హైదరాబాద్: వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. కట్నం తీసుకురావడం లేదంటూ భార్యపై కక్ష పెంచుకున్న భర్త.. భార్యపై పెట్రోలు పోసి నిప్పంటించి.. అనంతరం తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు కసాయి భర్త. వరంగల్ జిల్లాలోని కరీమాబాద్లో సోమవారం ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వ్యసనాలకు బానిసైన మృతుడు బండి భాస్కర్ రూ. 20 లక్షల అప్పు చేశాడు. భార్య పుట్టింటి నుంచి డబ్బులు తేవాలని నిత్యం వేధింపులకు గురి చేశాడు. భార్య డబ్బు తీసుకురావడం లేదన్న అక్కసుతో భాస్కర్..భార్య(విజయ)పై కక్ష పెంచుకున్నాడు. భార్యపై ఆగ్రహంతో ఊగిపోతున్న భాస్కర్ భార్యపై పెట్రోలు పోసి..అనంతరం తనపై పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. దీంతో భార్యభర్తలు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇదీ ఇలా ఉండగా గత 20 రోజుల క్రితం భర్తపై భార్య పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసింది. అయినా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఈ దారుణం జరిగిందని, పోలీసులు చర్యలు తీసుకుంటే విజయ బతికుండేదని తన బంధవులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm