అమరావతి: తన జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశామని.. కానీ ఇంత అరాచకం ఎప్పుడూ లేదని టీడీపీ నేత కళా వెంకట్రావ్ పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కమిటీలు నియమిస్తామన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీ కార్యకర్తలపై జరిగే దాడులను ఎదుర్కొంటామన్నారు. భవిష్యత్తులో దాడులు జరగకుండా ఆందోళన చేపడతామని కళా వెంకట్రావ్ స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm