హైదరాబాద్ : రాష్ర్ర్టంలో రైతులు పండించిన పసుపుకు మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలని, పసుపు బోర్డు ఏర్పాటుకు తక్షణం చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకులు శ్రీ భట్టి విక్రమార్క మల్లు డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ర్టంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు బాధ్యతను ఒకరి మీద ఒకరు తోసుకుంటూ నాటకాలు ఆడుతూ రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారన్నారు. రెండు ప్రభుత్వాలు వెంటనే రైతుల ఇబ్బందులపై దృష్టి పెట్టాలని , మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ర్రంలో ప్రతి ఏటా వేలాది ఎకరాల్లో పసుపు సాగు చేస్తున్నారని , రైతుల కష్టానికి తగ్గ ఫలితం వుండటం లేదన్నారు..ఈ సంవత్సరం కూడా నిజామాబాద్ జిల్లాలో దాదాపు 40, 624 ఎకరాల్లో పంట వేశారని, నిర్మల్ లో 26, 165 వేల ఎకరాలు ,జగిత్యాలలో 34 ,078 ఎకరాలు, వరంగల్ రూరల్లో 16 ,739 ఎకరాలు, భూపాలపల్లిలో 1766 ఎకరాలు, మహబూబాబాద్ లో 10,234 ఎకరాలు, వికారాబాద్ లో 4200 ఎకరాలు, పెద్దపల్లిలో 1491 ఎకరాలు, సంగారెడ్డిలో 1388 ఎకరాలు, వరంగల్ అర్బన్ లో 1091ఎకరాలు, కరీంనగర్ లో 633 ఎకరాలు ,ఆదిలాబాద్ లో 362 ఎకరాలు, కామారెడ్డిలో191 ఎకరాలు, మంచిర్యాల లో 140 ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడంలో 138 ఎకరాలు, ఖమ్మం లో 77 ఎకరాలు, జనగాం లో 50 ఎకరాలు రంగారెడ్డి లో 25 ఎకరాలు, సూర్యాపేట 8 ఎకరాలు, మెదక్ ఎకరాలు, సిద్దిపేట లో 2 ఎకరాలు లో మొత్తం 1,39,698 ఎకరాలు లో పంట వేశారన్నారు.. మద్దతు ధర కల్పించకపోవడం వల్ల రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని, పెట్టిన పెట్టుబడులు వచ్చే పరిస్థితి కన్పించడం లేదని రైతులు వాపోతున్నారన్నారు. గతంలో 8 ఏళ్ళ క్రితం క్వింటాలు ధర 15 వేలు పలకగా ప్రస్తుతం 6 వేలకు మించి రావడం లేదని, కేవలం నాలుగు నుండి ఐదు వేలు మాత్రమే లభిస్తోందని దాంతో తాము నష్టపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు.
రైతులు ఎన్ని రకాలుగా ఆందోళనలు చేసినా రెండు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ధర నిర్ణయించి రాష్ర్ట ప్రభుత్వం లేఖ ఇస్తే కేంద్రం ఆలోచిస్తుందని బీజేపీ నేతలు చెబుతుంటే.. కాదు మద్దతు ధర నిర్ణయించాల్సింది కేంద్రం అని రాష్ర్ర్ట ప్రభుత్వం, టీఆర్ఎస్ నాయకులు అంటున్నారని, బాధ్యతను ఒకరి మీద మరొకరు పెడుతూ రైతులను ఇబ్బందులు, కష్టాల పాలు చేస్తున్నారన్నారు. తక్షణం పుసుపు పసుపు బోర్డును ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని, మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలని, అప్పటి వరకు రాష్ర్ర్ట ప్రభుత్వమే కొనుగోలు చేయాలని శ్రీ భట్టి విక్రమార్క మల్లు డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 24 Jan,2021 05:26PM