హైదరాబాద్ : మరో యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది భార్య. ఆ తర్వాత ఇద్దరికి బడితపూజ చేసింది. కొత్తగూడెం, గాజులరాజాం బస్తీలో కేబుల్ ఆపరేటర్గా పనిచేస్తున్న రాజు 12 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొన్ని నెలలుగా రాజు.. మరో యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. భర్తపై అనుమానం రావడంతో భార్య నిలదీసింది. అదేంలేదంటూ తప్పించుకున్నాడు. దీంతో భర్తపై ఆమె నిఘా పెట్టింది. వేరే యువతి ఇంటికి భర్త వెళ్లిన తర్వాత బయట గెడ పెట్టి.. బంధువులకు ఫోన్ చేసింది. వారిముందే భర్తతోపాటు ఆ యువతిని చితకబాదింది. ఈలోగా సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి వారిని స్టేషన్కు తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm