Oct 23,2019 08:55PM
హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వం, వైసీపీ నేతలపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ దుమ్మెత్తిపోశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏఫీ ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్ పై ఉందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వానికి పరిపాలన చేతకాకనే చంద్రబాబు పాలనపై లేనిపోని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధాని అమరావతిని చంపేసి ప్రయత్నం చేస్తున్నారని, అందుకే, డబ్బులు లేవని చెబుతున్నారని ప్రభుత్వంపై ఆరోపించారు. చంద్రబాబు సర్కార్ అప్పులు చేసిందని వైసీపీ నేతలు గోలపెడుతున్నారని, నాడు తమ సర్కార్ రూ.22 వేల కోట్లు అప్పులు చేస్తే, వైసీపీ ప్రభుత్వం కేవలం మూడు నెలల్లోనే రూ.18 వేల కోట్లు అప్పు చేయడం నిజామా? కాదా? అని ప్రశ్నించారు. ఖజానా ఖాళీ అవ్వలేదని, ఖజానాకు తాళం వేస్తే ఆర్థిక పరిస్థితి బాగుంటుందని సూచించారు.