Oct 18,2019 12:27PM
కడప : స్కూటర్ ను లారీ ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం పోరుమామిళ్ల మండలంలో చోటు చేసుకుంది. పోరుమామిళ్ల మండలం అక్కలరెడ్డిపల్లి సమీపంలో లారీ, స్కూటర్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో స్కూటర్పైనున్న పోరుమామిళ్ల పట్టణం తురకకోట వీధికి చెందిన మౌలాలి (22) అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మౌలాలి కి 25 రోజుల ముందు విహహమైనట్లు తెలిపారు. మౌలాలి మరణవార్త విన్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.