హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది. ఈ నేపథ్యంలో నిపుణులు కీలక సూచన చేశారు. అందుబాటులో ఉన్న టీకాలను సత్వరమే వినియోగించాలని సూచించారు. వాటి ఎక్స్పైరీ గడువు 6 నెలలు మాత్రమే ఉంటుందని, కాబట్టి వీలైనంత త్వరగా అందరికీ టీకాలు వేయాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న టీకాల వినియోగానికి గడువు అవి తయారైనప్పటి నుంచి ఆరు నెలలు మాత్రమేనని చెబుతున్నారు.
మన దేశంలో ప్రస్తుతం రెండు కంపెనీల టీకాలను తొలి దశలో ఇస్తున్నారు. ఇందులో ఓ కంపెనీ ఇప్పటికే 2 కోట్ల డోసులను ప్రభుత్వానికి అందించింది. మరో 60 లక్షల డోసులు కంపెనీ వద్ద ఉన్నాయి. మరో సంస్థ వద్ద కూడా 2 కోట్ల డోసులు నిల్వ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 16న దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 20 లక్షల మందికి మాత్రమే టీకాలు వేశారు. అందుబాటులో ఉన్న టీకాలను ఆరు నెలల లోపు వినియోగించుకోలేకపోతే అవన్నీ ఎందుకూ పనికిరాకుండా పోతాయి. ఈ నేపథ్యంలో టీకా వినియోగ గడువును తయారీ తేదీ నుంచి గరిష్టంగా ఏడాదిపాటు ఉండేలా చూడాలని కంపెనీలు యోచిస్తున్నాయి. ఇందుకోసం పరిశోధనలు ప్రారంభించాయి. శాస్త్రవేత్తల ప్రయత్నాలు ఫలిస్తే మానవాళికి మరింత మేలు జరుగుతుందని భావిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 27 Jan,2021 11:33AM