Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
'రైతుబంధు' ఎవ్వరికీ ఎగ్గొట్టం | కరీంనగర్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కరీంనగర్
  • ➲
  • స్టోరి
  • Aug 12,2020

'రైతుబంధు' ఎవ్వరికీ ఎగ్గొట్టం

- పక్కా వ్యూహం, కార్యాచరణతోనే నియంత్రిత సాగు విధానం సక్సెస్‌
- అక్టోబర్‌లోగా ప్యాకేజీ -9 ద్వారా 87,500 ఎకరాలకు సాగునీరు
- రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు
నవతెలంగాణ-సిరిసిల్ల
రైతుబంధును ఎవ్వరికీ ఎగ్గొట్టబోమని రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు తేల్చిచెప్పారు. రైతాంగానికి సాధ్యమైనంత మేర ఎక్కు ప్రయోజం కలిగించాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత సాగు పద్ధతికి శ్రీకారం చుట్టింది చెప్పుకొచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వానాకాలం సాగులో నియంత్రిత పద్ధతి, కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో పురోగతి, భూసేకరణ ప్రగతి తదితర అంశాలపై రైతుబంధు సమితి అధ్యక్షులతో, సంబంధిత అధికారులతో సుధీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పకడ్బందీ వ్యూహం, కార్యాచరతో ముందుకు సాగితేనే నియంత్రిత సాగు విధానంలో రాష్ట్రం ప్రపంచానికి నమూనాగా నిలుస్తుంద్నారు. రైతు బంధు అందరికీ ఇవ్వాలన్న ఉద్దేశంతో గతంలో 12 వేల కోట్ల రూపాయలను కేటాయించగా ప్రస్తుత సంవత్సరం 14 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందన్నారు. రైతుబంధు సాయంతోపాటు విద్యుత్‌, సాగునీరు, విత్తనాలు, ఎరువులు.. ఇలా అన్ని ప్రభుత్వమే రైతులకు సమకూర్చు తుందన్నారు. వానకాలం సాగుకు సంబంధించి ప్రతి గ్రామంలో గ్రామ పంచాయితీ లో రైతు వారీగా సాగుచేసిన పంట వివరాలు ప్రదర్శించాలన్నారు.
నియంత్రిత విధానంలో ప్రభుత్వం సూచించిన పంటలను సాగు చేసిన ప్రతి రైతుకు రైతు బంధు అందిస్తామని మంత్రి తెలిపారు. పండ్ల తోటల పెంపకం, కాయగూరలు సాగు చేసే రైతులు, విత్తనాలను ఉత్పత్తి చేసే రైతులకు రైతుబంధు ఇస్తామని మంత్రి తెలిపారు. ప్రతి రైతుకు గతంలో మాదిరి రైతుబంధు రైతుబంధు సమితి సభ్యులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని మంత్రి తెలిపారు.వానాకాలం పంటకు సంబంధించి రైతుబంధు సమితి సభ్యులు, వ్యవసాయ అధికారులు అన్ని విధాలుగా సర్వసన్నద్ధంగా ఉండాలని మంత్రి సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 21 చోట్ల కేసీఆర్‌ ప్రగతి ప్రాంగణాలు పూర్తి చేయగా మిగతా గ్రామాలలో వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని తెలిపారు. వీటిని రైతు వేదికలకు అనుసంధానంగా చేసుకుంటూ మరింత సౌకర్యంగా తీర్చిదిద్దాలని మంత్రి అధికారులకు సూచించారు. అలాగే జిల్లాలో సాగునీటి సౌకర్యం మెరుగు పడడంతో ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో కళ్లాల ఇబ్బంది లేకుండా చూసేందుకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులు తమ వ్యవసాయ క్షేత్రంలో కల్లాలను నిర్మించుకునేలా చూడాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి శ్రీకౌటిల్యరెడ్డిని మంత్రి ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా సాగునీటి ఫీడర్‌ చానల్స్‌ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. అక్టోబ ర్‌లోగా ప్యాకేజీ -9 ద్వారా 87,500 ఎకరాలకు సాగునీరు అందించేలా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
వంతెనలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌
ముస్తాబాద్‌: మండలంలోని తెర్లుమదిద, కొండాపూర్‌, ముస్తాబాద్‌, పోతుగల్‌ గ్రామాల వద్ద ఏర్పాటు చేసిన నూతన వంతెనను మంగళవారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ బ్రిడ్జిలను ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు రెండు గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం అయ్యాయన్నారు. గతంలో ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి రావడం చాలా కష్టతరంగా ఉండేదని తెలిపారు. 9 కోట్ల 25 లక్షల రూపాయల వ్యయంతో కొండాపూర్‌ -నారాయణపూర్‌ గ్రామాల మధ్య నిర్మించిన వంతెనను, 2 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో తంగల్లపల్లి మండలం భరత్‌ నగర్‌లో నిర్మించిన వంతెనను, 7 కోట్ల 70 లక్షల రూపాయల వ్యయంతో పోత్గల్‌ -గండి లచ్చపేట గ్రామాల మధ్య నిర్మించిన వంతెనను, 2 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో ముస్తాబాద్‌ మండలం తెర్లుమద్దినిర్మించిన వంతెనను, కోటీ 40 లక్షల రూపాయల వ్యయంతో ముస్తాబాద్‌ మండలం హనుమానగర్‌లో నిర్మించిన వంతెన తో పాటు 30 లక్షల రూపా యలతో ఏర్పాటు చేసిన సెస్‌ కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన వెంట కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, ఆర్డీవో శ్రీనివాస్‌, ఆయా గ్రామాల సర్పంచులు కిషన్‌ రావు, సుమతి, గౌతం రావుతో పాటు ఎంపీపీ శరత్‌ రావు, జెడ్పీటీసీ నరస య్య, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గోపాల్‌ రావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆది మల్లేష్‌, సెస్‌ డైరెక్టర్‌ విజయ రామారావు, సహకార సంఘం చైర్మన్‌ లు బాపు రావు, రాజేందర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు సురేందర్‌రావు తదితరులు ఉన్నారు.
టీఆర్‌ఎస్‌ కార్యకర్త బాబు కుటుంబ సభ్యులకు కేటీఆర్‌ పరామర్శ
ఎల్లారెడ్డిపేట : మండలం బండలింగంపల్లి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ క్రీయశీలక కార్యకర్త కుంట బాబు ఇటీవల గుండె పోటుతో మరణించగా మంగళవారం రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌ కుంట బాబు ఇంటికి వెళ్లి బాబు భార్య మంజులను, బాబు సోదరుడు శ్రీనును పరమర్శిం చారు. బాబు కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్నీ విధాలుగా ఆదుకుంటామని, మంజులకు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం, బాబు కుమారులు యశ్వంత్‌, జశ్వంత్‌, కూతురు శ్రీమణ్యల పేరిటా బ్యాంకులో ఖాత తెరిచి టిఆర్‌ఎస్‌ పార్టీ ఫండ్‌ జమ చేస్తామని, డబుల్‌ బెడ్‌ రూం ఇప్పిస్తామని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. ఆయన వెంట జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు అరుణ, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తోట ఆగయ్య, జెడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, ఎంపీపీ పిల్లి రేణుక కిషన్‌, సెస్‌ డైరెక్టర్‌ కుంబాల మల్లారెడ్డి, సర్పంచ్‌ కొత్తపల్లి వాణి, ఎంపీటీసీ పద్మ దేవయ్య, నర్సాగౌడ్‌, టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

09:47 PM

సింగరేణి ఓపెన్ కాస్ట్ లో ప్రభాస్ 'సలార్'

09:28 PM

హైదరాబాద్ లో విషాదం..

09:20 PM

31లోగా పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేయాలి : సీఎస్‌

08:56 PM

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్ మృతి

08:46 PM

ఉద్యోగుల ఆశల మీద పీఆర్సీ రిపోర్ట్ నీళ్లు చల్లింది : రేవంత్

08:29 PM

సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్..

08:26 PM

వాటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలి: ఉద్ధవ్ థాక్రే

08:16 PM

వన్డే ర్యాకింగ్స్.. కోహ్లీ @1, రోహిత్ @2..

08:09 PM

యాద్రాద్రి అభివృద్ధి పనులపై మంత్రి ప్రశాంత్ అసంతృప్తి..

08:03 PM

ఎర్రకోటను ముట్టడించిన వారంతా ఉగ్రవాదులే : బీసీ పాటిల్

08:00 PM

ఉగ్రవాదుల గ్రనైడ్ దాడిలో జవాను మృతి

07:57 PM

వైల్డ్‌లైఫ్‌ వార్డెన్లుగా సర్పంచ్‌లు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

07:53 PM

దేశంలో 23లక్షలు దాటిన టీకా లబ్ధిదారుల సంఖ్య..

07:38 PM

ముళ్ల పొదల్లో కాలిపోయిన మృతదేహం లభ్యం..

07:36 PM

దారుణం..పసికందును పీక్కుతున్న​ కుక్క

07:28 PM

క్వారంటైన్​ నిబంధనల ఉల్లంఘనకు రూ.25లక్షల జరిమానా..

07:18 PM

ఉద్యోగులతో పాటు పోరాటం చేసేందుకు కాంగ్రెస్​ సిద్ధం..

07:17 PM

ఘనంగా టీవీ యాంకర్‌ పెళ్లి

07:03 PM

మార్కెట్‌లో రైతులు, వ్యాపారులతో ముచ్చటించిన కేసీఆర్

06:58 PM

ఎన్నికలు సజావుగా జరిగేలా చూడండి : ఎస్‌ఈసీ ఆదేశం

06:55 PM

చెకప్‌ కోసమే గంగూలీ ఆస్పత్రికి వచ్చారు: అపోలో

06:43 PM

సాగు చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోండి : రాహుల్

06:30 PM

ఈ వెబ్‌సైట్ లలో ఏమీ కొనోద్దు.. పోలీసుల ప్రకటన

06:26 PM

హరీశ్ రావును కలిసిన తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం

06:14 PM

రైతులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నం : తమ్మినేని

06:12 PM

జీహెచ్ఎసీలో బీజేపీ కార్పోరేటర్ పై కేసు నమోదు..

06:05 PM

మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు : తలసాని

06:02 PM

ఏపీలో 111 కొత్త కేసులు

05:59 PM

విశ్వసనీయతలేని పే-రివిజన్ కమిటీ రిపోర్టు : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

05:50 PM

ప్రాణం పోయినా కదిలేది లేదు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.