం అభ్యర్థిని నేనే: కమల్ హాసన్

11:29 AM

మార్చి 4న దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం

11:19 AM

చిన్నారికి అరుదైన వ్యాధి.. టీకా ఖరీదు రూ.16కోట్లు..

11:08 AM

ఉక్రెయిన్​ రెజ్లింగ్​ టోర్నీ ఫైనల్లో వినేశ్​ ఫొగాట్​

10:57 AM

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్​ఎల్వీ సీ-51..

10:50 AM

షాద్ నగర్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

10:41 AM

తెలంగాణలో కొత్తగా మరో 176 పాజిటివ్ కేసులు

10:09 AM

దేశంలో కొత్తగా మరో 16వేల పాజిటివ్ కేసులు

09:56 AM

రాంగ్ రూట్‌లో వెళ్లాడు.. బస్సు ఢీకొని వ్యక్తి మృతి..

09:41 AM

తరుణ్‌ బజాజ్‌కు ఆర్థిక వ్యవహారాల బాధ్యతలు

09:33 AM

అమెరికాలో భూకంపం..

09:24 AM

స్ట్రాంజా స్మారక బాక్సింగ్​ టోర్నీలో దీపక్​కు రజతం

09:16 AM

రామగుండం ఎరువుల పరిశ్రమలో ట్రయల్‌రన్‌

09:03 AM

వాటర్ ట్యాంక్ ఎక్కి మహిళ హల్ చల్..

08:51 AM

విదేశాల నుంచి వచ్చే వారికి ఉచిత ఆర్టీపీసీఆర్ టెస్టులు..

08:43 AM

నేటి నుంచి పెద్దగట్టు జాతర..

08:29 AM

ప్రియుడిని చంపేందుకు సుపారీగా 'వన్ నైట్ ఆఫర్' ఇచ్చిన యువతి

08:15 AM

పీఎస్‌ఎల్‌వీ-సీ51 కౌంట్​డౌన్​.. నేడు నింగిలోకి రాకెట్

08:05 AM

తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక..

07:52 AM

భారీగా తగ్గిన బంగారం ధర..

07:42 AM

కర్నూలు జిల్లాలో సీతారాముల ఆలయ రాత్రి స్తంభాల ధ్వంసం

07:33 AM

బిర్యానీ ప్రియులకు శుభవార్త.. రూ.60కే బిర్యానీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.