Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
| అదిలాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • అదిలాబాద్
  • ➲
  • స్టోరి
  • Aug 12,2020

- విత్తన ప్యాకెట్లపై బార్‌కోడ్‌ తప్పనిసరి కాదు
- విత్తన కంపెనీలకు వేసులుబాటు కల్పిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులు
- ఇప్పటికే నకిలీ విత్తనాలతో రైతు కుదేలు
- తాజా నిర్ణయంతో మార్కెట్లోకి రానున్న మరిన్ని నకిలీ విత్తనాలు
- వ్యవసాయ శాఖ నిర్ణయంపై రైతుల మండిపాటు
         విత్తనం మొలకెత్తితేనే పంట పండేది. అందులోనూ మొలకెత్తిన విత్తనం అన్ని రకాల చీడపీడలను తట్టుకొని కాతకాస్తేనే దిగుబడి వచ్చేది. దీనికోసం దశాబ్ద కాలంగా దేశంలో ఎన్నో రకాల విత్తన కంపెనీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. తమ కంపెనీ విత్తనం మొలకెత్తడం గ్యారంటీతో పాటు అధిక దిగుబడి ఇస్తుందని, అన్ని రోగాలను తట్టుకుంటుందని ఇలా ఆకర్షణ పేర్లతో రంగు రంగుల కలర్లతో ప్యాకెట్లను తయారు చేసి అడ్డగోలు ధరలతో మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు. అందులో కొన్ని కంపెనీల విత్తనాలు సరిగ్గా మొలకెత్తక, పంట సరిగ్గా పండక రైతులు నష్టపోతున్నారు. దీన్ని నివారించడానికి కొన్ని రాష్ట్రాలు విత్తనాలు తయారు చేసే కంపెనీల పూర్తి వివరాలు అంటే రకం, దిగుబడి తదితర అంశాలు క్షుణ్ణంగా ఉండేలా బార్‌కోడ్‌(క్యూఆర్‌)తో ముద్రించాలని కేంద్రాన్ని కోరగా, కేంద్రం ఆ దిశగా పోకపోగా విత్తన కంపెనీల ఒత్తిడితో ఎలాంటి క్యూఆర్‌ కోడ్‌ అవసరం లేదని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇక మార్కెట్లోకి నకిలీ విత్తనాలు రాజ్యమేలి రైతులు మరిన్ని నష్టాల బారిన పడే అవకాశం ఉందని రైతు సంఘాలు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నవతెలంగాణ-హాజీపూర్‌
పంట పండాలంటే మేలైన విత్తన రకాలను ఎంచుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు రైతులకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. గతంలో రైతులే వారి పంట నుండే విత్తనాలను కట్టి మళ్లీ విత్తుకునే వారు. రానురాను వ్యవసాయం కొత్త పుంతలు తొక్కడంతో రైతులు మోడ్రన్‌ సాగుకు అలవాటు పడ్డారు. ఇందులో భాగంగానే విత్తన కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. విత్తనాలను తయారు చేసి అధిక ధరలకు రైతులకు అమ్ముతున్నాయి. విత్తనాల ప్యాకెట్లపై సమగ్ర వివరాలను ముద్రించి అమ్మాలి. అవి నాణ్యమైనవే అని రాష్ట్ర విత్తన సంస్థ నుండి ధ్రువీకరణ పత్రం పొందాలి. సదరు కంపెనీ విత్తనాన్ని తయారు చేసే ఏడాది ముందే విత్తన పంట వివరాలను ప్రభుత్వానికి తెలియపర్చాల్సి ఉంటుంది. అప్పుడు అధికారులు విత్తన పంటను పలుమార్లు పరిశీలించి సర్టిఫై చేస్తారు. దాన్ని ప్రయోగశాలలో పరిశీలించి వంద విత్తనాల్లో ఎన్ని మొలకెత్తుతాయో శాతాన్ని నిర్ధారించి లాట్‌ సంఖ్యను కేటాయిస్తారు. కానీ చాలా కంపెనీలు ఇవన్నీ లేకండానే సొంతంగా కంపెనీ సర్టిఫై అని ట్రూత్‌ లేబుల్‌లు వేసి మార్కెట్లో అమ్ముతున్నాయి. ఇందులో చాలా మట్టుకు విత్తనాలు మొలవక మొలిసినా సరైన దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారు.
కేంద్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులతో నకిలీ దందాకు ఊతం
ఉమ్మడి జిల్లాలో సుమారు 8లక్షల ఎకరాల్లో వ్యవసాయం సాగవుతోంది. ఇందులో ప్రధానంగా పత్తి, వరి, మొక్కజొన్న, పెసర, కంది, సోయా, జొన్న, కూరగాయ పంటలున్నాయి. ఈ పంటల సాగు కోసం రైతులు మార్కెట్లో విత్తనాలు కొంటున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే నకిలీ విత్తనాల దందా రాజ్యమేలుతోంది. కోట్లలో విలువజేసే నకిలీ విత్తనాలు పోలీసుల దాడుల్లో పట్టుబడుతున్నాయి. కొన్నేండ్లుగా నకిలీ విత్తనాలతో రైతులు మోసపోతున్న తీరును చూసి కొన్ని రాష్ట్రాలు విత్తన కంపెనీలు కచ్చితంగా తయారీ రకం, దిగుబడి, తయారీ తేదీ, గడువు, ధర ఇలా కచ్చితమైన నిబంధనలతో కూడిన క్యూఆర్‌ కోడ్‌తో విత్తన ప్యాకెట్లు ముద్రించి అమ్మితే ఈ నకిలీల బెడద తగ్గే అవకాశం ఉంటుందని కేంద్రానికి నివేదించాయి. కేంద్రం కూడా ఆవైపు ఆలోచిస్తుదని, 2020 వాన కాలం పంట సమయం వరకు ఈ బార్‌ కోడ్‌ విధానం అమలులోకి వచ్చే అవకాశం ఉందని రైతులు భావించారు. కానీ విత్తన కంపెనీల ఒత్తిడికి తలొగ్గిన కేంద్ర వ్యవసాయ శాఖ రైతులకు అలాంటి విషయాలు చెప్పాల్సిన అవసరం లేదని వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రస్తుత మార్కెట్లో ఉన్న నకిలీ విత్తనాలు కాకుండా ఇక నిబంధనలు లేని కారణంగా మరిన్ని కంపెనీలు పుట్టుకొచ్చి రైతులను ముంచే అవకాశం ఉందని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పేరొందిన కంపెనీలు తయారు చేసిన విత్తనాలే 60శాతానికి మించి మొలకెత్తడం లేదు. ఇక ఇప్పుడు నకిలీల దందా జోరందుకోనుంది. గతంలో నకిలీ విత్తనాల ప్రభావంతో రైతులు వేల ఎకరాల్లో పంట నష్టపోయిన ఘటనలు ఉమ్మడి జిల్లా పరిధిలో జరిగాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంత రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వారికి నకిలీ విత్తనాలు కట్టబెడుతూ సొమ్ముచేసుకుంటున్న కేటుగాళ్లు, ఇప్పుడు కేంద్ర వ్యవసాయ శాఖ నిర్ణయంతో వీరి నకిలీ విత్తనాల దందాకు అదుపు లేకుండా పోయే అవకాశముంది. ఇప్పటికైనా ప్రభుత్వం కచ్చితమైన వివరాలతో ఉండేలా బార్‌కోడ్‌తో విత్తనాల ప్యాకెట్లు తయారు చేసేలా కంపెనీలకు నిబంధనలు విధించాలని రైతులు కోరుతున్నారు.
కేంద్ర వ్యవసాయ శాఖ నిర్ణయంతో రైతు మోసపోకతప్పదు : అత్తె శ్రీనివాస్‌, నంనూర్‌ రైతు సహకార సంఘం, మంచిర్యాల జిల్లా
ఇప్పటికే మార్కెట్లో అమ్ముతున్న విత్తనాల్లో 60శాతం మించి మొలకెత్తడం లేదు. కంపెనీల మోసపూరిత మాటలు నమ్మి పెట్టిన గుడ్డలు మళ్లీ మళ్లీ పెడుతూ రైతులు నష్టపోతున్నారు. దీంతో రైతుపై ఆదిలోనే విత్తన భారం పడుతోంది. ఇక కొన్ని కంపెనీల విత్తనాలైతే అసలే మొలకత్తక, మొలకెత్తినా కాతపూత లేక రైతు పంట మొత్తం మునుగుతున్న ఘనటలు లేకపోలేదు. ప్రస్తుతం మార్కెట్లో ప్రతి వస్తువుకు సంబంధించి క్యూఆర్‌కోడ్‌తో ప్యాకింగ్‌ వస్తుంది కానీ విత్తనాలు ఎందుకు రావడం లేదు. ఇప్పుడు కేంద్ర వ్యవసాయ శాఖ బార్‌కోడ్‌ అవసరం లేదని ప్రకటించడంతో ఇక విత్తన కంపెనీల ఇష్టారాజ్యంతో రైతులు నష్టపోక తప్పదు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

04:51 PM

అన్ని గ్రామాలకు నాబార్డ్​ సేవలు: సీఎస్​

04:41 PM

మంత్రి పెద్దిరెడ్డిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి: వర్ల రామయ్య

04:30 PM

టీమిండియా యువ క్రికెటర్లకు గిఫ్టుగా మహీంద్రా వాహనాలు..

04:20 PM

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి

04:08 PM

లాలూ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఢిల్లీకి తరలింపు

04:00 PM

బీజేపీ ఎంపీ అరవింద్ కు చేదు అనుభవం..

03:45 PM

త్వరలో సీఎంగా కేటీఆర్.. టీఆర్ఎస్ మంత్రుల్లో టెన్షన్..

03:35 PM

ముఖ్యమంత్రిగా డిగ్రీ విద్యార్ధిని..

03:32 PM

బయట మార్కెట్లో కరోనా టీకా కొనుక్కొవాలనుకుంటున్నారా..

03:20 PM

రైతులను అడ్డుకున్న పోలీసులు.. నీటి ఫిరంగుల ప్రయోగం

03:19 PM

టిక్ టాక్ స్టార్ షేక్ రఫీ ఆత్మహత్య

03:16 PM

మే 7 నుండి పదో తరగతి పరీక్షలు..

03:05 PM

ట్రాక్టర్లను అడ్డుకున్న పోలీసులు..మండిపడ్డ రైతులు

02:23 PM

ఐక్యవేదిక నిరాహారదీక్ష భగ్నం..

02:16 PM

లోయలో పడిన జీపు.. ఆరుగురు మృతి

02:04 PM

ఆరు రోజుల్లోనే పది లక్షల మందికి వ్యాక్సిన్​..

01:47 PM

బర్డ్‌ఫ్లూ కలకలం.. ఐదు నెమళ్లు మృతి

01:33 PM

వైసీపీ పతనానికి పంచాయతీ ఎన్నికలే నాంది కావాలి: చంద్రబాబు

01:28 PM

స్థానిక ఎన్నికలు వద్దు: ఉద్యోగ సంఘాల నేత

01:24 PM

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన రాహుల్

01:17 PM

ఏనుగు మృతి కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

01:14 PM

కాసేపట్లో జైలు నుండి విడుదల కానున్న అఖిల ప్రియ

01:09 PM

పంత్ తో నాకు విభేదాలు : వికెట్ కీపర్ సాహా

01:06 PM

ఆర్‌ఆర్‌ఆర్‌కు షాకిచ్చిన నటి

12:59 PM

నిరాహార దీక్షకు దిగిన ఐక్యవేదిక నేతల అరెస్ట్

12:52 PM

కోల్గేట్‌ సంస్థకు జరిమానా విధించిన వినియోగదారుల ఫోరం

12:37 PM

ప్రేమోన్మాది సునీల్ కుమార్ అరెస్ట్...

12:31 PM

ఏలూరులో విషాదం...

12:30 PM

కేటీఆర్ సీఎం అవగానే టీఆర్ఎస్ లో బాంబు పేలుతుంది : బండి

12:20 PM

శశికళను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని కోరిన దినకరన్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.