Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్ట్ సిరీస్ను కైవసం చేసుకున్న భారత్ ఫిబ్రవరి 5 నుంచి ఇంగ్లండ్ జట్టుతో తలపడబోతోంది. ఇంగ్లండ్తో జరగనున్న నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు గానూ తొలి రెండు టెస్ట్ మ్యాచ్లకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలో జరగనున్న ఈ టెస్ట్ మ్యాచ్ల్లో హార్థిక్ పాండ్యా, అశ్విన్, బూమ్రా మళ్లీ జట్టులోకి రానున్నారు.
ఇంగ్లండ్తో తొలి రెండు టెస్ట్లకు బీసీసీఐ ప్రకటించిన జట్టు వివరాలివి
టీమిండియా: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, మయాంక్ అగర్వాల్, పుజారా, రహానే, పంత్, సాహా, పాండ్యా, కేఎల్ రాహుల్, బూమ్రా, ఇషాంత్, సిరాజ్, శార్దూల్ ఠాకూర్, అశ్విన్, కుల్దీప్, అక్సర్ పటేల్, వాషింగ్టన్ సుందర్
గాయాల కారణంగా జట్టుకు దూరమైన హనుమ విహారి, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీని ఇంగ్లండ్తో జరగనున్న రెండు టెస్ట్లకు బీసీసీఐ పక్కన పెట్టింది.