అమరావతి: అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పుట్లూరు మండలం కొండాపురంలో టాటాఏస్, లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సమాచారం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. ఈఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm