Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అచ్చమైన కవి | దర్వాజ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దర్వాజ
  • ➲
  • స్టోరి
  • Feb 08,2021

అచ్చమైన కవి

సిద్దిపేట కవులలో ప్రసిద్ధికెక్కిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒకరు నవ్య సంప్రదాయ కవి శ్రీమాన్‌ వేముగంటి నరసింహాచార్యులు. వీరు నడుస్తున్న పద్యకవిగా తను జీవిస్తున్న కాలంలోనే ప్రఖ్యాతి గడించారు. మరో విఖ్యాత కవి నందిని సిద్ధారెడ్డి గారు. వీరువురితో నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది. కవి సమ్మేళనాల్లో కలసి కవిత్వం చదివాను. ఇలా ఇద్దరు ప్రతిభావంతులైన కవులు పుట్టిన నేల మీద కలం పట్టిన వాడు మా సిద్దెంకి యాదగిరి. తెలంగాణ కవితాఝరి.
నిబద్ద కవులు ఆర్తితో జీవిస్తారే తప్ప కీర్తి కోసం కక్కుర్తిపడరు. ఇది సుకవుల లక్షణం. అలాంటి నిజాయితీ ఉన్న నిబద్ధ కవి యాదగిరి. ఇది ప్రాచీన కవికైనా ఆధునిక కవికైనా అన్వయిస్తుంది. 'మా తొవ్వ', 'బతుకు పాఠం' ఈ రెండు కవితా సంపుటాల్లో యాదగిరి కవితాత్మ ప్రతిబింబిస్తూ ఉంటుంది.
నాకైతే అతడి అక్షరాల వెనుక అమాయకత్వమే కనిపిస్తుంది. విద్యావంతుడైన యాదగిరి కవితా ప్రస్థానం చిన్నది కాదు. అనుకుంటే ఆకాశమంత. కొల్చుకుంటే భూదేవంత. ఈ వాక్యము సిద్దెంకికే కాదు వేల సంవత్సరాల వేదనలోంచి, అంటరానితనంలోంచి అక్షరాల కవులు గాయకులు కళాకారులు అయిన ప్రతి దళిత జీవికీ మాటలు సరిపోతాయి. కులం లేదని చాలా మంది గొడవ పడతారు కానీ సురవరం వారు రూపొందించిన 'గోలకొండ' కవుల సంచిక అందులోని సంఖ్యలు సరిపోల్చి చూడండి. అసలు నిజం బయట పడుతుంది. ప్రతాప రెడ్డి గారి గణాంకాలు ఈ నాటికీ వర్తిస్తాయి. ఆ కోణంలోంచి చూసినప్పుడు తెలంగాణలో ముఖ్యంగా అతి దళిత మాదిగ కవులకు జరిగిన జరుగుతున్న అన్యాయం ఏమిటో తెలుస్తోంది. ఈ కవులు పోతన లాంటి ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు. పురస్కారాల కోసం పాకులాడరు. ఒకరు గుర్తించినా గుర్తించకపోయినా నిర్భయంగా తమ కవిత్వం తాము సష్టిస్తూ స్వయంభువులుగా ధ్రువతారలుగా నిలిచిపోతారు.
ఇదిగో సిద్దెంకి 'అచ్చు' అటువంటి కవి. ఇది చెప్పేందుకే ఇంత నేపథ్యం చెప్పాల్సివచ్చింది. సిద్దెంకి ఎటువంటి కవి? సిద్దెంకి ప్రశ్నించే కవి.
''ఒకటే దేశం ఒకటే భాష అంటున్నప్పుడు
ఒకటే కులం అని ఎందుకు అనవుతండ్రీ!'' ఈ ప్రశ్నకు జవాబు చెప్తే కుల భారతమే ఉండదు. బాబాసాహెబ్‌ ఆశించిన కులనిర్మూలన సమాజమే సమాధానం కవిత్వం ఇప్పుడు రెండు రకాల భావాలతో వస్తున్న కాలం. ఒకటి మనువాదం. రెండు జనవాదం. లేదా బహుజన వాదం. ప్రసార మాధ్యమాలు పత్రికలు చూస్తున్న వాళ్ళకు ఈ విషయాలు స్పష్టమే. ఎవరు దొంగ నిద్రను నటించనవసరం లేదు. నిజమైన కవి భుజాలు తడుముకోడు. నిర్భయంగా జనంలోంచి మాట్లాడుతాడు.
దళిత కవిత్వంలో మాదిగ కవిత్వం ఆవిర్భవించినప్పటి నుంచి మాదిగ కళాతత్వం, సౌందర్యాత్మక దష్టి ఎంతో వికసించింది. ఈ విద్యకు గుర్రం జాషువా గారిది గురుపీఠం. ఆ కుదరు నుంచే మాదిగ సౌందర్యాత్మకమైన భావుకత విరాజిల్లింది. గద్యంలోను వచన పద్యంలోనూ ఈ చిత్రణ గమనించవచ్చు. గద్యంలోనైతే బోయ జంగయ్య వేముల ఎల్లయ్య, జూపాక సుభద్ర, జాజుల గౌరి, రచనల్లో తేటగా కనబడుతుంది. నాగప్పగారి సుందర్రాజు, ఎజ్రాశాస్త్రి, ఇండ్ల చంద్రశేఖర్‌, చోరగుడి జాన్సన్‌ లాంటి వాళ్లను కూడా ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. కవిత్వ విషయంలో సిద్దెంకి మొదటి నుంచి మాదిగ జీవన సౌందర్యకళను అక్షరబద్ధం చేస్తూనే ఉన్నాడు. ఈ సంపుటిలోని 'సుగంధాల లంద స్వప్నం' ఒక మచ్చుతునక. ఈ 'అచ్చు'వెనక అంటరాని అందమంతా తొణికిసలాడుతూ ఉంటుంది. సిద్దెంకిని కేవలం దళిత కోణంలోంచే చూడకూడదు. ఇతడు ప్రాపంచిక కవి. సంఘటనాత్మక అభివ్యక్తిలో అందెవేసిన చెయ్యి. భావుకవిత్వానికి పటం కట్టిన పట్టభద్రుడు.
సిద్దెంకి తెలంగాణ పజొన్న కంకి. తీరొక్క పువ్వు లాగా ఉంటుంది ఇతడి కవిత్వం. ఎవరికి వాళ్లు ఆస్వాదించి, అనుభవించి, ఆ అనుభూతి పొందాలి గానీ విమర్శకుల మీదో, ముందుమాటల మీద ఆధారపడకూడదు. మంచి కవితా సంపుటి అచ్చులోకి తెచ్చినందుకు అభినందిస్తున్నాను. ఇతడి 'అచ్చు' పని పదిమంది మెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. కడపటి తరం లోంచి పుట్టిన
మొదటి తరం కవి దోషాలను లోపాలను మీ లోపలి కోపాలను పక్కన పెట్టి కవి సిద్దెంకితో కరచాలనం చేయండి. పేరెన్నికగన్న కవిగా ఎదగాలని కోరుకుంటున్నాను. 'అచ్చు' కవితా సంపుటిని తెస్తున్నందుకు తమ్మున్ని తనివితీరా అభినందిస్తున్నాను.

- ప్రొ. ఎండ్లూరి సుధాకర్‌,
8500192771.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రగతిశీల కళాసైనికుడు సఫ్దర్‌ హష్మి
యువతరంగ ప్రస్థానం
చేదెక్కిన జీవితం!
పిల్లి మెడకు గంటకట్టేదెవరు?
నివురు
మహాత్మా...!!
అంబేద్కర్‌
17న 'అంబేద్కర్‌ సూర్యుడు' ఆవిష్కరణ
సాహితీ సోపతి పదేండ్ల ప్రస్థానం
'కేరె జగదీష్‌ గారు వందనాలు'
'నిజం' కవిత్వంలో నియోలాగిజమ్‌
కవితాకాశపు తూరుపు అంచున విరిసిన అక్షర నక్షత్రాల రంగుల హరివిల్లు 'నెయిసెస్‌'
తండ హరీష్‌ గౌడ్‌ కు సాహితి పురస్కారం
'తొలి కిరణాలు''
ఏప్రిల్‌ 11 న 'తెలుగు సాహిత్యంలో అంబేద్కర్‌' సదస్సు
నీ కోసం
బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌
అగ్రహారపు టోపోగ్రఫిని గ్లోరిఫరు చేసిన కథలు
ఆసాంతమూ కథలన్నీ నోటికి అందాకా హృదయం నవ్వుతుంది.
చరిత్ర కావాలి
ఆగమాగం బిజీ బిజీ
రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం
సాహితీ సోపతి పదేండ్ల పండుగ
పీచర్‌ సునీతా రావు అవార్డుల కోసం రచనలకు ఆహ్వానం
'సిలివేరు సాహితీ కళాపీఠం' వారి నాలుగో వార్షికోత్సవం
ద వర్జిన్‌ అండ్‌ ద జిప్సీ (నవల)- ఒక పరిశీలన
తెలంగాణా తెలుగు ప్రాచీనతా నిదర్శనం
సాహితీ వార్తలు
బతుకు పాఠం
మనదీ దేశ ద్రోహమే!

తాజా వార్తలు

09:59 PM

ఓటు వేయకపోతే ప్రజలకే నష్టం: చంద్రబాబు

09:41 PM

కోల్‌కతా లక్ష్యం 153

09:26 PM

పర్యాటక ప్రాంతం రాక్ గార్డెన్ మూసివేత

09:23 PM

రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి 15 రోజుల పాటు 144 సెక్షన్‌తో పాటు.!

09:06 PM

లాక్‌డౌన్‌ పై సృష్టత ఇచ్చిన మహారాష్ట్ర సీఎం

08:56 PM

అద్భుత ఫీచర్లతో రెడ్‌మి గేమింగ్ స్మార్ట్‌ఫోన్

08:49 PM

రేపు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్‌ ఆంక్షలు

08:34 PM

సీఎం కార్యాలయంలో కరోనా కలకలం..ఐసోలేషన్‌లో సీఎం

08:15 PM

నిజామాబాద్‌లో వడగళ్ల వర్షం

08:09 PM

భద్రాద్రి కొత్తగూడెంలో భారీగా గంజాయి పట్టివేత

07:59 PM

కరోనా వాక్సిన్ తీసుకున్న‌వారికి బంపర్ ఆఫర్ ప్రకటించిన బ్యాంక్.!

07:58 PM

నిజామాబాద్‌ జిల్లాలో దంపతుల క్షుద్ర పూజలు

07:13 PM

నల్గొండ ‌లో విద్యావాలంటీర్ శైల‌జ ఆత్మహత్య

07:07 PM

టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా

07:01 PM

కరోనా వైరస్ కంటే ఈ వైరస్ చాలా డేంజర్‌..!

06:35 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

05:56 PM

గజియాబాద్‌లో భారీ అగ్ని‌ప్ర‌మాదం

05:49 PM

ఏపీలో కొత్తగా 4,228 కరోనా కేసులు

05:43 PM

రేపటి నుంచి 30 వరకు లాక్‌డౌన్‌.!

05:30 PM

రాళ్ల దాడి ఘటనపై సీఈసీకి ఫిర్యాదు చేసిన టీడీసీ ఎంపీలు

05:11 PM

ఐపీఎల్‌ చర్రితలో గేల్‌ అరుదైన రికార్డు

05:08 PM

'విరాటపర్వం' నుంచి సాయిపల్లవి ఫెస్టివల్ లుక్

05:02 PM

ఖైరతాబాద్‌లో వ్యభిచారం ముఠా గుట్టు రట్టు

04:53 PM

భర్త మెడపై కాళ్లతో తొక్కి దారుణంగా..!

04:32 PM

ఆర్‌బీఐ కీల‌క ప్ర‌క‌ట‌న‌...బ్యాంకులకు వరుసగా 4రోజుల పాటు సెలవులు

04:19 PM

హైదరాబాద్‌లో బీటెక్‌ విద్యార్థిని దారుణ హత్య

04:01 PM

యస్‌ బ్యాంక్‌కు మరో భారీ షాక్

03:48 PM

కేసీఆర్‌ సభపై ఈసీకి ఉత్తమ్ ఫిర్యాదు

03:43 PM

సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేయండి: కేంద్రాన్ని కోరిన సీఎం

03:35 PM

కోల్‌కతాలో ధర్నాకు దిగిన మమతా బెనర్జీ!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.