Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పాకిస్థాన్ పంజాబ్ రాష్ట్రంలో సోమవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కలాకతాయ్-నరాంగ్ మండీ రోడ్డు మార్గంలో బస్సు, వ్యాను ఢీ కొన్నాయి. దీంతో వ్యానులోని సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 13 మంది సజీవ దహనమయ్యారు. 17 మందికి గాయాలయ్యాయి. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న సయాయక సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి ఉస్మాన్ బజ్దార్ విచారం వ్యక్తం చేశారు.