Oct 18,2019 03:36PM
నిర్మల్ : పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకోని నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి రక్త నిధి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని జిల్లా ఎస్పీ శ్రీ.సి.శశిధర్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేశ భద్రత కోసం దేశం వ్యాప్తంగా పోలీసులు ప్రాణత్యాగాలు చేస్తున్నారని, పోలీసులు అందిస్తున్న సేవలకు ప్రజల నుండి గుర్తింపు వున్న లేకున్నా పోలీసులు మాత్రం ప్రజల రక్షణ కోసం తమ విధులను కోనసాగిస్తారని తెలిపారు.