Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. జిల్లాలోని సదాశివనగర్ మండలం, లింగంపల్లిలో వ్యవసాయ పొలాల దగ్గర రైతులకు చిరుత కనపడింది. దీంతో రైతులు భయంతో పొలాల వద్దనే నిలిచిపోయారు.అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు. చిరుతను బంధించడానికి బోన్లు ఏర్పాటు చేశారు.