Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మియాపూర్ లో ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్ నగర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని స్రవంతి(26) ఆత్మహత్య చేసుకుంది. భర్త రవి కిరణ్, స్రవంతిలు ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. తమ ఇద్దరు పిల్లలతో గత కొంత కాలంగా మియాపూర్ లోని గోపాల్ నగర్ లో నివాసం ఉంటున్నారు. భార్య భర్తల మధ్య గొడవ నేపథ్యంలో ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని స్రవంతి ఆత్మహత్యకు పాల్పడినట్టు చెబుతున్నారు. స్రవంతి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.