అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ల సంఖ్య రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 158 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో 8,87,010కి కరోనా కేసులు చేరాయి. అయితే ఆదివారం రాష్ట్రంలో కరోనా మరణాలేమీ నమోదు కాలేదు. ఇప్పటివరకు కరోనాతో 7,147 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 1,476 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 8,78,387 మంది రికవరీ అయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm