హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఇవాళ ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో 2.3 కిలోల బంగారం లభించింది. ముందస్తు సమాచారంతో డీఆర్ఐ అధికారులు విమానాన్ని తనిఖీ చేశారు. ఈ క్రమంలో సీటు కింద ఉన్న లైఫ్ జాకెట్లో బంగారు బిస్కెట్లను గుర్తించారు. దీంతో అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో కువైట్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 160 గ్రాముల బంగారం బయటపడింది. వాటిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అధికారులు విచారిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm