Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
6 నెలల్లో రూ.95వేల కోట్ల మోసాలు! | బిజినెస్ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Nov 22,2019

6 నెలల్లో రూ.95వేల కోట్ల మోసాలు!

- ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెరిగిపోతున్న ఫ్రాడ్‌లు
- పీఎస్బీల్లో దాదాపు 5,743 కేసులు వెలుగులోకి
- నిధుల కొరతతో ప్రభుత్వ బ్యాంకులు ఉక్కిరిబిక్కిరి..
- తాజాగా అప్పులు దొరక్క పలు కంపెనీలు దివాలా
- తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఎస్‌ఎంఈ సంస్థలు
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: బ్యాంకింగ్‌ రంగాన్ని బలోపేతం చేసేందుకు సర్కారు అనేక చర్యలు తీసుకుంటోందని.. ఫలితంగా నిరర్థక ఆస్తులు తగ్గి విత్త సంస్థలు వృద్ధి పథంలోకి చేరుతున్నాయంటూ మోడీ సర్కారు చేస్తున్న ప్రకటనలు గాలిమాటలేనని తేలిపోయింది. లెక్కలను విశ్లేషించి చూస్తే తీసుకుంటున్న చర్యలు వాస్తవంగా క్షేత్ర స్థాయిలో పెద్దగా ఫలితాలు ఇవ్వడం లేదని తేలిపోతోంది. ఎందుకంటే గడిచిన ఆరు నెలల కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీలలో) దాదాపు రూ.95,000 కోట్ల మోసాలు వెలుగులోకి వచ్చినట్టు స్వయంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాజ్యసభలో ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య కాలంలో దాదాపు 5,743 మోసం కేసులు జరిగినట్టుగా సర్కారు తెలిపింది. దాదాపు రూ.1000 కోట్లకు పైబడిన మోసాలు దాదాపు నాలుగేండ్ల తరువాత వెలుగులోకి వచ్చినట్టుగా సర్కారు వెల్లడించారు. గడిచిన ఆరు నెలల కాలంలో వెలుగులోకి వచ్చిన మోసాలలో రూ.2500 కోట్ల విలువైన మోసాలు ఇటీవలి కాలంలోనే జరిగినట్టుగా తాము గుర్తించామని భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ) లెక్కలను ఉటంకిస్తూ ఆర్థిక మంత్రి చట్ట సభలో వెల్లడించారు. దీంతో సర్కారు చేపడుతున్న చర్యల వల్ల బ్యాంక్‌ మోసాలు ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదన్న సంగతి తెలిసిపోతోంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు ఆర్థికంగా మరింత బలహీనపడిపోతున్నాయి. అంతకంతకు పెరుగుతున్న మోసాలు, నిరర్థక ఆస్తుల కారణంగా విత్త సంస్థల వద్ద రుణ వితరణకు గాను నగదు అందుబాటులో లేకుండా పోతోంది. బ్యాంకులు తాజాగా రుణాలను అందిం చలేక పోతున్నాయి. రుణ జారీకి అవసరమైన నగదు లేకపోవడం, ఎన్‌పీఏల భయంతో బ్యాంకులు మంచి కంపెనీలకు కూడా రుణాలను ఇచ్చేందుకు వెనుకాడుతున్నాయి. దీంతో ఆర్థిక వ్యవస్థలో అప్పు పుట్టడం కష్టంగా మారుతోంది. ఉన్న కాస్త సొమ్మును కూడా బ్యాంకులు రిస్క్‌ తక్కువగా ఉండే రిటైల్‌ రుణాల వైపుకు మళ్లిస్తున్నారు. దీంతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలకు రుణం లభించడం కష్టంగా మారింది. బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు పెరిగిపోతున్నయాన్న వార్తలతో ప్రజలు డబ్బులను పొదుపు చేసుకొనేందుకు గాను బ్యాంకులకు రావడం తగ్గించేశారు. దీంతో డిపాజిట్లు తగ్గాయి. ప్రస్తుతం బ్యాంకింగ్‌ వ్యవస్థలో దాదాపు 9.5 లక్షల కోట్ల విలువైన సొమ్ము నిరర్థక ఆస్తుల రూపంలో వ్యవస్థలో చిక్కుకొని ఉంది. ఎన్‌పీఏల బెంగతో కొన్ని బ్యాంకుల్లో సర్కారు చెల్లింపులు కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిన్న పరిశ్రమలకు కూడా సరైన సమయంలో ఆర్థిక సాయం అందక ఆయా సంస్థలు మూతపడే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఎస్‌ఎంఈ సంస్థలు తీసుకున్న రుణాలు కూడా ఎన్‌పీఏగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనాన్ని పారదోలేందుకు గాను పీఎస్‌యూ బ్యాంకుల్లో రుణ వితరణలో ఆరోగ్యకరమైన వృద్ధి కనిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. .
కనిపించని ఐబీసీ ఫలితాలు..
బ్యాంకుల్లో ఆందోళనకర స్థాయికి పేరుకుపోతున్న రుణాల రికవరీ విధానాన్ని వేగవంతం చేసి వాటిని ఆర్థికంగా బలోపేతం చేసుందుకు గాను ప్రభుత్వం ఆర్థిక దివాలా స్మృతిని(ఐబీసీ) అమలులోకి తెచ్చింది. అయితే ప్రభుత్వం వెల్లడిస్తున్న గణాంకాలను పరిశీలించి చూస్తే మోడీ సర్కారు అమలులోకి తెచ్చిన ఐబీసీ అనుకున్నస్థాయిలో ఫలితాలివ్వడం లేదని తెలు స్తోంది. ఐబీసీ కింద దేశ వ్యాప్తంగా దాదాపు 2500 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దాదాపు 3-4 ఏండ్ల కఠిన ప్రక్రియ కింద మొత్తం బ్యాంక్‌ మొండి బాకీల్లో 37 శాతం రికవరీలు నమోదయ్యాయి. దేశంలో బ్యాంకులను నిలబెట్టేందుకు గాను తాము చిత్తశుద్ధితో ఉన్నట్టు ప్రభుత్వం చెబుతున్నప్పటీకి.. ఆచరణలో ఇది కనిపించడం లేదు. ఎందుకంటే ప్రభుత్వ రంగంలోని దిగ్గజ విత్త సంస్థలుగా నిలిచే రెండు పెద్ద బ్యాంకుల చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ పదవులు దాదాపు నెల రోజులుగా ఖాళీగా ఉన్నాయి. బాస్‌లు లేకపోవడంతో ఆయా సంస్థలు అభివృద్ధికి తాము ఎలా ముందుకు వెళ్లాలో తెలియక తికమకపడుతున్నాయి. దీనికి తోడు టెలికాం, స్థిరాస్తి, పునరుత్పాదక ఇంధన, రహదారులకు సంబంధించిన రుణాలను జారీ చేసే విత్త సంస్థలు తీవ్రంగా మొండి బాకీల సమస్యను ఎదుర్కొం టున్నాయి. మరోవైపు గృహ నిర్మాణ రంగంలో కొత్త ఎన్‌పీఏ భారం పెరగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో సంక్షోభం పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం మరింత జటిలమవుతాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోడీ సర్కారు మాటలు పక్కనబెట్టి బ్యాంకులను నిలబెట్టేలా నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటే మేలని విశ్లేషకులు చెబుతున్నారు

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బడ్జెట్‌ కసరత్తు షురూ..
టాప్‌-10లోని ఆ ఆరు కంపెనీలదే హవా
ఒక్క ఏడాదిలో కోటిన్నర..
అంపశయ్యపై భారత ఆర్థిక వ్యవస్థ!
బీఎస్‌-4 కార్లపై భారీ డిస్కౌంట్లు..
ఎల్‌జీ గ్రూపు మాజీ చైర్మెన్‌ మృతి
సొంత డెలివరీ వ్యవస్థపై అమెజాన్‌ దృష్టి
ప్రమాదకర దశకు ఆర్థికం!
అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాం : సీఈఏ
పరుగులు పెట్టిన స్టాక్‌ మార్కెట్లు
నవంబర్‌లోనూ కుంగిన ఎగుమతులు..
భారత వృద్ధి రేటుకు మూడీస్‌ కోత
దేశంలో ధరల మంట!
భారీ ప్రీమియంతో ఉజ్జీవన్‌ లిస్టింగ్‌
ఎయిరిండియాను 100 శాతం అమ్మేస్తాం: కేంద్రం
అమ్మకానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆస్తులు..
రెండో రోజూ స్టాక్‌ మార్కెట్లకు లాభాలు..
ఇన్ఫోసిస్‌పై అమెరికాలో దావా..
త్వరలో జీఎస్టీ పన్ను 'పోటు'!
ఆరామ్‌కో లిస్టింగ్‌ అదుర్స్‌!
అదానీ కంపెనీలో క్యూఐఏకి వాటా
పేటీఎం బోర్డు నుంచి శేఖర్‌ శర్మ అవుట్‌!
డూపాంట్‌- ఏజీఎన్‌ఎల్‌ఐ భాగస్వామ్యం
ఈ-యానా నుంచి విద్యుత్‌ రిక్షాలు
హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులు: స్కైవర్త్‌
లెక్క చూపనివి.. రూ.12,000 కోట్లు
అమ్మకాల ఒత్తిడితో నష్టాలు
భారత్‌లో మందగమనం దీర్ఘకాలికం!
స్టీల్‌ డిమాండ్‌కు మాంద్యం దెబ్బ
వాహన విక్రయాల్లో 16% పతనం

తాజా వార్తలు

09:54 PM

భారత్‌పై వెస్టీండీస్‌ గెలుపు

09:43 PM

ఈ ఘటన నన్ను తీవ్రంగా బాధించింది: నారా లోకేష్

09:32 PM

వరంగల్‌లో 200 కిలోల గంజాయి సీజ్

09:17 PM

రెండో వికెట్ కోల్పోయిన వెస్టీండీస్‌

08:55 PM

ఎంబీబీఎస్‌ సీట్ల పేరుతో ఘరానా మోసం

08:48 PM

రూ.100 కోట్లు దాటిన శబరిమల ఆదాయం

08:34 PM

కేఏ పాల్ ఫిర్యాదు.. రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు

08:33 PM

హెట్మెయిర్ సెంచరీ

08:31 PM

ఫిలిప్పీన్స్ భూకంపం ఘటనలో ముగ్గురు దుర్మరణం

08:29 PM

హోప్ హాఫ్ సెంచరీ

08:23 PM

మ్యాచ్‌ మధ్యలో స్టేడియంలోకి కుక్క...

08:12 PM

పర్యాటక కేంద్రంగా రామప్ప చెరువు : పార్ధసారధి

08:06 PM

రైతుని కోటీశ్వరుడిని చేసిన ఉల్లి

07:43 PM

హెట్మెయిర్‌ అర్ధ శతకం

07:41 PM

మినీలారీ బైక్‌ ఢీకొని : ముగ్గురు మృతి

07:29 PM

రేపు ఉన్నావ్‌ తీర్పు వెల్లడించనున్న ఢిల్లీ హైకోర్టు

07:23 PM

పెంచిన విజయ పాల ధరలను ఉపసంహరించుకోవాలి

07:20 PM

బాలీవుడ్‌ నటి అరెస్ట్‌

07:14 PM

ఎంపీ అరవింద్ రాజీనామా చేయాలి: పసుపు రైతులు

07:04 PM

తిరుమలలో కొనసాగుతన్న రద్దు...

06:51 PM

హీరో బషీద్ అరెస్ట్

06:48 PM

రోడ్డుప్రమాదంలో హోం గార్డు మృతి

06:38 PM

తొలి వికెట్ కోల్పోయిన విండీస్

06:32 PM

కలెక్టర్లు, ఎస్పీలకు 17న సీఎం జగన్‌ విందు

06:28 PM

ఢిల్లీలో బస్‌లు దగ్ధం

06:19 PM

మిల్లర్లు ధాన్యం​ కొనుగోలు చేసేలా చర్యలు: కన్నబాబు

06:15 PM

కనీస గౌరవం ఇవ్వటంలేదు: గౌతు శిరీష

05:49 PM

ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి

05:44 PM

విండీస్ టార్గెట్-289

05:33 PM

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి దీక్ష

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.