Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లగొండ: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో పెద్దగట్టు ( లింగమంతుల స్వామి) జాతర దృష్ట్యా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు రేపు, ఎల్లుండి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన సూర్యాపేటలోని పెద్దగట్టు లింగమంతులస్వామి జాతర ఈరోజు అర్థరాత్రి ప్రారంభం కానుంది. రెండేళ్లకోసారి వచ్చే ఈ జాతర నేటి నుంచి ఐదు రోజులపాటు కొనసాగనుంది. దేవరపెట్టె దురాజ్పల్లికి రావడంతో వేడుకలు ప్రారంభమవుతాయి.