Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భార్యకు విలాసవంతమైన జీవితాన్ని అందించటం కోసం దొంగగా మారాడు ఓ భర్త. బైకులు దొంగతనాలు చేస్తూ చివరకు జైలు పాలయ్యాడు. ఈ సంఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. భావ్నగర్ జిల్లా జలియ గ్రామానికి చెందిన బల్వంత్ చౌహాన్ వజ్రాలకు మెరుగులుదిద్దే పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడి భార్యకు వారి సాధారణ జీవితం నచ్చలేదు. దీంతో ఆమె పోరు భరించలేక బైకుల దొంగతనాలు మొదలుపెట్టాడు. 2017లో మొదటిసారి బైకు దొంగతనం చేశాడు. అనంతరం 2019లో నాలుగు.. 2020లో ఏకంగా 25 బైకుల్ని దొంగిలించాడు. ఆదివారం బైకు దొంగతనం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.