హైదరాబాద్: కర్ణాటకలో ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు నిరసన ర్యాలీ చేపట్టారు. ట్యూషన్ ఫీజును తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతరేకిస్తూ ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, సిబ్బంది భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. కర్ణాటక ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రయివేటు స్కూల్స్ ట్యూషన్ ఫీజును 70 శాతమే మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రయివేటు టీచర్లు, యజమాన్యాలు, సిబ్బంది రాష్ట్ర రాజధాని బెంగళూరులో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. దాదాపు 3 వేల మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది రోడ్లపైకి వచ్చి నిరసనలో పాల్గొన్నారు. బెంగళూరు ప్రధాన రైల్వే స్టేషన్ నుంచి ప్రముఖ నిరసన ప్రదేశం ఫ్రీడమ్ పార్క్ వరకు నిరసన ర్యాలీని చేపట్టారు. ట్యూషన్ ఫీజు తగ్గింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అదేవిధంగా టీచర్లకు గ్రాంట్లు విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm