హైదరాబాద్ : ఈరోజు నిర్వహించిన టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. సమావేశం వివరాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. రూ.2,937 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్ కు ఆమోదం లభించినట్టు తెలిపారు. ఉగాది నుంచి శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తామని చెప్పారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం నిర్వహిస్తామని వివరించారు. దేశంలోని అన్ని టీటీడీ కల్యాణ మండపాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. టీటీడీ వేద పాఠశాలను ఎస్వీ వేద విజ్ఞాన పీఠంగా పేరు మార్చాలని తీర్మానం చేశామని వెల్లడించారు. తిరుపతి బర్డ్ ఆసుపత్రి పాత భవనంలో చిన్నపిల్లల ఆసుపత్రి ఏర్పాటుకు రూ.9కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm