Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తొండి వాదనలు | సంపాదకీయం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సంపాదకీయం
  • ➲
  • స్టోరి
  • Nov 14,2019

తొండి వాదనలు

ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ కొనసాగిస్తున్నది. ముఖ్యమంత్రి మంకుపట్టు వీడలేదు. హైకోర్టు సూచనలేవీ ఖాతరు చేయటం లేదు. సమస్యల పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేద్దామన్న హైకోర్టు తాజా సూచన కూడా రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. యూనియన్ల జేఏసీ మాత్రం తమ ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసిన వారి స్థాయి కమిటీ ద్వారా ఈ సమస్యలు పరిష్కారం కాజాలవనటం అర్థరహితం. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం అలాంటి కమిటీ వేసే అవకాశం కూడా లేదనటం నిజం కాదు. ఆ చట్టంలోని సెక్షన్‌ 10(ఎ) ప్రకారం యూనియన్లు, యాజమాన్యం అంగీకరిస్తే మధ్యవర్తి పరిష్కారానికి అప్పగించవచ్చు. ఇప్పుడు హైకోర్టు సూచించిన 'సుప్రీం' రిటైర్డ్‌ న్యాయమూర్తులతో కూడిన త్రిసభ్య కమిటీ అలాంటిదే కదా! పైగా ఆషామాషీ వ్యక్తులతో కాదు. అత్యున్నత స్థాయి న్యాయ కోవిదులతో మధ్యవర్తిత్వాన్ని కూడా తిరస్కరించటమంటే పాలకుల తొండి వైఖరి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
కార్మికశాఖ ఆధ్వర్యంలో చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని కూడా ప్రభుత్వం చెప్పటం ఆశ్చర్యకరం, హాస్యాస్పదం. కార్మికశాఖ అధికారులు అంత బాధ్యతగా వ్యవహరిస్తే సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత 34రోజులు ఎందుకు చర్చలకు పిలవలేదు? నిద్రపోయారా? కానే కాదు.. జరుగుతున్న పరిణామాల క్రమం గమనించిన వారెవరికైనా అసలు విషయం అర్థం కాక మానదు. పరిష్కరించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే కార్మికశాఖ ఆ పనికి ఉపక్రమిస్తుంది కదా! ఆ 34రోజులు ఆర్టీసీ సమ్మె నోటీసును మించిన ప్రాధాన్యత గల అంశాలేవీ కార్మికశాఖ ముందులేవు. అయినా సమ్మె పరిస్థితి రాకుండా సయోధ్య కుదిర్చే ప్రయత్నాలూ చేయలేదు. కేవలం సమ్మెకు ఒక రోజు ముందు చర్చలకు పిలిచి, చర్చలు ప్రారంభమైనట్టు తంతు నడిపారు. ఇక్కడ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నమే జరగలేదు కదా! పైగా ప్రభుత్వం మరో ప్రమాదకర వాదన వినిపించింది. ప్రజోపయోగ సర్వీసులన్నీ ఎస్మా కిందికి వస్తాయని కొత్త భాష్యం చెప్పింది. ఇది నిరంకుశ ధోరణి. ఈ వాదన చేయటమంటే ఆర్టీసీ కార్మికులకు శాశ్వతంగా సమ్మె హక్కులేదని చెప్పటమే. ఈ వాదనను అంగీకరిస్తే ఇక ప్రజోపయోగ సర్వీసులు కానివిగా ఎన్ని మిగులుతాయి? ఇది రాష్ట్రంలో సమ్మె హక్కుమీదనే దాడి. ఇది కేవలం ఆర్టీసీ కార్మికులకు మాత్రమే సంబంధించిన విషయం కాజాలదు. పైగా పారిశ్రామిక వివాదాల చట్టం పరిధిలోకి వచ్చే ఆర్టీసీ కార్మికులకే సమ్మె హక్కు నిరాకరిస్తే ఇక రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల హక్కుల సంగతేమిటన్న ప్రశ్న ముందుకొస్తోంది.
పారిశ్రామిక వివాదాల చట్టం ఆధారంగా ఆదేశాలివ్వాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది. మంచిదే! కానీ ఆ చట్టాన్నే ముఖ్యమంత్రీ, రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నారు. చట్టాన్ని ప్రభుత్వం పాటించదు కానీ కార్మికులు పాటించాలంటున్నారు. ఈ చట్టం ప్రకారం గుర్తింపు సంఘంతో యాజమాన్యం చర్చించి తీరాలి. చర్చలకు నిరాకరించటం చట్టాన్ని ఉల్లంఘించటమే. అది కార్మిక వ్యతిరేక చర్య. అయినా ముఖ్యమంత్రి చర్చలకు మొండిగా నిరాకరిస్తున్నారు. ఒక పథకం ప్రకారం కార్మికులను సమ్మెలోకి నెట్టి తన ప్రయివేటీకరణ ప్రణాళికను అమలు చేస్తున్నారు. సమ్మె ప్రారంభించగానే యాభైవేల మంది కార్మికుల ఉద్యోగాలు తొలగిస్తున్నామని ప్రకటించారు. తొలగించే అధికారం ముఖ్యమంత్రికి, పారిశ్రామిక వివాదాల చట్టంలో ఏ క్లాజు ప్రకారం ఉన్నదో చెప్పజాలరు. మరుసటి రోజు మరో తప్పు చేసారు. కార్మికులు సమ్మెలో చేరటం ద్వారా సెల్ఫ్‌ డిస్మిస్‌ అయ్యారన్నారు. కనీసం ఇదైనా చట్టంలో ఎక్కడున్నదో చెప్పలేదు. ఐడీ చట్టమే కాదు, మరే కార్మిక చట్టంలోనైనా ఉన్నదేమో చెప్పజాలరు. ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉన్న నేత ఇంత బాధ్యతారహిత ప్రకటనలు చేయడాన్ని ఏమనుకోవాలి. అంతే కాదు, చర్చలకు నిరాకరించటం ద్వారా ఇతర ప్రయివేటు పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి ఏమి సందేశం ఇవ్వదలిచారో అర్థం కాదు. పారిశ్రామిక అశాంతిని నివారించి, ఉత్పత్తిని పెంచడానికే, సేవలు నిరంతరం అందించడం కోసం పుట్టిందే పారిశ్రామిక వివాదాల చట్టం. ద్వైపాక్షిక చర్చలూ, త్రైపాక్షిక చర్చలూ, మధ్యవర్తి పరిష్కారాలన్నీ ఇందుకోసమే కదా! ఆ చట్టాన్నే సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఖాతరు చేయకపోతే ఇక ప్రయివేటు యాజమాన్యాలు ఖాతరు చేయవు కదా! ఇది అంతిమంగా పారిశ్రామిక అశాంతి పెరగడానికే దారి తీస్తుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
చట్టపరమైన మార్గాలన్నీ తోసిపుచ్చుతున్నారు. న్యాయస్థానం సూచనలూ నిరాకరిస్తున్నారు. తప్పుడు లెక్కలతో కోర్టునే పక్కదారులు పట్టించే ప్రయత్నం చేసి అభాసుపాలయ్యారు. సమ్మె హక్కులేదని చెప్పడానికి కాలం చెల్లిన జీవోలూ, టీఎస్‌ ఆర్టీసీకి వర్తించని ఆదేశాలూ చూపించేందుకు ప్రయత్నించారు. కోర్టు తిరస్కరించటంతో తెల్లముఖం వేసారు. ఇంత జరిగినా ఆర్టీసీ కార్మికులను శత్రువులుగానే పరిగణిస్తున్నారు. శత్రుపూరితంగానే వ్యవహరిస్తున్నారు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వం చేయవల్సిన పనికాదు. ఇకనైనా చర్చల ద్వారా పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధపడాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పౌరహక్కుల పాతర!
అబద్ధాలతో యుద్ధనేరాలు
అవకాశవాదం
ఉల్లి పోటు
మతాధారిత పౌరసత్వం!
క్రియాశీలత
ముగింపు ఎక్కడీ
బూటకపు విచారణ
నిర్లక్ష్యం
ఆర్థికం కుదేలు
ఏది నిజం?
భద్రత పోరు
విద్వేష సన్యాసి
ఐక్యపోరాట విజయం
ట్రంప్‌ అభిశంసనలో ఉక్రెయిన్‌ పాత్ర
బాండ్ల గుట్టు
'మహా'నాటకం
అనురాగం...
ఎన్‌ఆరీసీ ఎందుకు?
అస్సాంజేపై విచారణ నిలిపివేత
పోరాటమే మార్గం
జేఎన్‌యూ పోరాటం
ప్రజలు-పార్లమెంటు
గాలికి వర్గముంది
పాలన మారాలి
బొలీవియా సైనిక తిరుగుబాటు
దోచిపెట్టడమే..
'మహా' మలుపులు
అయోధ్య
ముసుగు తొలగింది

తాజా వార్తలు

01:25 PM

మీ లీడరును దెయ్యమై పట్టుకోవడానికి వస్తున్నా: వర్మ

01:08 PM

దోమలగూడలో 20కిలోల ఉల్లిగడ్డలు చోరీ

01:05 PM

విద్యుత్‌ పొదుపుపై అవగాహన కల్పించాలి: శ్రీరంగారావు

01:03 PM

దేశ ఆర్థిక స్థితిని నాశనం చేసిన మోడీ : ప్రియాంక గాంధీ

01:02 PM

అందుకే మా తండ్రిని అరెస్టు చేశారు: హర్షకుమార్ తనయులు

12:59 PM

సమత లైంగికదాడి కేసులో చార్జిషీటు

12:58 PM

భారత్ బచావో కార్యక్రమంలో పాల్గొన్న సోనియా

12:52 PM

దంత వైద్యులు గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టాలి : ఈటల

12:51 PM

వైసీపీ ప్రభుత్వంపై సోమిరెడ్డి ఫైర్

12:44 PM

విండోస్ 10లో కొత్త ఫీచర్..

12:32 PM

సీఎం నితీశ్‌కుమార్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ

12:27 PM

రానాకు బ‌ర్త్‌డే విషెస్ తెలిపిన మ‌హేష్ బాబు

12:18 PM

హైదరాబాద్ వ్యభిచార ముఠా కీలక సూత్రధారి అరెస్టు

12:16 PM

డబ్బు వసూలు చేస్తున్న పోలీసులను పట్టుకున్న మంత్రి

12:15 PM

జిజిహెచ్‌వద్ద ఉద్రిక్తత

12:08 PM

ప్రధాని మోడీపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

12:04 PM

ఏపీ ప్రత్యేక హోదాను పక్కన పెట్టేశారు: కనకమేడల

11:56 AM

సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

11:53 AM

సోషల్ మీడియాలో నకిలీ వార్తల పట్ల జాగ్రత్త : భారత ఆర్మీ

11:48 AM

హస్టల్‌లో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

11:46 AM

2022 నాటికి నూతన పార్లమెంట్ భవనం : స్పీకర్‌ బిర్లా

11:44 AM

తెలంగాణ డెంటల్‌ కాన్ఫరెన్స్‌ను ప్రారంభించిన ఈటల

11:34 AM

బాలికపై అత్యాచారం

11:33 AM

రేపు 'విద్యుత్' ఉద్యోగాలకు రాత పరీక్షలు

11:31 AM

ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్

11:30 AM

ఆటో బోల్తా.. 14 మంది వృద్ధులకు గాయాలు

11:29 AM

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం

11:20 AM

21న 'కేజీఎఫ్‌2' ఫ‌స్ట్ లుక్ విడుదల

11:14 AM

దిశ శరీరంలో ఆల్కహాల్.. ఫోరెన్సిక్ నిపుణులు

11:12 AM

భార్యను నరికి చంపిన భర్త

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.