హైదరాబాద్ : వినియోగదారుల సౌలభ్యం కోసం రవాణా శాఖ తీసుకొచ్చిన ఎనీ వేర్-ఎనీ టైం సేవలకు గుర్తింపు లభించింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ సంస్థ ఎక్సలెన్సీ పురస్కారాన్ని ప్రకటించింది. డిజిటల్ టెక్నాలజీ సభలో కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు ఈ అవార్డును ఆన్లైన్ ద్వారా స్వీకరించారు. వినియోగదారులు, దరఖాస్తుదారుల సౌలభ్యం కోసం సాంకేతిక మేథాతో లైసెన్స్ రెన్యువల్, డూప్లికేట్ లైసెన్స్లు, చిరునామా మార్పిడి, బ్యాడ్జ్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్, తదితర వాటిని ఆన్లైన్ ద్వారా రవాణా శాఖ అందుబాటులోకి తీసుకొచ్చి ఈ సేవలను అందిస్తోందని కమిషనర్ పేర్కొన్నారు. రవాణా కార్యాలయాలకు రాకుండానే దరఖాస్తుదారులకు 17 పౌర సేవలను ఆన్లైన్లో అందిస్తున్నామన్నారు. మిగతా సేవలనూ త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు. నియమ, నిబంధనలను అనుసరిస్తూ వాహనదారులు ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా ఈ సేవలను పొందవచ్చని స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు ఆన్లైన్ ద్వారా ఆయా సేవలకు సంబంధించిన ఫీజులు చెల్లించి, సరిపడా పత్రాలు సమర్పిస్తే చాలని.. ఇతరులను ఆశ్రయించాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 24 Feb,2021 06:13PM